Bandi Sanjay: అన్నీ అబద్ధాలే
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని, వీటిని ప్రచారం చేసేందుకే సభలు, సమావేశాలు పెడుతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హుజూరాబాద్లో...
62 లక్షల ఎకరాల్లో వరి సాగు అతిపెద్ద అసత్యం
డీజిల్, పెట్రోలుపై వ్యాట్ 2015లోనే పెంచారు
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే రైతులు ఆగమయ్యారు
త్రివిధ దళాలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలను వెల్లడిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. చిత్రంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ అర్వింద్
దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి మీకు నోరెలా వచ్చింది? సోయిలేకుండా ఆ వ్యాఖ్యలు చేసినందుకు త్రివిధ దళాలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలి. చైనాతో మీ రహస్య ఎజెండా ఏమిటి? అక్రమ సంపాదనను అక్కడ పెట్టుబడులుగా పెట్టి ఒప్పందాలు చేసుకుంటున్నారు
- బండి సంజయ్
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని, వీటిని ప్రచారం చేసేందుకే సభలు, సమావేశాలు పెడుతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హుజూరాబాద్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా ఆయనలో మార్పురాలేదని ఎద్దేవా చేశారు. ఇన్నేళ్లుగా కేంద్రం ధాన్యం కొంటున్నా, రాష్ట్రమే కొంటున్నట్లు అబద్ధాలు చెప్పిన సీఎం తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిల్పై వ్యాట్ను 5 శాతం తగ్గించాలన్నారు. సోమవారమిక్కడ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ తెలంగాణ ద్రోహి. రైతులెవరూ కార్లలో తిరగడం లేదు. వడ్లు కొనకపోవడంతో ఆ కుప్పలపై ప్రాణాలు విడుస్తున్నారు. రోహింగ్యాలను ఏమీచేయలేక, దేశప్రతిష్ఠ దిగజార్చేలా..సైనికుల్ని కించపరిచేలా మాట్లాడారు. హిందూ దేవతల్ని, పండుగల్ని అవమానించిన మతతత్వ పార్టీ ఎంఐఎంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?’’ అని ప్రశ్నించారు.
మీవల్లే రైతులు ఆగమయ్యారు..
మీ నిర్ణయాలతో రైతులు ఆగమయ్యారు. ఒకసారి వడ్లు వేయాలంటారు.. మరోసారి వద్దంటారు.. పత్తి అంటారు.. కొనరు. ‘ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది.. ఇందులో కేంద్రం పెత్తనం ఏంటి?’ అన్నారు. ఇన్నేళ్లుగా కేంద్రం కొంటోందా? రాష్ట్రం కొంటోందా? స్పష్టం చేయాలి. 62 లక్షల ఎకరాల్లో వరి పంట అనేది అతిపెద్ద అబద్ధం. కొందరు రైస్మిల్లర్లతో కుమ్మక్కై రీసైకిల్ చేసిన రేషన్ బియ్యాన్ని కేంద్రానికి ఇస్తోంది. వానాకాలం పంటకు సంబంధించిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 2021 అక్టోబరు నుంచి 2022 జనవరి వరకు కొనుగోలు చేస్తామని ఆగస్టు 31న కేంద్రం లేఖ రాసింది. దానిని దాచిపెట్టి మోసపు మాటలు మాట్లాడుతున్నారు. రైతు చట్టాలపై దిల్లీ వెళ్తే గతంలో ఎవరూ సహకరించలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రద్దుచేయాలని ఆ చట్టాల్లో ఉందా? ఉన్నట్లు మీరు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా.
వ్యాట్ ఎందుకు తగ్గించరు?
పెట్రోలు, డీజిల్పై తెరాస ఏకాణా పెంచలేదన్నారు. 2015లో పెట్రోల్పై 4శాతం, డీజిల్పై 5 శాతం పెంచారు. లీటరు పెట్రోలుపై కేంద్రానికి రూ.27, రాష్ట్రానికి రూ.28 చొప్పున వ్యాట్ వస్తోంది. కేంద్రానికి వచ్చేదానిలో రూ.12 తిరిగి రాష్ట్రానికే వెళ్తోంది. లీటరు పెట్రోలుపై రూ.40 తీసుకుంటూ ధరలు పెంచలేదంటున్నారు.24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించగా ఇక్కడ ఎందుకు చేయరు? పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఎందుకు లేఖ ఇవ్వరు? కేంద్రం ఏడేళ్లలో రూ.40 వేల కోట్లు ఇచ్చిందని అబద్ధం చెప్పారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయి. ఇందులో రైల్వే, రోడ్లు, పథకాలు తదితరాల కింద రూ.2.52 లక్షల కోట్లు తిరిగి వచ్చాయి. పన్ను తిరిగి చెల్లింపుల కింద రూ.1.04 లక్షల కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1.22 లక్షల కోట్లు ఇచ్చింది. జాతీయ రహదారులకు రూ.40 వేల కోట్లు ఇవ్వగా.. ఏడేళ్లలో 91 వేల కి.మీ.గా ఉన్న జాతీయ రహదారుల పొడవు 1.49 లక్షల కి.మీ.కు చేరింది. కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందని అడుగుతున్నారు. ప్రాంతీయ రింగు రోడ్డు ఇచ్చిందా? ఇవ్వలేదా? చెప్పాలి.
చేపల పులుసు రహస్యం ప్రజలకు తెలుసు..
కృష్ణాజలాల్లో రాష్ట్రాన్ని మోసం చేశారు. తెలంగాణకు 575 టీఎంసీలు రావలసి ఉండగా 299 టీఎంసీలకు ఒప్పుకొని ఒక్కసారి కాదు.. నాలుగుసార్లు సంతకం పెట్టారు. ఏడేళ్ల క్రితమే సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరిస్తే న్యాయమైన వాటా దక్కేది. కేంద్రానికి లేఖలు రాస్తూ కాలయాపన చేశారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. అక్కడ జరిగిన చేపల పులుసు రహస్యం ప్రజలందరికీ తెలుసు. ఏపీ జీవో-203 జారీ చేసి, ప్రాజెక్టులు కడుతున్నా స్పందించలేదు. అఖిలపక్ష సమావేశానికి వెళ్లలేదు. పక్కరాష్ట్రంలో కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోలేనిది... దేశంలో ఇప్పుడు అగ్గిరాజేస్తమంటున్నారు. ప్రధాని కావాలనుకుంటున్నా ఆయన్ని దేశంలో ఎవరూ పట్టించుకోరు, నమ్మరు.
నక్సలైట్లు పోస్టర్లు వేసినా భయపడలేదు
నన్ను చంపేస్తామని నక్సలైట్లు పోస్టర్లు వేసినా భయపడలేదు. ఇప్పుడు భయపడతానా? నమ్మిన సిద్ధాంతం, కాషాయజెండా కోసం నాతో పాటు భాజపా కార్యకర్తలందరూ ప్రాణాలిచ్చేందుకు సిద్ధం. ప్రజల కోసం అనేకసార్లు జైలుకు వెళ్లాం. రాష్ట్రం కోసం సీఎం ఏం త్యాగం చేశారు? అమరుల ఆకాంక్షల సాధనకు భాజపా పోరాడుతుంటే.. 1400 మంది ప్రాణాల మీద మీ కుటుంబం రాజ్యం చేస్తోంది. దళితుణ్ని సీఎం చేయకుంటే మెడలు నరుక్కుంటానన్నారు.. ఏమైంది? బహిరంగసభల పేరిట జాగాలు కబ్జాచేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎవరూ స్థలం ఇవ్వడం లేదు. ఎన్ని కేసులు పెట్టినా, కుట్రలు చేసినా నమ్మిన సిద్ధాంతం కోసం మా ఎమ్మెల్యే రాజాసింగ్ పోరాడుతున్నారు. మీ దగ్గర అలాంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్లో నిన్ను ఉరికించి కొడతా అన్న వ్యక్తిని మంత్రిగా చేసుకున్నారు’’ అని తెలిపారు.
తొలిదశ రైతు రుణమాఫీ అమలు చేసేందుకు నాలుగేళ్లు పట్టింది. రెండోదఫా హామీ ఇచ్చి మూడేళ్లయినా అమలు కాలేదు. మీ సొంత నియోజకవర్గం, జిల్లాలోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి అబద్ధమా? కాదా? శాటిలైట్ చిత్రాల్లో కనిపించడం లేదని కేంద్రం చెబుతోంది. డ్రోన్, హెలీకాప్టర్, లేదా ఏ కొత్త టెక్నాలజీలతోనైనా సర్వేకు సిద్ధమేనా? మా సవాల్ స్వీకరిస్తున్నారా..!
మా గురువులు సంస్కారం, సభ్యత నేర్పారు. మీ భాష నేర్పించలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసే నేర్చుకుంటున్నా. నరుకుతా, వంచుతా వంటివి మీ మాటలే.
ఉద్యమ సమయంలో దీక్ష మొదలుపెట్టిన వెంటనే విరమించారు. తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో ఓటింగ్లో ఎందుకు పాల్గొనలేదు? అంతకన్నా పెద్ద పనేముంది? మీరు తెలంగాణ ద్రోహి కాదా?. కేంద్రమంత్రిగా ఉన్నపుడు మీ మీద కేసులు రాలేదా?.
-బండి సంజయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?