సూది గుచ్చకుండా సొమ్ములు జేబులోకి
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మానవత్వం మరచిన కొన్ని ఆసుపత్రులు, వాటికి వత్తాసు పలికే వైద్యులు కొత్తరకం దోపిడీకి తెరతీశారు. కొవిడ్ రోగుల అత్యవసర పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుంటూ రెమ్డెసివిర్ ఇంజక్షన్ను అధిక ధరలకు బాధితులతో
‘రెమ్డెసివిర్’ పేరిట కొన్ని ఆసుపత్రుల్లో అక్రమాలు
పోలీసు దర్యాప్తులో వెల్లడి
ఈనాడు - హైదరాబాద్
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మానవత్వం మరచిన కొన్ని ఆసుపత్రులు, వాటికి వత్తాసు పలికే వైద్యులు కొత్తరకం దోపిడీకి తెరతీశారు. కొవిడ్ రోగుల అత్యవసర పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకుంటూ రెమ్డెసివిర్ ఇంజక్షన్ను అధిక ధరలకు బాధితులతో కొనుగోలు చేయిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న నాలుగు కేసుల్లో రెమ్డెసివర్ ఇంజక్షన్లను కాసుల కక్కుర్తితో ఆసుపత్రుల నిర్వాహకులే దారిమళ్లించినట్లు గుర్తించారు. మరో కేసులో అనంతపురం ఆసుపత్రి నుంచి ఇంజక్షను బయటికొచ్చినట్లు ఎల్బీనగర్ పోలీసులు తేల్చారు.
కోలుకుంటారు అనే రోగుల విషయంలో..
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఔషధ సంస్థల నుంచి నేరుగా ఇంజక్షన్లు దిగుమతి చేసుకొని, రోగుల వద్ద నుంచి అధిక మొత్తంలో ధరలు వసూలు చేస్తున్నాయి. కృత్రిమ కొరత సృష్టిస్తూ తాము కోరినంత డబ్బును ముట్టజెప్పేలా పావులు కదుపుతున్నాయి. దళారులను రంగంలోకి దింపి వారి ద్వారా ఇంజక్షన్లను కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తున్నాయి.
కొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్తో కోలుకుంటున్న రోగికీ రెమ్డెసివిర్ అవసరమంటూ వైద్యులు చీటి రాసిస్తున్నారు. ఒక సెట్(ఆరు ఇంజక్షన్లు)ను తప్పనిసరిగా తెప్పిస్తున్నారు. వాటిలో ఒకటి లేదా రెండు ఇస్తున్నారు. మిగిలిన వాటిని పక్కన పెట్టేస్తున్నారు. రోగి చికిత్స పత్రాల్లో మాత్రం రెమ్డెసివిర్ ఇంజక్షన్లను ఇచ్చినట్లుగా రాస్తున్నారు. అలా మిగిలిన ఇంజక్షన్లను తిరిగి నల్లబజారులో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు నిగ్గు తేల్చారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
ఫలానా చోట రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయంటూ కొన్ని ఆసుపత్రుల నిర్వాహకులే సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. అది చూసి చాలా మంది వాటి కోసం అక్కడ పేర్కొన్న నంబర్లలో సంప్రదిస్తున్నారు. ఎన్నో విధాలుగా ప్రాధేయపడితే సరే ఆగండి.. మాకు తెలిసిన వ్యక్తి దగ్గర ఉన్నాయేమో కనుక్కుని చెప్తానంటూ ఫోన్ కట్ చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ కాల్ చేసి ఒక్కోదానికి రూ.40 వేలు చెబుతున్నారు.. మీ కోసం రూ.30 వేలకు మాట్లాడాను.. ఫలానా చోటుకెళ్లి తీసుకోండి అంటూ సూచిస్తున్నారు. వాళ్లు అక్కడికి వెళ్లేలోపు ఫార్మాసిస్ట్/అడ్మిన్/సెక్యూరిటీతో ఇంజక్షన్లను పంపిస్తున్నారు. ఈ విషయం దర్యాప్తులో వెల్లడైందని సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. మరికొన్ని ఆసుపత్రుల నిర్వాహకులేమో తమ చేతికి మట్టి అంటకుండా మధ్యవర్తులకు విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు.
గడువు తీరిన వాటిని అమ్మారంటూ రెండ్రోజుల కింద ఎల్బీనగర్ ఠాణాలో కేసు నమోదైంది. ఇక్కడ కూపీ లాగితే డొంక అనంతపూర్లో కదిలింది. ఓ ఆసుపత్రికి చెందిన ఫార్మాసిస్ట్ ఇంజక్షన్లను మధ్యవర్తికి విక్రయించినట్లు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.