TS News: ఉద్యోగాల భర్తీకి.. కొత్త రోస్టర్
రాష్ట్రంలో కొత్తగా భర్తీచేయబోయే ప్రత్యక్ష నియామకాల్లో కొత్త రోస్టర్ ప్రకారం పోస్టులను రిజర్వు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ విభాగాల వారీగా ఉద్యోగ ఖాళీలు గుర్తించే సమయంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్లీజోన్ల వారీగా పోస్టులకు మొదటి పాయింట్ నుంచి దీన్ని అమలు చేయనుంది. రాష్ట్రపతి నూతన నిబంధనల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల కేటాయింపు త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో
జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా అమలు?
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా భర్తీచేయబోయే ప్రత్యక్ష నియామకాల్లో కొత్త రోస్టర్ ప్రకారం పోస్టులను రిజర్వు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ విభాగాల వారీగా ఉద్యోగ ఖాళీలు గుర్తించే సమయంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్లీజోన్ల వారీగా పోస్టులకు మొదటి పాయింట్ నుంచి దీన్ని అమలు చేయనుంది. రాష్ట్రపతి నూతన నిబంధనల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల కేటాయింపు త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో ఆయా విభాగాల్లో ఏర్పడే ఖాళీలను సంబంధిత విభాగాలు త్వరలోనే గుర్తించనున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రోస్టర్ పట్టిక కీలకం. 1-100 వరకు పాయింట్లను రిజర్వేషన్ల వారీగా గుర్తించారు. ఇందులో భాగంగా గుర్తించిన ఖాళీలను రోస్టర్ పాయింట్ మేరకు (జనరల్, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వారీగా కేటాయించి) రిజర్వు చేసి ఉద్యోగ ప్రకటనలు వెలువరించడం ఆనవాయితీగా వస్తోంది. తదుపరి ప్రకటన నాటికి గుర్తించిన ఖాళీలకు గతంలో ముగిసిన పాయింట్ నుంచి వరుస క్రమంలో తీసుకుని పోస్టులు రిజర్వు చేస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉమ్మడి రాష్ట్ర రోస్టర్ ముగించి, కొత్తగా గుర్తించిన ఖాళీల భర్తీకి కొత్త రోస్టర్ అమల్లోకి తెచ్చారు. తొలి పాయింట్ నుంచి లెక్కించారు. తాజాగా రాష్ట్రపతి నూతన ఉత్తర్వులతో 10 జిల్లాలు 33 జిల్లాలుగా మారాయి. 7 జోన్లు, 2 మల్టీజోన్లు వచ్చాయి. ఈ కారణంగా పలు పోస్టుల కేటగిరీ స్థాయి మారిపోయింది. నూతన ఉత్తర్వుల ప్రకారం పలు విభాగాల్లోని జిల్లా స్థాయి పోస్టులు జోనల్గా, జోనల్వి మల్టీ జోనల్గా, జిల్లా స్థాయిగా మారాయి. రాష్ట్రస్థాయి పోస్టులు మల్టీజోనల్ కిందకు వచ్చాయి. పలు పోస్టుల కేటగిరీల్లో భారీ మార్పులు చోటుచేసుకోవడం, జిల్లాల సంఖ్య పెరగడం, కొత్త జోన్లు, మల్టీజోన్ల నేపథ్యంలో కొత్తగా గుర్తించే ఖాళీల భర్తీకి కొత్త రోస్టర్ పాటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాకే..
రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంటోంది. ఇది పూర్తయితే ఆయా జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల పరిధిలో ఖాళీల సంఖ్యపై స్పష్టత వస్తుంది. గుర్తించిన ఖాళీలకు మంత్రి మండలి ఆమోదం తీసుకున్నాక ఆర్థికశాఖ భర్తీకి అనుమతులివ్వనుంది. కొత్త రోస్టర్ ప్రకారం సంబంధిత విభాగాలు, కార్పొరేషన్లు, సొసైటీలు ఆయా పోస్టులను రిజర్వుచేసి ఓపెన్, రిజర్వుడు కేటగిరీలతో కూడిన ప్రతిపాదనల్ని నియామక ఏజెన్సీలకు పంపిస్తాయి. అలా ఇప్పటికే 70వేలకుపైగా ఖాళీలు గుర్తించినట్లు సమాచారం. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యాక, ఖాళీ పోస్టుల భర్తీ, కొత్త రోస్టర్ విధానంపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. మరోవైపు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉద్యోగ నియామకాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించిన కారణంగా రోస్టర్లోని పది ఓపెన్ కేటగిరీ పాయింట్లను ఈ వర్గాలకు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!