CM KCR నాలుగు కోల్‌బ్లాకుల వేలం ఆపాలి

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన జేబీఆర్‌ఓసీ-3, శ్రావణ్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే -6 యూజీ కోల్‌ బ్లాకుల వేలాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ఇలా చేయడం సింగరేణిలో బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని.

Updated : 09 Dec 2021 04:59 IST

- ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన జేబీఆర్‌ఓసీ-3, శ్రావణ్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే -6 యూజీ కోల్‌ బ్లాకుల వేలాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ఇలా చేయడం సింగరేణిలో బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని... కాబట్టి వేలాన్ని నిలిపేసి, ఆ బ్లాకులను సింగరేణికే కేటాయించేలా చూడాలని ప్రధానికి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వల్ల సింగరేణి పరిధిలోని కోల్‌బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మికసంఘాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాశారు. ‘‘ఏటా 65 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లోని థర్మల్‌ పవర్‌ స్టేషన్ల అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోంది.  రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ ప్రస్తుతం 13,688 మెగావాట్లకు చేరుకుంది. దీనికోసం విద్యుదుత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా అవసరం. సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్‌ లీజులు మంజూరు చేసింది. దీనికి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ పరిస్థితుల్లో సమస్యలు తలెత్తకుండా నాలుగు కోల్‌ బ్లాకుల వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించాల’ని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని