PM CARES: కరోనా బాధితులకు భరోసా
కరోనా మహమ్మారి సృష్టించిన పెను విపత్తులో ఆప్తుల్ని కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాథలుగా మారిన చిన్నారులకు సాంత్వన చేకూర్చే వివిధ చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. కన్నవారి మృతితో అనాథలైన చిన్నారుల జీవితానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు విద్యనందించే ఏర్పాటు చేయనున్నారు. బాధిత పిల్లలు 18 ఏళ్ల వయసుకు వచ్చే నాటికి వారి పేరున రూ.10 లక్షల మూల నిధిని పీఎంకేర్స్ ఫర్ చిల్డ్రన్ ద్వారా ప్రభుత్వం సమకూర్చుతుంది. కార్మిక రాజ్య బీమా సంస్థ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థల సభ్యుల కుటుంబాలకు చేయూతనిచ్చే చర్యల్ని ప్రకటించింది.
తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక భద్రత
18 ఏళ్లకు చేరుకునే నాటికి రూ.10 లక్షల మూలనిధి
అప్పటి నుంచి అయిదేళ్ల పాటు నెలవారీ భృతి
ఆర్జించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబానికి పింఛను
ఉద్యోగి చనిపోతే చెల్లించే బీమా ప్రయోజనాల పెంపు
కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయాలు
ఈనాడు - దిల్లీ
ప్రస్తుత సంక్లిష్ట సమయంలో ఒక సమాజంగా పిల్లల బాగోగులను చూసుకోవడంతో పాటు ఉజ్వల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మనదే. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయినవారు, ఉన్న ఒక తల్లినో తండ్రినో పోగొట్టుకున్న వారు, చట్టపరమైన సంరక్షకులు, దత్తత తల్లిండ్రులను కోల్పోయిన వారందరికీ పీఎంకేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా చేయూతనందిస్తాం. దాతలు పీఎంకేర్స్ ఫండ్కు మరింత ఉదారంగా విరాళాలు అందించడం వల్లనే ఇది సాధ్యమవుతోంది.
- ప్రధాని మోదీ
కరోనా మహమ్మారి సృష్టించిన పెను విపత్తులో ఆప్తుల్ని కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాథలుగా మారిన చిన్నారులకు సాంత్వన చేకూర్చే వివిధ చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. కన్నవారి మృతితో అనాథలైన చిన్నారుల జీవితానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు విద్యనందించే ఏర్పాటు చేయనున్నారు. బాధిత పిల్లలు 18 ఏళ్ల వయసుకు వచ్చే నాటికి వారి పేరున రూ.10 లక్షల మూల నిధిని పీఎంకేర్స్ ఫర్ చిల్డ్రన్ ద్వారా ప్రభుత్వం సమకూర్చుతుంది. కార్మిక రాజ్య బీమా సంస్థ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థల సభ్యుల కుటుంబాలకు చేయూతనిచ్చే చర్యల్ని ప్రకటించింది. మోదీ నేతృత్వంలో శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పిల్లలే ఈ దేశ భవిష్యత్తు, వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్ది బలమైన భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
* ప్రత్యేక పథకం కింద పీఎంకేర్స్ నిధితో ప్రతి చిన్నారి 18 ఏళ్లకు చేరుకునే సమయానికి వారి పేరున రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మూల నిధిగా ఉపయోగిస్తారు.
* ఆ నిధి నుంచి 18వ సంవత్సరం నుంచి అయిదేళ్లపాటు నెలవారీ భృతి మంజూరు చేస్తారు. ఉన్నత విద్యకు వచ్చిన సమయంలో పిల్లల వ్యక్తిగత అవసరాలకు ఈ భృతి ఉపయోగపడుతుంది.
* 23 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత రూ.10 లక్షల నిధిని వ్యక్తిగత, వృత్తిగత అవసరాల కోసం ఒకేసారి తీసుకోవడానికి వీలు కల్పిస్తారు.
పదేళ్లలోపు వారికి పాఠశాల విద్య
* తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు సమీప కేంద్రీయ విద్యాలయంలో, లేదా ప్రైవేటు పాఠశాలలో డే స్కాలర్గా ప్రవేశం కల్పిస్తారు.
* ఒకవేళ చిన్నారి ప్రైవేటు పాఠశాలలో చేరితే విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం వారి బోధనా రుసుములను పీఎంకేర్స్ నిధుల ద్వారా చెల్లిస్తారు.
* యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల కోసమూ పీఎం కేర్స్ నుంచి చెల్లింపులు జరుగుతాయి.
11-18 ఏళ్లలో రెసిడెన్షియల్ చదువులు
* 11-18 వయసు వారికి సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయలాంటి కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు.
* ఒకవేళ చిన్నారి... సంరక్షకులు/అవ్వాతాతలు/సమీప బంధువుల సంరక్షణలో ఉన్నట్లయితే వారికి సమీపంలోని కేంద్రీయ విద్యాలయం, ప్రైవేటు విద్యా సంస్థల్లో డే స్కాలర్ కింద ప్రవేశం కల్పిస్తారు.
* ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరితే విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం బోధనా రుసుములను పీఎంకేర్స్ ద్వారా చెల్లిస్తారు.
* యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాల కోసమూ పీఎంకేర్స్ నిధుల నుంచి డబ్బు ఇస్తారు.
ఉన్నత విద్యకు సాయం
* మన దేశంలో వృత్తి విద్యా కోర్సులు చేయడానికి, ఉన్నత విద్య అభ్యసించడానికి అవసరమయ్యే ఖర్చుల కోసం విద్యారుణ నిబంధనల కింద రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. ఆ రుణాలపై వడ్డీని పీఎంకేర్స్ నిధుల నుంచి చెల్లిస్తారు.
* అర్హులైన పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద అండర్ గ్రాడ్యుయేట్/వొకేషనల్ కోర్సులు చేసే పిల్లలకు బోధనా రుసుములు/కోర్సు రుసుముకు సమానమైన ఉపకార వేతనాలను చెల్లిస్తారు. ప్రస్తుతం ఉన్న స్కాలర్షిప్ పథకాల కిందికి రాని వారికి పీఎంకేర్స్ నుంచి ఉపకార వేతనాలకు సమానమైన మొత్తాన్ని చెల్లిస్తారు.
ఆరోగ్య బీమా
* కన్నవారిని కోల్పోయిన చిన్నారులందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తారు. వీరికి 18 ఏళ్లు వచ్చేంత వరకూ ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని పీఎంకేర్స్ నిధుల నుంచే సమకూర్చుతారు.
పింఛను, బీమాతో కుటుంబాలకు ధీమా
కొవిడ్ కారణంగా సంపాదించే వ్యక్తిని కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు.
ఈఎస్ఐసీ కింద కుటుంబ పింఛను
ఉద్యోగి మృతి చెందితే వర్తింపజేసే కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) పింఛను పథకం ప్రయోజనాన్ని కొవిడ్తో మృతి చెందినా బాధిత కుటుంబాలకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. మరణించిన వ్యక్తిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు దివంగత ఉద్యోగి రోజువారీ వేతనంలో సగటున 90శాతానికి సమానమైన మొత్తాన్ని పింఛను కింద అందించనున్నారు.
* బాధిత కుటుంబం పింఛను పొందాలంటే...బీమా కలిగిన వ్యక్తి మరణానికి కనీసం మూడు నెలల ముందు ఈఎస్ఐసీ ఆన్లైన్ పోర్టల్లో నమోదై ఉండాలి.
* బీమా కలిగిన వ్యక్తి ఏడాదిలో కనీసం 78 రోజుల పాటు పనిచేసి వేతనం పొందినట్లుగా నమోదై ఉండాలి. 2020 మార్చి 24 నుంచి ఈ ప్రయోజనాన్ని వర్తింపజేస్తారు. 2022 మార్చి 24 వరకు దీన్ని కొనసాగిస్తారు.ఈడీఎల్ఐ గరిష్ఠ ప్రయోజనం పెంపు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు చెందిన...ఎంప్లాయిస్ డిపాజిట్ అనుసంధానిత బీమా పథకం(ఈడీఎల్ఐ) కింద బీమా ప్రయోజనాలను పెంచడంతో పాటు సరళీకృతం చేశారు. కొవిడ్ వల్ల మరణించే ఉద్యోగి కుటుంబీకులకు దీని కింద ఇచ్చే గరిష్ఠ బీమా ప్రయోజనాన్ని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు.
* రూ.2.5 లక్షల కనిష్ఠ బీమా ప్రయోజనాన్ని పునరుద్ధరించారు. ఈ ప్రయోజనాన్ని 2020 ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్లు వర్తింపజేస్తారు.
* ఒప్పంద/క్యాజువల్ కార్మికులు చనిపోవడానికి ముందు ఒకే సంస్థలో 12 నెలల పాటు విధులు నిర్వహించి ఉండాలన్న నిబంధనను సరళీకరించారు. పూర్తి మార్గదర్శకాలను త్వరలో కేంద్ర కార్మికశాఖ విడుదల చేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా