Charles Freer Andrews:మతం కోసం వచ్చి.. భారత బంధువై..
‘స్వరాజ్యం వస్తోంది మోహన్!’... 1940లోనే అంపశయ్యపై ఉండి భవిష్య వాణి వినిపించిందో కంఠం! ఆ మోహన్- మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ... ఆప్యాయంగా అలా పిలిచిన వ్యక్తి చార్లెస్ ఫ్రీర్
‘స్వరాజ్యం వస్తోంది మోహన్!’... 1940లోనే అంపశయ్యపై ఉండి భవిష్య వాణి వినిపించిందో కంఠం! ఆ మోహన్- మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ... ఆప్యాయంగా అలా పిలిచిన వ్యక్తి చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్! క్రైస్తవ మతాచార్యుడిగా వచ్చి... ఆంగ్లేయుల అకృత్యాలను వ్యతిరేకించి... భారత స్వాతంత్య్ర ఆర్తిని ప్రపంచానికి వినిపించిన భారతీయ ఆప్తుడు ఆండ్రూస్.
ఇంగ్లాండ్లో 1871లో జన్మించి క్రైస్తవ మతాచార్యుడిగా మారిన ఆండ్రూస్ ప్రచారం కోసం 1904 మార్చి 20న ముంబయిలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి దిల్లీ వెళ్లి కేంబ్రిడ్జి మిషన్లో చేరారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో తత్వశాస్త్రం బోధించటానికి కుదిరారు. ఆ సమయానికి భారత్లో జాతీయోద్యమం అనూహ్య మార్పులకు లోనవుతోంది. 1905లో బెంగాల్ విభజనతో ఆందోళన ఉద్ధృతమవుతున్న దశ. భారతీయులపై తన స్వదేశం బ్రిటన్ కుటిలనీతిని, ఆంగ్లేయుల అకృత్యాలను అర్థం చేసుకున్న ఆండ్రూస్ భారతీయుల పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్నారు. జాతీయోద్యమానికి మద్దతుగా రంగంలోకి దిగారు. కానీ... తెల్లవాడు, పైగా క్రైస్తవ మిషనరీగా వచ్చిన ఆయన్ను భారతీయులు నమ్మలేదు. ఆంగ్లేయ గూఢచారిగా అనుమానించారు. మరోవైపు... బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయన్ను తమ వాడిగా చూడలేదు. వచ్చిన పని మరచి... భారతీయుడిలా మారి భారతీయుల పక్షాన మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక పోయింది. హిందీ కూడా నేర్చుకొని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయటంతో... ఉపకారవేతనాల జాబితాలోంచి ఆండ్రూస్ పేరును తొలగించింది బ్రిటిష్ సర్కారు.
అనుబంధం కుదిరింది..
సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేప్పుడు... రాజకీయ అంశాలను కళాశాలలో చర్చించరాదంటూ బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆండ్రూస్ దీన్ని ఉల్లంఘించారు. దీంతో... కాలేజీపై ప్రభుత్వం కన్నెర్రజేయటంతో పాటు... ఆయనపై నిఘా పెంచింది. రవీంద్రనాథ్ ఠాగూర్, గోపాల కృష్ణ గోఖలేలతో ఏర్పడ్డ స్నేహం ఆయన్ను భారత జాతీయ కాంగ్రెస్ వైపు నడిపించింది. ఇంతలో... గోఖలే సూచన మేరకు ఆండ్రూస్ దక్షిణాఫ్రికా వెళ్లి గాంధీజీని కలిశారు. అప్పటికే అక్కడ గాంధీజీ సత్యాగ్రహ ప్రయోగాలు మొదలెట్టారు. ఇద్దరికీ మంచి అనుబంధం కుదిరింది. భారత్కు వచ్చి జాతీయోద్యమ పగ్గాలు చేపట్టాలని గాంధీని తొందరపెట్టిన వారిలో ఆండ్రూస్ కూడా ఒకరు. అంతేగాక... బ్రిటన్లో తనకున్న పలుకుబడిని కూడా భారత జాతీయోద్యమ విజయానికి ఉపయోగించారు ఆయన. ప్రధాన మంత్రులు, మంత్రులు, అనేక మంది ఎంపీలతో పదేపదే అనధికారిక సంప్రదింపులు జరుపుతూ... భారత ప్రయోజనాల కోసం పోరాడేవారు. పుణె ఒప్పందం సమయంలో గాంధీ ఉపవాస దీక్ష పట్టి బలహీనమైన వేళ... లండన్లో ప్రధానమంత్రిని స్వయంగా కలసి కమ్యూనల్ అవార్డుపై తక్షణమే నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు ఆండ్రూస్. తద్వారా గాంధీ ప్రాణాలు కాపాడారు. రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్ వచ్చిన గాంధీజీని, ఆయన ప్రయోగాలను ప్రపంచ మీడియాకు పరిచయం చేసింది కూడా ఆయనే. భారత స్వాతంత్య్రోద్యమం, భారతీయుల పట్ల ప్రపంచానికి, బ్రిటన్లోని రాజకీయవర్గాల్లో సానుకూల దృక్పథం పెరగటానికి తుదికంటా కష్టపడారు. వీటితో పాటు సామాజిక సంస్కరణలు, కార్మికుల ఉద్యమాలకు మద్దతిచ్చేవారు. పేదల కష్టాలను, కడగండ్లను తుడవటానికి ఎప్పుడూ ముందుండే ఆండ్రూస్కు ఠాగూర్ ‘దీనబంధు’ అని బిరుదిచ్చారు. తన సంపాదనంతా భారత్లోని పేదలు, జాతీయోద్యమం కోసం ఖర్చు చేసిన ఆయన 1925-27 మధ్య ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పని చేశారు. సహాయ నిరాకరణోద్యమంలో అరెస్టయిన ఆండ్రూస్... అంటరానితనం నిర్మూలన కోసం నారాయణగురు, అంబేడ్కర్లతో కలసి కృషి చేశారు. ఠాగూర్ శాంతినికేతన్లో సైతం చాలారోజులు పనిచేశారు.
1935లో ఇంగ్లాండ్కు వెళ్లి 40లో తిరిగి వచ్చాక ఆండ్రూస్ జబ్బు పడ్డారు. కోల్కతాలోని ఆసుపత్రిలో చేర్చి... ప్రత్యేక చికిత్స ఇప్పించారు. కానీ ప్రత్యేక సదుపాయాలు అక్కర్లేదని... సామాన్యులతో పాటు తనకూ చికిత్స చేస్తే చాలని పట్టుబట్టిన భారత బంధువు... స్వాతంత్య్రాన్ని చూడకుండానే... 1940 ఏప్రిల్ 5న కోల్కతాలోనే కన్నుమూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెట్టేనా?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు