HYD: గ్రేటర్లో వడివడిగా.. పల్లెల్లో నెమ్మదిగా
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో 57 శాతం లక్ష్యాన్ని పూర్తిచేసింది. జూన్15 నాటికి గృహనిర్మాణశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.67 లక్షల ఇళ్ల నిర్మాణం
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం తీరిది..
ఈనాడు - హైదరాబాద్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో 57 శాతం లక్ష్యాన్ని పూర్తిచేసింది. జూన్15 నాటికి గృహనిర్మాణశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.67 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇందులో దాదాపు 50 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన చోట కొద్దిరోజులుగా పంపిణీ మొదలుకాగా, రానున్నరోజుల్లో పెద్దసంఖ్యలో లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు 1,20,637, పట్టణ ప్రాంతాలకు 70,420, జీహెచ్ఎంసీకి లక్ష ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.10,192.61 కోట్ల ఖర్చయింది. నిర్మాణ పనులు, నిధుల విడుదలలో గ్రేటర్ హైదరాబాద్ ముందుండగా..ఆ తర్వాత పట్టణ ప్రాంతాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.
* గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ అంచనా వ్యయం రూ.6,716.44 కోట్లు కాగా, రూ.2,087.92 కోట్ల (31.08 శాతం) పనులే జరిగాయి.
* పట్టణ ప్రాంతాల్లో రూ.4,248.10 కోట్లకు గాను రూ.1,697.98కోట్ల పనులు(39.96శాతం) పూర్తయ్యాయి.
* గ్రేటర్ హైదరాబాద్లో అంచనా వ్యయం రూ.8,115.06 కోట్లు కాగా రూ.6,406.71 కోట్లు (78.94శాతం) ఖర్చు చేశారు.
* జూన్ 15 నాటికి 1,67,360 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు గృహనిర్మాణశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయింది జీహెచ్ఎంసీలోనే. లక్ష మంజూరుచేస్తే 84,555 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఆ తర్వాత- 15,773కు 10,245తో సిద్దిపేట జిల్లా రెండోస్థానంలో, 14,555కు 6,255 ఇళ్లతో ఖమ్మం జిల్లా మూడోస్థానంలో ఉన్నాయి.
* కొన్ని జిల్లాల్లో పదులు, వందల సంఖ్యలోనే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. నారాయణపేట జిల్లాకు 1,803 మంజూరు చేస్తే పూర్తయినవి 44 మాత్రమే. వికారాబాద్ జిల్లాలో 4,323 ఇళ్లకు 442..కుమురంభీంలో 1,223కు 496..గద్వాలలో 2,470కు 605.. నాగర్కర్నూల్లో 3,210కు 668, మేడ్చల్లో 2,350కు 763, వరంగల్ గ్రామీణ జిల్లాలో 4,118కు 989 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది.
స్టీలు ధరల పెరుగుదలతో గుత్తేదారుల అనాసక్తి
మంజూరు చేసిన రెండు పడకగదుల ఇళ్లలో ఇంకా 21.87 శాతం ఇళ్ల నిర్మాణం అసలు మొదలేకాలేదు. దీనికి ప్రధానకారణం గుత్తేదారులు ముందుకు రాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. మిగతా ప్రాజెక్టులు, పనులతో పోలిస్తే రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంతో వచ్చే లాభం తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. కొవిడ్ కాలం నుంచి స్టీలు, సిమెంటు ధరలు గణనీయంగా పెరగడం మరింత ప్రభావాన్ని చూపిస్తోందని అధికారులు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవతీసుకుని మాట్లాడిన చోట గుత్తేదారులు ముందుకు వస్తున్నారు. మిగతాచోట్ల రెండుపడక గదుల ఇళ్ల పనులు ముందుకు సాగట్లేదు. మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఇంకా రూ.8,886.99 కోట్ల నిధులు కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా