జనవరి 26న రాజ్పథ్లో కవాతు చేస్తాం
కొత్త సాగు చట్టాల రద్దు కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఆరు విడతల చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వని నేపథ్యంలో సోమవారం మరో దఫా సంప్రదింపులకు రంగం సిద్ధమైన వేళ...తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు.
4వ తేదీ చర్చలు విఫలమైతే.ఆందోళనే : కిసాన్ మోర్చా
కేంద్రంపై ఒత్తిడి పెంచేలా దేశవ్యాప్త కార్యాచరణ
ఈనాడు, దిల్లీ: కొత్త సాగు చట్టాల రద్దు కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఆరు విడతల చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వని నేపథ్యంలో సోమవారం మరో దఫా సంప్రదింపులకు రంగం సిద్ధమైన వేళ...తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 4వ తేదీ చర్చలు సఫలమవుతాయని భావిస్తున్నామని, ఒకవేళ అవి విఫలమైతే.. గణతంత్ర దినోత్సవం (ఈనెల 26) రోజు దిల్లీలోని రాజ్పథ్లో రైతు కవాతు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారిక పరేడ్ పూర్తయిన తర్వాత ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇతర వాహనాలతో తమ కవాతు ఉంటుందని సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. శనివారం దిల్లీలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన తొలి విలేకర్ల సమావేశంలో సమన్వయ కమిటీలోని ఏడుగురు రైతు నేతలు మాట్లాడారు. ‘‘మేం శాంతియుతంగానే ఉద్యమం కొనసాగించాలనుకుంటున్నాం. మీరు(ప్రభుత్వం) మూడు సాగు చట్టాలు రద్దుచేయండి, లేదంటే మమ్మల్ని ఖాళీచేయించడానికి భద్రతా బలగాలనైనా ఉపయోగించండి అని చర్చలు మొదలైన రోజే ప్రభుత్వానికి చెప్పాం. ఇప్పడు నిర్దిష్టమైన కార్యాచరణ చేపట్టే సమయం ఆసన్నమైంది. తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా డిమాండ్ల పరిష్కారం కోసం దిల్లీ సరిహద్దుల్లో శాంతియుత ఉద్యమం చేపట్టి ఈ నెల 26వ తేదీకి రెండు నెలలు పూర్తవుతుంది. అందుకే డిమాండ్ల సాధన దిశగా మా సంకల్పాన్ని చాటడానికి ప్రజాధికార దినోత్సవమైన రిపబ్లిక్ డే రోజు రాజ్పథ్లో కవాతు నిర్వహించాలని నిర్ణయించాం’’ అని రైతు నేతలు బల్బీర్సింగ్ రాజేవాల్, దర్శన్పాల్, గుర్నాంసింగ్ చాదుని, అశోక్ ధావలె, జగ్జిత్సింగ్ దల్లేవాల్, అభిమన్యు కొహాడ్, యోగేంద్ర యాదవ్లు వెల్లడించారు.
రెండు హామీలపై ఉత్తర్వులేవీ?
గత నెల 30న జరిగిన ఆరో విడత చర్చల్లో రెండు చిన్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ వాటిపై ఇప్పటి వరకు లిఖితపూర్వకంగా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని రైతుల నేతలు తెలిపారు. రైతు ప్రయోజనాలతో ముడిపడిన, కీలకమైన పెద్ద డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు.
ఇదీ ఉద్యమ కార్యాచరణ
కొత్త వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే దిశగా ఈ నెల 26వ తేదీ వరకు కార్యాచరణను సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. రైతుల నిరసనలపై ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ఈనెల 6 నుంచి 20 వరకు 15రోజుల పాటు ‘దేశ్ జాగృతి అభియాన్’ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు, ధర్నాలు చేపడతారు. బోగి, సంక్రాంతిలను రైతు సంకల్ప దినోత్సవాలుగా పాటిస్తారు. మూడు చట్టాల ప్రతులను బోగి మంటల్లో దహనం చేయనున్నట్లు మోర్చా పేర్కొంది. 18న మహిళా రైతు దినోత్సవం, 23న నేతాజీ సుభాష్చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆజాద్ హింద్ కిసాన్ దివస్ను నిర్వహిస్తారు. ఆ రోజు అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ అధికార నివాసాల ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు రైతు నేతలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో 4వ తేదీ చర్చలు విఫలమైతే 6వ తేదీన కుంద్లి-మనేసర్-పల్వల్ ఎక్స్ప్రెస్హైవేపై ట్రాక్టర్లతో కవాతు నిర్వహిస్తామన్నారు.
వృద్ధ రైతు ఆత్మహత్య
వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనల్లో ఇద్దరు మనుమరాళ్లతో కలిసి పాల్గొంటున్న సర్దార్ కశ్మీర్ సింగ్ (75) అనే రైతు శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని రాంపుర్ జిల్లా బిలాస్పుర్కు చెందిన ఈ రైతు గాజీపుర్ సరిహద్దుల్లోని శిబిరం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్డిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కొత్త చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. తన ఇద్దరు మనుమరాళ్లకు, కష్టాల్లో ఉన్న వివాహితురాలైన కుమార్తెకు చేయూతనందించాల్సిందిగా రైతు నేతలకు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
మొండి వైఖరి వీడండి : కాంగ్రెస్
రైతుల డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని కాంగ్రెస్ హితవు పలికింది. ఉద్యమంలో పాల్గొన్న పలువురు రైతులు మృతిచెందటంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. 57 మంది అన్నదాతలు ప్రాణాలు అర్పించినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్దయతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సుర్జేవాలా ట్వీట్ చేశారు. రైతుల మృతిపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ప్రాణ త్యాగాలు చేస్తుంటే భాజపా తన కర్కశత్వాన్ని చాటుకుంటోందని ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ