Bandi Sanjay: అన్నీ అబద్ధాలే
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని, వీటిని ప్రచారం చేసేందుకే సభలు, సమావేశాలు పెడుతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హుజూరాబాద్లో...
62 లక్షల ఎకరాల్లో వరి సాగు అతిపెద్ద అసత్యం
డీజిల్, పెట్రోలుపై వ్యాట్ 2015లోనే పెంచారు
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే రైతులు ఆగమయ్యారు
త్రివిధ దళాలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలను వెల్లడిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. చిత్రంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ అర్వింద్
దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి మీకు నోరెలా వచ్చింది? సోయిలేకుండా ఆ వ్యాఖ్యలు చేసినందుకు త్రివిధ దళాలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలి. చైనాతో మీ రహస్య ఎజెండా ఏమిటి? అక్రమ సంపాదనను అక్కడ పెట్టుబడులుగా పెట్టి ఒప్పందాలు చేసుకుంటున్నారు
- బండి సంజయ్
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని, వీటిని ప్రచారం చేసేందుకే సభలు, సమావేశాలు పెడుతున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హుజూరాబాద్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా ఆయనలో మార్పురాలేదని ఎద్దేవా చేశారు. ఇన్నేళ్లుగా కేంద్రం ధాన్యం కొంటున్నా, రాష్ట్రమే కొంటున్నట్లు అబద్ధాలు చెప్పిన సీఎం తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిల్పై వ్యాట్ను 5 శాతం తగ్గించాలన్నారు. సోమవారమిక్కడ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ తెలంగాణ ద్రోహి. రైతులెవరూ కార్లలో తిరగడం లేదు. వడ్లు కొనకపోవడంతో ఆ కుప్పలపై ప్రాణాలు విడుస్తున్నారు. రోహింగ్యాలను ఏమీచేయలేక, దేశప్రతిష్ఠ దిగజార్చేలా..సైనికుల్ని కించపరిచేలా మాట్లాడారు. హిందూ దేవతల్ని, పండుగల్ని అవమానించిన మతతత్వ పార్టీ ఎంఐఎంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?’’ అని ప్రశ్నించారు.
మీవల్లే రైతులు ఆగమయ్యారు..
మీ నిర్ణయాలతో రైతులు ఆగమయ్యారు. ఒకసారి వడ్లు వేయాలంటారు.. మరోసారి వద్దంటారు.. పత్తి అంటారు.. కొనరు. ‘ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది.. ఇందులో కేంద్రం పెత్తనం ఏంటి?’ అన్నారు. ఇన్నేళ్లుగా కేంద్రం కొంటోందా? రాష్ట్రం కొంటోందా? స్పష్టం చేయాలి. 62 లక్షల ఎకరాల్లో వరి పంట అనేది అతిపెద్ద అబద్ధం. కొందరు రైస్మిల్లర్లతో కుమ్మక్కై రీసైకిల్ చేసిన రేషన్ బియ్యాన్ని కేంద్రానికి ఇస్తోంది. వానాకాలం పంటకు సంబంధించిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 2021 అక్టోబరు నుంచి 2022 జనవరి వరకు కొనుగోలు చేస్తామని ఆగస్టు 31న కేంద్రం లేఖ రాసింది. దానిని దాచిపెట్టి మోసపు మాటలు మాట్లాడుతున్నారు. రైతు చట్టాలపై దిల్లీ వెళ్తే గతంలో ఎవరూ సహకరించలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రద్దుచేయాలని ఆ చట్టాల్లో ఉందా? ఉన్నట్లు మీరు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా.
వ్యాట్ ఎందుకు తగ్గించరు?
పెట్రోలు, డీజిల్పై తెరాస ఏకాణా పెంచలేదన్నారు. 2015లో పెట్రోల్పై 4శాతం, డీజిల్పై 5 శాతం పెంచారు. లీటరు పెట్రోలుపై కేంద్రానికి రూ.27, రాష్ట్రానికి రూ.28 చొప్పున వ్యాట్ వస్తోంది. కేంద్రానికి వచ్చేదానిలో రూ.12 తిరిగి రాష్ట్రానికే వెళ్తోంది. లీటరు పెట్రోలుపై రూ.40 తీసుకుంటూ ధరలు పెంచలేదంటున్నారు.24 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించగా ఇక్కడ ఎందుకు చేయరు? పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఎందుకు లేఖ ఇవ్వరు? కేంద్రం ఏడేళ్లలో రూ.40 వేల కోట్లు ఇచ్చిందని అబద్ధం చెప్పారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయి. ఇందులో రైల్వే, రోడ్లు, పథకాలు తదితరాల కింద రూ.2.52 లక్షల కోట్లు తిరిగి వచ్చాయి. పన్ను తిరిగి చెల్లింపుల కింద రూ.1.04 లక్షల కోట్లు, సంక్షేమ పథకాలకు రూ.1.22 లక్షల కోట్లు ఇచ్చింది. జాతీయ రహదారులకు రూ.40 వేల కోట్లు ఇవ్వగా.. ఏడేళ్లలో 91 వేల కి.మీ.గా ఉన్న జాతీయ రహదారుల పొడవు 1.49 లక్షల కి.మీ.కు చేరింది. కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందని అడుగుతున్నారు. ప్రాంతీయ రింగు రోడ్డు ఇచ్చిందా? ఇవ్వలేదా? చెప్పాలి.
చేపల పులుసు రహస్యం ప్రజలకు తెలుసు..
కృష్ణాజలాల్లో రాష్ట్రాన్ని మోసం చేశారు. తెలంగాణకు 575 టీఎంసీలు రావలసి ఉండగా 299 టీఎంసీలకు ఒప్పుకొని ఒక్కసారి కాదు.. నాలుగుసార్లు సంతకం పెట్టారు. ఏడేళ్ల క్రితమే సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరిస్తే న్యాయమైన వాటా దక్కేది. కేంద్రానికి లేఖలు రాస్తూ కాలయాపన చేశారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. అక్కడ జరిగిన చేపల పులుసు రహస్యం ప్రజలందరికీ తెలుసు. ఏపీ జీవో-203 జారీ చేసి, ప్రాజెక్టులు కడుతున్నా స్పందించలేదు. అఖిలపక్ష సమావేశానికి వెళ్లలేదు. పక్కరాష్ట్రంలో కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోలేనిది... దేశంలో ఇప్పుడు అగ్గిరాజేస్తమంటున్నారు. ప్రధాని కావాలనుకుంటున్నా ఆయన్ని దేశంలో ఎవరూ పట్టించుకోరు, నమ్మరు.
నక్సలైట్లు పోస్టర్లు వేసినా భయపడలేదు
నన్ను చంపేస్తామని నక్సలైట్లు పోస్టర్లు వేసినా భయపడలేదు. ఇప్పుడు భయపడతానా? నమ్మిన సిద్ధాంతం, కాషాయజెండా కోసం నాతో పాటు భాజపా కార్యకర్తలందరూ ప్రాణాలిచ్చేందుకు సిద్ధం. ప్రజల కోసం అనేకసార్లు జైలుకు వెళ్లాం. రాష్ట్రం కోసం సీఎం ఏం త్యాగం చేశారు? అమరుల ఆకాంక్షల సాధనకు భాజపా పోరాడుతుంటే.. 1400 మంది ప్రాణాల మీద మీ కుటుంబం రాజ్యం చేస్తోంది. దళితుణ్ని సీఎం చేయకుంటే మెడలు నరుక్కుంటానన్నారు.. ఏమైంది? బహిరంగసభల పేరిట జాగాలు కబ్జాచేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎవరూ స్థలం ఇవ్వడం లేదు. ఎన్ని కేసులు పెట్టినా, కుట్రలు చేసినా నమ్మిన సిద్ధాంతం కోసం మా ఎమ్మెల్యే రాజాసింగ్ పోరాడుతున్నారు. మీ దగ్గర అలాంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్లో నిన్ను ఉరికించి కొడతా అన్న వ్యక్తిని మంత్రిగా చేసుకున్నారు’’ అని తెలిపారు.
తొలిదశ రైతు రుణమాఫీ అమలు చేసేందుకు నాలుగేళ్లు పట్టింది. రెండోదఫా హామీ ఇచ్చి మూడేళ్లయినా అమలు కాలేదు. మీ సొంత నియోజకవర్గం, జిల్లాలోనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి అబద్ధమా? కాదా? శాటిలైట్ చిత్రాల్లో కనిపించడం లేదని కేంద్రం చెబుతోంది. డ్రోన్, హెలీకాప్టర్, లేదా ఏ కొత్త టెక్నాలజీలతోనైనా సర్వేకు సిద్ధమేనా? మా సవాల్ స్వీకరిస్తున్నారా..!
మా గురువులు సంస్కారం, సభ్యత నేర్పారు. మీ భాష నేర్పించలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసే నేర్చుకుంటున్నా. నరుకుతా, వంచుతా వంటివి మీ మాటలే.
ఉద్యమ సమయంలో దీక్ష మొదలుపెట్టిన వెంటనే విరమించారు. తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో ఓటింగ్లో ఎందుకు పాల్గొనలేదు? అంతకన్నా పెద్ద పనేముంది? మీరు తెలంగాణ ద్రోహి కాదా?. కేంద్రమంత్రిగా ఉన్నపుడు మీ మీద కేసులు రాలేదా?.
-బండి సంజయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?