పసుపు పండగకు పోటెత్తిన జనం
మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: ‘క్విట్ జగన్- సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదం ఏపీలోని ప్రతి ఇంట్లో మార్మోగాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుపడదని,....
అట్టహాసంగా మహానాడు ప్రారంభం
క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్
ఈ నినాదం ఇంటింటా మార్మోగాలి
ప్రారంభోపన్యాసంలో చంద్రబాబు
మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: ‘క్విట్ జగన్- సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదం ఏపీలోని ప్రతి ఇంట్లో మార్మోగాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుపడదని, ఆయన దిగిపోతే తప్ప మంచి రోజులు రావని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో శుక్రవారం ప్రారంభమైన తెదేపా మహానాడు వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. మూడేళ్ల విరామం తర్వాత భారీ ఎత్తున మహానాడు జరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి జనం పోటెత్తారు. మండే ఎండలనూ లెక్కచేయకుండా, సుదూర ప్రాంతాల నుంచి ఉత్సాహంగా కదలివచ్చారు. చిన్న, పెద్ద, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువజనం సందడికి కొదవేలేదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారుల ఆనందానికి అంతే లేదు. ఎక్కడెక్కడి నుంచో రైళ్లు, బస్సుల్లోను, ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేసుకుని మరీ వచ్చారు. నాయకుల ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా వారంతట వారే తరలివచ్చారు. భారీ జనసందోహాన్ని ఉద్దేశించి అధినేత చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మూడేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకు దిశానిర్దేశం చేసుకోవాల్సి ఉందన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి... మోసపూరిత సంక్షేమం, అవినీతితో జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారని.. అలాంటి వైకాపా ప్రభుత్వాన్ని, పాలకుల్ని నడిరోడ్డుపై నిలదీయాల్సిన బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు. ఈ మూడేళ్లలో జగన్, ఆయన అనుచరుల ఆదాయాలు పెరగ్గా, ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయని, వారి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఆస్తుల విలువలు పడిపోయాయని పేర్కొన్నారు. అధిక ధరలు, పన్నులతో ప్రజల్ని బాదేసి... రాష్ట్రాన్ని జగన్ దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఈ ‘బాదుడే.. బాదుడు’ను ప్రతి చెవిలో వేయాల్సిన బాధ్యత తెదేపా కార్యకర్తలదేనని సూచించారు. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో శుక్రవారం ఉదయం తెదేపా మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. 25 మంది ఎంపీల్ని, అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తానంటూ ఎన్నికలకు ముందు చెప్పిన జగన్మోహన్రెడ్డి ఇప్పుడు కేంద్రం ముందు మెడలు దించారని విమర్శించారు. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిధులు సహా ఏమీ సాధించలేకపోయారని ధ్వజమెత్తారు.
డయాఫ్రమ్ వాల్ అంటే జగన్కు తెలుసా?
‘రివర్స్ టెండర్ల పేరిట పోలవరం ప్రాజెక్టును జగన్ నాశనం చేశారు. దానివల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో అదే అత్యంత కీలకం. అదే లేకపోతే నీళ్లే నిల్వ ఉంచలేని పరిస్థితి. అసలు జగన్కు డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో, కాఫర్ డ్యామ్ అంటే ఏంటో తెలుసా? ఆయన అనాలోచిత, కక్షపూరిత చర్యలవల్ల ఇప్పుడు రైతులు, రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. ఏం పాపం చేసిందని రూ.2లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్ల సంపద సృష్టించే అమరావతిని నాశనం చేశారో జగన్ సమాధానం చెప్పాలి. మా హయాంలో మేము 25వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశాం. మూడేళ్లలో వైకాపా ప్రభుత్వం కొత్తగా ఒక్క కిలోమీటరు రోడ్డైనా నిర్మించిందా? 30లక్షల ఇళ్లు కడతామని చెప్పిన జగన్ .. మూడేళ్లలో మూడిళ్లు అయినా నిర్మించలేకపోయారు.
కోనసీమలో చిచ్చుకు వైకాపాయే కారణం. ఆ పార్టీకి నిజంగానే అంబేడ్కర్పై అభిమానముంటే తెదేపా హయాంలో తలపెట్టిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రాజెక్టును ఎందుకు నిలిపేశారు? ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్గా ఉన్నప్పుడే అంబేడ్కర్కు భారతరత్న లభించింది.
వ్యవసాయ మోటార్లకు మీటర్లపై పోరాడాలి
వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటానికి రైతులంతా సిద్ధం కావాలి. వారికి తెదేపా మద్దతుగా ఉంటుంది. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్తు మీటర్లు తీసేసింది ఎన్టీఆరే. అవి ఏర్పాటు చేస్తే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. రైతన్నలను కోరుతున్నా. ప్రభుత్వంపై పోరాడండి. రాష్ట్రంలో రైతుల నుంచి కొన్న ధాన్యానికి డబ్బులిచ్చే పరిస్థితే లేదు. వ్యవసాయానికి ఈ ప్రభుత్వం నుంచి సహకారమే లేదు.
బీసీ ఛాంపియన్ ఎలా అవుతారు?
తూర్పు కాపులు, కొప్పుల వెలమల సహా మరికొన్ని బీసీ కులాల్ని తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగిస్తే వారి తరఫున మాటైనా మాట్లాడని, తెదేపా మాజీ నాయకుడైన వ్యక్తికి వైకాపా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. మైనారిటీలకు 4% రిజర్వేషన్ల కల్పనను వ్యతిరేకించిన ఆ వ్యక్తికి రాజ్యసభ స్థానం ఎలా ఇస్తారు? మీ పార్టీ సీట్లు అమ్ముకుంటే అమ్ముకోండి. మీకు నచ్చినవారికి ఇచ్చుకోండి. అంతే తప్ప అవాస్తవాలు చెప్పొద్దు.
పోలీసులూ... ఉన్మాది చేతిలో బలైపోవొద్దు
అసాంఘిక శక్తులు, రౌడీలు, తీవ్రవాదుల్ని అణిచివేయటానికి తెదేపా హయాంలో పోలీసుల్ని వినియోగించాం. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలపై ప్రతాపం చూపటానికి వినియోగిస్తున్నారు. తెదేపా కార్యకర్తలు ఎవరూ పోలీసు కేసులు, లాఠీలకు భయపడాల్సిన అవసరం లేదు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకూ ప్రతి ఒక్క పోలీసుకూ చెబుతున్నా. మీరెవరూ అనవసరంగా ఉన్మాది చేతిలో బలైపోవొద్దు. మీరు తప్పుడు పనులు చేస్తే విడిచిపెట్టం.
నిద్రలేని రాత్రులు గడిపా
తెదేపాను స్థాపించి 40 ఏళ్లు అయింది. గతంలో ఎన్నడూ లేనన్ని ఇబ్బందులు ఈ మూడేళ్లలో ఎదుర్కొన్నాం. అచ్చెన్నాయుడు సహా పార్టీ నాయకులు అనేక మందిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తుంటే నిద్రలేని రాత్రులు గడిపా.ఉన్మాద పాలన రాష్ట్రానికి శాపమైంది. దద్దమ్మ పాలన వల్ల రాష్ట్రం పరువుపోయింది. ఏపీ చరిత్రను తెదేపా కంటే ముందు, తెదేపా తర్వాత అని చదువుకోవాలి.
* పెట్రోలు, డీజిల్పై కేంద్రం పన్నులు తగ్గించినా వైకాపా ప్రభుత్వం తగ్గించలేదు. గ్యాస్ ధరలు, విద్యుత్తు ఛార్జీలు భారీగా పెరిగాయి. విద్యుత్తు సరఫరా ఉండదుగానీ.. ఛార్జీలను బాదుతున్నారు. అమ్మఒడి అన్నారు.. నాన్న బుడ్డి తెచ్చి అంతకు మించి దోచేస్తున్నారు. తెదేపా హయాంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. ఇంట్లో ఉన్న మహిళలకూ రక్షణ లేదు. మద్యం, గంజాయి, డ్రగ్స్ పుణ్యమా అని ఏపీ నేరాంధ్రప్రదేశ్గా మారిపోయింది’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
40% సీట్లు యువతకే..
మరో 40ఏళ్ల పాటు తెదేపా ఇదే ఉత్సాహంతో ఉండాలంటే పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించాలి. అందుకే రాబోయే ఎన్నికల్లో 40% సీట్లు యువతకే ఇస్తాం. ఎన్టీఆర్ ఆత్మగౌరవం తెస్తే... నేను ఆత్మవిశ్వాసం కల్పించాను. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం మరిన్ని ఆలోచనలు చేస్తున్నా. 5వేల మంది కార్యకర్తలకు రూ.100కోట్ల బీమా పరిహారం ఇప్పించాం. నీరు-చెట్టు బిల్లులు న్యాయస్థానంలో పోరాడి సాధించాం. కార్యకర్తల ఆరోగ్యం, ఆదాయం పెంచేందుకు కొత్త కార్యక్రమాన్ని తలపెడతాం. అవసరమైతే కొన్ని ఆసుపత్రుల్ని ఎంప్యానల్ చేయించి.. తెదేపా కార్యకర్తలకు రాయితీపై, ఉచితంగా చికిత్స చేయిస్తాం. తెదేపాకు కార్యకర్తలే ఆస్తి. వారిని సమర్థంగా ఉపయోగించుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
విద్యుత్ సరఫరాపై చర్చకు సిద్ధం
విద్యుత్ రంగంపై మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవ ప్రకటనలు చేస్తూ లోక్సభ ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు.