ఉన్నత విద్యలో వెనుకబాటు!
ఉన్నత విద్యలో అసమానతలతో పాటు తరగతి గదిలో చెప్పే పాఠాలను అర్థం చేసుకోవడంలో విద్యార్థులు వెనకబడుతున్నారు.తెలంగాణలోని 31 శాతం కాలేజీలకు యూజీసీˆ లేదా ఇతర
అర్థం చేసుకోవడంలో 9 శాతం కాలేజీల్లోని విద్యార్థులే మెరుగు
సెస్, రాష్ట్ర ఉన్నతవిద్యామండలి సర్వేలో వెల్లడి
ఈనాడు,హైదరాబాద్; ఉన్నత విద్యలో అసమానతలతో పాటు తరగతి గదిలో చెప్పే పాఠాలను అర్థం చేసుకోవడంలో విద్యార్థులు వెనకబడుతున్నారు.తెలంగాణలోని 31 శాతం కాలేజీలకు యూజీసీˆ లేదా ఇతర కౌన్సిళ్ల గుర్తింపు లేదు. అసలు వీటి నిధులు తీసుకోవడానికి 88 శాతం సంస్థలకు అర్హత లేదని హైదరాబాద్లోని ఆర్థిక, సామాజిక అధ్యయన సంస్థ(సెస్) నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. క్లాసురూముల్లో చెప్పే పాఠాలను అర్థం చేసుకోవడంలో కొందరు విద్యార్థులు బాగా వెనకబడి ఉన్నారని 95 శాతం విద్యాసంస్థలు నివేదించాయి. ఇలాంటి పరిస్థితి 98.5 శాతం మెడికల్ కాలేజీల్లో ఉంటే, 96 శాతం ఇంజినీరింగ్, 95 శాతం డిగ్రీ , 94 శాతం మేనేజ్మెంట్, కామర్స్, 92.3 శాతం ఫార్మసీˆ-నర్సింగ్ కాలేజీల్లో ఉంది. సెస్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా విద్యారంగంపై అధ్యయనం చేసేందుకు 2020 జులైలో ప్రత్యేకంగా ఓ సెల్ను ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలపై సెస్కు చెందిన చంద్రశేఖర్, వెంకటనారాయణలు అధ్యయనం చేసి రూపొందించిన ప్రాథమిక నివేదికలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
* రాష్ట్రంలో మొత్తం 2,084 ఉన్నత విద్యాసంస్థలుండగా, 1,575 కాలేజీల్లో అధ్యయనం చేశారు. ఇంజినీరింగ్-టెక్నాలజీ, డిగ్రీ, ఫార్మసీ-నర్సింగ్, వైద్య, టీచర్ ఎడ్యుకేషన్, మేనేజ్మెంట్ కామర్స్, హోటల్-టూరిజం, న్యాయ ఇలా మొత్తం తొమ్మిది రకాల కళాశాలలను అధ్యయనం కోసం ఎంపిక చేసుకొన్నారు.వీటిలో 50.4 శాతం గ్రామీణ, 49.6 శాతం నగర,పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
* సర్వే చేసిన 1,575 విద్యాసంస్థల్లో ములుగు జిల్లాలో ఒకే ఒక ఉన్నత విద్యాసంస్థ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గద్వాల, భూపాలపల్లి, వనపర్తి జిల్లాల్లో మూడేసి కళాశాలలున్నాయి. అత్యధికంగా హైదరాబాద్లో 320 ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 230, నల్గొండలో 135, కరీంనగర్లో 122 ఉన్నాయి. సర్వే చేసిన ఉన్నత విద్యాసంస్థల్లో 1,379 (87.6శాతం) ప్రైవేటు అన్ఎయిడెడ్ కాలేజీలు కాగా, ప్రభుత్వ యాజమాన్యంలోనివి 140(9 శాతం). 56(3.6) ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలున్నాయి. అన్నింటిలోనూ ప్రైవేటు విద్యాసంస్థలదే ఆధిపత్యం ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది, డిగ్రీ కాలేజీల్లో కూడా 84 శాతం ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి.
* పాఠాలను విద్యార్థులందరూ ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారన్నదానిపై 9 శాతం విద్యా సంస్థల్లో మాత్రమే సమాన స్థాయిలో అర్థం చేసుకొనే పరిస్థితి ఉందని ఆయా సంస్థలు చెప్పాయని నివేదిక వెల్లడించింది. మిగిలిన 91 శాతం సంస్థల్లోని విద్యార్థులు బాగా వెనకబడి ఉన్నట్లు సర్వే తెలిపింది. ఎసీˆ్స,ఎసీˆ్ట,ఓబీసీˆ, మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించేందుకు యూజీసీˆ ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టినా, ఇది ఉందని కూడా చాలా సంస్థలకు తెలియదు. 2012-17 మధ్య రాష్ట్రంలో 2.7 శాతం విద్యా సంస్థలు మాత్రమే యూజీసీˆ నుంచి పునశ్చరణ తరగతులకిచ్చే సదుపాయాన్ని ఉపయోగించుకొన్నాయి. ఒక్కో విద్యాసంస్థకు సంవత్సరానికి రూ.ఏడు లక్షలు ఆర్థికసాయం అందుతుంది. ఉన్నత విద్యలో ఉన్న లోపాలను ఈ నివేదిక విశ్లేషించింది.
సర్వే చేసిన కాలేజీల్లో 9.3 లక్షల మంది విద్యార్థులు ఉండగా, సరాసరిన ఒక్కో ఇంజినీరింగ్ కాలేజీలో 1,500 మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది. డిగ్రీ కళాశాలల్లో 561 మంది, మెడికల్ 329, మేనేజ్మెంట్-కామర్స్లో 322, ఫార్మసీˆ-నర్సింగ్లో 311 మంది ఉన్నారు. అధ్యాపకుల సంఖ్యలో కూడా సరాసరిన ఒక్కో ఇంజినీరింగ్ కాలేజీలో 111 మంది ఉండగా, వైద్యకళాశాలలో 58, ఫార్మసీ-నర్సింగ్లో 30, డిగ్రీలో 21 మంది మాత్రమే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం