Konijeti Rosaiah: దిగంతాలకు దిగ్గజం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా సేవలు అందించిన రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, ఉపన్యాస చతురుడు కొణిజేటి రోశయ్య
రాజకీయ దురంధరుడు రోశయ్య కన్నుమూత
భౌతికకాయం వద్ద సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ నివాళులు
సోనియా, రాహుల్ సంతాపం
తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాపదినాలు
ఈనాడు, హైదరాబాద్- అమీర్పేట, న్యూస్టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా సేవలు అందించిన రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, ఉపన్యాస చతురుడు కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. శనివారం ఉదయం ఇంట్లో ఆయనకు బీపీ తగ్గి పల్స్ పడిపోగా.. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. దారిలోనే ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రోశయ్యకు భార్య శివలక్ష్మి, కుమారులు శివ, మూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు.ఆయన మృతి సమాచారం తెలియడంతో పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రోశయ్య నివాస ప్రాంతమైన అమీర్పేట ధరమ్కరం రోడ్డులో విషాద ఛాయలు అలముకున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రోశయ్య కుటుంబసభ్యులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుమారులు, కుమార్తెతో మాట్లాడి ఓదార్చారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి కారణంగా శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు సంతాప దినాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రకటించాయి.
రోశయ్య పార్థివదేహానికి పుష్పాంజలి ఘటిస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్,
పక్కన బుద్ధప్రసాద్, కేవీపీ, మంత్రులు శ్రీనివాస్గౌడ్, తలసాని తదితరులు
నేడు గాంధీభవన్కు భౌతికకాయం
ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు రోశయ్య భౌతికకాయాన్ని గాంధీభవన్కు తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలియ చేశాయి. మధ్యాహ్నం 12.30 వరకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దూతగా రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆదివారం గాంధీభవన్లో రోశయ్యకు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు తూంకుంట పురపాలకపరిధి దేవరయాంజల్లోని రోశయ్య వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. వీటిని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అంత్యక్రియలకు తమ తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరవుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి వెల్లంపల్లి శనివారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకొని రోశయ్యకు నివాళులు అర్పించారు.
తరలివచ్చిన నేతలు
రోశయ్య భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఉదయం 10.30గంటలకు ఆయన నివాసానికి తరలించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు తదితరులు నివాళి అర్పించారు. తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్ మహేశ్వర్రెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు.
రోశయ్య సతీమణిని పరామర్శిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
రోశయ్య కుమారుడితో మాట్లాడిన సోనియా
రోశయ్య మరణం పట్ల జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్గాంధీలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.రోశయ్య మరణవార్తను రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వారికి తెలియజేశారు. రోశయ్య కుమారుడు శివసుబ్బారావుతో సోనియా ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పతాకం అవనతం
గాంధీభవన్, న్యూస్టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త తెలియగానే గాంధీభవన్పై పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సహా ముఖ్యనేతలు ఆయన చిత్రానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీభవన్తో రోశయ్యకు విడదీయలేని సంబంధం ఉందని నేతలు మననం చేసుకున్నారు. ఆయన ఏ పదవిలో ఉన్నప్పటికీ దాదాపు ప్రతిరోజూ గాంధీభవన్కు వచ్చేవారని గుర్తుచేసుకున్నారు. అందరినీ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండేవారని పార్టీ నాయకులు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.
రోశయ్య భౌతికకాయంపై కాంగ్రెస్ పతాకాన్ని ఉంచి నివాళి అర్పిస్తున్న రేవంత్రెడ్డి,
రోశయ్య కుమారుడు శివసుబ్బారావు, వీహెచ్
రోశయ్య స్మారక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి
సీఎం కేసీఆర్ను కలవాలని కాంగ్రెస్ నిర్ణయం
హైదరాబాద్లో రోశయ్య మెమోరియల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్అలీ తెలిపారు. ఈ మేరకు పీసీసీ కార్యవర్గం, పీఏసీ సంయుక్త సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు దీనిని అందచేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం గాంధీభవన్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రోశయ్యకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశం అనంతరం షబ్బీర్అలీ, కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇతర అంశాలున్నా.. రోశయ్య సేవలు, మరణంపైనే చర్చించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు