Charles Freer Andrews:మతం కోసం వచ్చి.. భారత బంధువై..
‘స్వరాజ్యం వస్తోంది మోహన్!’... 1940లోనే అంపశయ్యపై ఉండి భవిష్య వాణి వినిపించిందో కంఠం! ఆ మోహన్- మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ... ఆప్యాయంగా అలా పిలిచిన వ్యక్తి చార్లెస్ ఫ్రీర్
‘స్వరాజ్యం వస్తోంది మోహన్!’... 1940లోనే అంపశయ్యపై ఉండి భవిష్య వాణి వినిపించిందో కంఠం! ఆ మోహన్- మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ... ఆప్యాయంగా అలా పిలిచిన వ్యక్తి చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్! క్రైస్తవ మతాచార్యుడిగా వచ్చి... ఆంగ్లేయుల అకృత్యాలను వ్యతిరేకించి... భారత స్వాతంత్య్ర ఆర్తిని ప్రపంచానికి వినిపించిన భారతీయ ఆప్తుడు ఆండ్రూస్.
ఇంగ్లాండ్లో 1871లో జన్మించి క్రైస్తవ మతాచార్యుడిగా మారిన ఆండ్రూస్ ప్రచారం కోసం 1904 మార్చి 20న ముంబయిలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి దిల్లీ వెళ్లి కేంబ్రిడ్జి మిషన్లో చేరారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో తత్వశాస్త్రం బోధించటానికి కుదిరారు. ఆ సమయానికి భారత్లో జాతీయోద్యమం అనూహ్య మార్పులకు లోనవుతోంది. 1905లో బెంగాల్ విభజనతో ఆందోళన ఉద్ధృతమవుతున్న దశ. భారతీయులపై తన స్వదేశం బ్రిటన్ కుటిలనీతిని, ఆంగ్లేయుల అకృత్యాలను అర్థం చేసుకున్న ఆండ్రూస్ భారతీయుల పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్నారు. జాతీయోద్యమానికి మద్దతుగా రంగంలోకి దిగారు. కానీ... తెల్లవాడు, పైగా క్రైస్తవ మిషనరీగా వచ్చిన ఆయన్ను భారతీయులు నమ్మలేదు. ఆంగ్లేయ గూఢచారిగా అనుమానించారు. మరోవైపు... బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయన్ను తమ వాడిగా చూడలేదు. వచ్చిన పని మరచి... భారతీయుడిలా మారి భారతీయుల పక్షాన మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోయింది. హిందీ కూడా నేర్చుకొని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయటంతో... ఉపకారవేతనాల జాబితాలోంచి ఆండ్రూస్ పేరును తొలగించింది బ్రిటిష్ సర్కారు.
అనుబంధం కుదిరింది..
సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేప్పుడు... రాజకీయ అంశాలను కళాశాలలో చర్చించరాదంటూ బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆండ్రూస్ దీన్ని ఉల్లంఘించారు. దీంతో... కాలేజీపై ప్రభుత్వం కన్నెర్రజేయటంతో పాటు... ఆయనపై నిఘా పెంచింది. రవీంద్రనాథ్ ఠాగూర్, గోపాల కృష్ణ గోఖలేలతో ఏర్పడ్డ స్నేహం ఆయన్ను భారత జాతీయ కాంగ్రెస్ వైపు నడిపించింది. ఇంతలో... గోఖలే సూచన మేరకు ఆండ్రూస్ దక్షిణాఫ్రికా వెళ్లి గాంధీజీని కలిశారు. అప్పటికే అక్కడ గాంధీజీ సత్యాగ్రహ ప్రయోగాలు మొదలెట్టారు. ఇద్దరికీ మంచి అనుబంధం కుదిరింది. భారత్కు వచ్చి జాతీయోద్యమ పగ్గాలు చేపట్టాలని గాంధీని తొందరపెట్టిన వారిలో ఆండ్రూస్ కూడా ఒకరు. అంతేగాక... బ్రిటన్లో తనకున్న పలుకుబడిని కూడా భారత జాతీయోద్యమ విజయానికి ఉపయోగించారు ఆయన. ప్రధాన మంత్రులు, మంత్రులు, అనేక మంది ఎంపీలతో పదేపదే అనధికారిక సంప్రదింపులు జరుపుతూ... భారత ప్రయోజనాల కోసం పోరాడేవారు. పుణె ఒప్పందం సమయంలో గాంధీ ఉపవాస దీక్ష పట్టి బలహీనమైన వేళ... లండన్లో ప్రధానమంత్రిని స్వయంగా కలసి కమ్యూనల్ అవార్డుపై తక్షణమే నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు ఆండ్రూస్. తద్వారా గాంధీ ప్రాణాలు కాపాడారు. రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్ వచ్చిన గాంధీజీని, ఆయన ప్రయోగాలను ప్రపంచ మీడియాకు పరిచయం చేసింది కూడా ఆయనే. భారత స్వాతంత్య్రోద్యమం, భారతీయుల పట్ల ప్రపంచానికి, బ్రిటన్లోని రాజకీయవర్గాల్లో సానుకూల దృక్పథం పెరగటానికి తుదికంటా కష్టపడారు. వీటితో పాటు సామాజిక సంస్కరణలు, కార్మికుల ఉద్యమాలకు మద్దతిచ్చేవారు. పేదల కష్టాలను, కడగండ్లను తుడవటానికి ఎప్పుడూ ముందుండే ఆండ్రూస్కు ఠాగూర్ ‘దీనబంధు’ అని బిరుదిచ్చారు. తన సంపాదనంతా భారత్లోని పేదలు, జాతీయోద్యమం కోసం ఖర్చు చేసిన ఆయన 1925-27 మధ్య ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పని చేశారు. సహాయ నిరాకరణోద్యమంలో అరెస్టయిన ఆండ్రూస్... అంటరానితనం నిర్మూలన కోసం నారాయణగురు, అంబేడ్కర్లతో కలసి కృషి చేశారు. ఠాగూర్ శాంతినికేతన్లో సైతం చాలారోజులు పనిచేశారు.
1935లో ఇంగ్లాండ్కు వెళ్లి 40లో తిరిగి వచ్చాక ఆండ్రూస్ జబ్బు పడ్డారు. కోల్కతాలోని ఆసుపత్రిలో చేర్చి... ప్రత్యేక చికిత్స ఇప్పించారు. కానీ ప్రత్యేక సదుపాయాలు అక్కర్లేదని... సామాన్యులతో పాటు తనకూ చికిత్స చేస్తే చాలని పట్టుబట్టిన భారత బంధువు... స్వాతంత్య్రాన్ని చూడకుండానే... 1940 ఏప్రిల్ 5న కోల్కతాలోనే కన్నుమూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్. -
‘మీ భూమికి ముప్పు..’ మూడు రూపాల్లో
తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి అయినా.. సొంతగా కొన్నదైనా.. మీ భూమికి వైకాపా ప్రభుత్వం నుంచి మూడురూపాల్లో ముప్పు ముంచుకొస్తోంది. -
మీ బిడ్డా.. మీ బిడ్డా.. అంటూనే.. మా ఆస్తులపై ‘కన్నేశావా బిడ్డా!’
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఎక్కడ నలుగురు రైతులు కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. -
సీఎం జగన్ వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి