Konijeti Rosaiah: దిగంతాలకు దిగ్గజం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా సేవలు అందించిన రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, ఉపన్యాస చతురుడు కొణిజేటి రోశయ్య
రాజకీయ దురంధరుడు రోశయ్య కన్నుమూత
భౌతికకాయం వద్ద సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ నివాళులు
సోనియా, రాహుల్ సంతాపం
తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాపదినాలు
ఈనాడు, హైదరాబాద్- అమీర్పేట, న్యూస్టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా సేవలు అందించిన రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, ఉపన్యాస చతురుడు కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. శనివారం ఉదయం ఇంట్లో ఆయనకు బీపీ తగ్గి పల్స్ పడిపోగా.. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. దారిలోనే ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రోశయ్యకు భార్య శివలక్ష్మి, కుమారులు శివ, మూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు.ఆయన మృతి సమాచారం తెలియడంతో పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రోశయ్య నివాస ప్రాంతమైన అమీర్పేట ధరమ్కరం రోడ్డులో విషాద ఛాయలు అలముకున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుమారులు, కుమార్తెతో మాట్లాడి ఓదార్చారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి కారణంగా శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు సంతాప దినాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించాయి.
రోశయ్య పార్థివదేహానికి పుష్పాంజలి ఘటిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్,
పక్కన బుద్ధప్రసాద్, కేవీపీ, మంత్రులు శ్రీనివాస్గౌడ్, తలసాని తదితరులు
నేడు గాంధీభవన్కు భౌతికకాయం
ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్కు తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలియ చేశాయి. మధ్యాహ్నం 12.30 వరకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆదివారం గాంధీభవన్లో రోశయ్యకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు తూంకుంట పురపాలకపరిధి దేవరయాంజల్లోని రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. వీటిని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అంత్యక్రియలకు తమ తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరవుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి వెల్లంపల్లి శనివారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకొని రోశయ్యకు నివాళులు అర్పించారు.
తరలివచ్చిన నేతలు
రోశయ్య భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఉదయం 10.30గంటలకు ఆయన నివాసానికి తరలించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు తదితరులు నివాళి అర్పించారు. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్ మహేశ్వర్రెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు.
రోశయ్య సతీమణిని పరామర్శిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
రోశయ్య కుమారుడితో మాట్లాడిన సోనియా
రోశయ్య మరణం పట్ల జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్గాంధీలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.రోశయ్య మరణవార్తను రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వారికి తెలియజేశారు. రోశయ్య కుమారుడు శివసుబ్బారావుతో సోనియా ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పతాకం అవనతం
గాంధీభవన్, న్యూస్టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త తెలియగానే గాంధీభవన్పై పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సహా ముఖ్యనేతలు ఆయన చిత్రానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీభవన్తో రోశయ్యకు విడదీయలేని సంబంధం ఉందని నేతలు మననం చేసుకున్నారు. ఆయన ఏ పదవిలో ఉన్నప్పటికీ దాదాపు ప్రతిరోజూ గాంధీభవన్కు వచ్చేవారని గుర్తుచేసుకున్నారు. అందరినీ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండేవారని పార్టీ నాయకులు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.
రోశయ్య భౌతికకాయంపై కాంగ్రెస్ పతాకాన్ని ఉంచి నివాళి అర్పిస్తున్న రేవంత్రెడ్డి,
రోశయ్య కుమారుడు శివసుబ్బారావు, వీహెచ్
రోశయ్య స్మారక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి
సీఎం కేసీఆర్ను కలవాలని కాంగ్రెస్ నిర్ణయం
హైదరాబాద్లో రోశయ్య మెమోరియల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్అలీ తెలిపారు. ఈ మేరకు పీసీసీ కార్యవర్గం, పీఏసీ సంయుక్త సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు దీనిని అందచేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం గాంధీభవన్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రోశయ్యకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశం అనంతరం షబ్బీర్అలీ, కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇతర అంశాలున్నా.. రోశయ్య సేవలు, మరణంపైనే చర్చించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!