పెట్టుబడి పోయినట్టే
మిరప రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడి వ్యయమవుతున్న పంటల్లో మిరప ముఖ్యమైంది.
అప్పుడు తెగుళ్లు.. ఇప్పుడు వడగండ్లతో మిరపరైతు కుదేలు
ఎకరా సాగు ఖర్చు రూ.లక్ష పైనే
కీలకమైన వాణిజ్యపంటకు సర్కారు చేయూత కరవు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లిలో దెబ్బతిన్న మిరపతోట
ఈనాడు, హైదరాబాద్: మిరప రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడి వ్యయమవుతున్న పంటల్లో మిరప ముఖ్యమైంది.
దేశంలో నాణ్యమైన మిరపకాయలు తెలుగు రాష్ట్రాల్లో పండుతాయి. ఈ పంటకు గతేడాది మంచి ధర పలకడంతో ఈసారి పెద్దఎత్తున సాగుచేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు రూ.30 వేల చొప్పున కౌలుకు తీసుకున్నారు. ఇక సంకరజాతి (హైబ్రీడ్) మిరప విత్తనాలు కిలో రూ.50 వేలకు పైగా పలుకుతున్నాయి. ఒక్కో మొక్కను రూ.2 నుంచి 3లకు కొని నాటిన ఈ పంటను కాపాడుకోవడానికి రైతులు అందినకాడల్లా అప్పులు చేశారు. రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల్లో మిరప వేశారని ఉద్యానశాఖ అంచనా. ఈ వర్షాలలో ఎక్కువ శాతం తోటలు ఎంతో కొంత దెబ్బతిన్నాయి. కొన్నితోటలు చూడ్డానికి పచ్చగా కనిపిస్తున్నా తామరపురుగు, వర్షాలతో పూత, కాత రాలిపోయి దిగుబడి వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబరు నుంచి డిసెంబరు దాకా తామరపురుగు సోకడంతో పైరును కాపాడుకునేందుకు వేలాది రూపాయలు వెచ్చించి రసాయన పురుగుమందులు చల్లారు. దీనినుంచి బయటపడేలోగానే ఈ నెలలో కురిసిన అకాల, భారీ వడగండ్ల వర్షాలు మిరపతోటలను తీవ్రంగా దెబ్బతీశాయి.
* రాష్ట్రంలో పంటల బీమా పథకం అమల్లో లేకపోవడంతో మిరప రైతులకు భరోసా కరవైంది. పథకం అమల్లో ఉంటే...ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలతో కచ్చితంగా పరిహారం వచ్చేదని రైతులు అంటున్నారు.
* కేంద్రం ఏటా 24 రకాల పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్నా వాటిలో మిరప లేదు. ఇది వాణిజ్య పంట అనే సాకుతో పక్కనపెట్టింది. వ్యాపారులు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తున్నందున ఈ పంటపై రైతులకు పూచీకత్తు కరవైంది.
* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దట్టమైన అటవీ గ్రామాలైన వాజేడు మండలం చీకుపల్లి, నాగారంలో మిరప తోటలకు అపార నష్టం వాటిల్లింది.ఈ ఒక్క మండలంలోనే 1500 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా.
* రాష్ట్రం మొత్తమ్మీద 20 వేల ఎకరాల్లో మిరప తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఉద్యానశాఖ ప్రభుత్వానికిచ్చిన ప్రాథమిక అంచనాల నివేదికలో తెలిపింది. ఈ రైతులు పంట సాగుకు పెట్టిన రూ.200 కోట్ల పెట్టుబడి దాదాపు పోయిననట్టేనని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. పంటనష్టంపై పూర్తిస్థాయిలో అంచనావేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రామిరెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.
5 ఎకరాలకు రూ.5 లక్షల నష్టం
ఐదెకరాల్లో రూ.5 లక్షల పెట్టుబడి పెట్టి మిరపతోట సాగుచేశా. వర్షాలు, తెగుళ్లకు పంటల చాలావరకు నాశనమైంది. దిగుబడి ఏమీ వచ్చే అవకాశం లేనందున పెట్టుబడి కూడా చేతికి రాదు. అప్పులే మిగిలాయి. ప్రభుత్వం ఆదుకుంటేనే బయటపడగలం.
-మేకల సంతోష్, రావులపల్లి, రేగొండ మండలం
పంట పూర్తిగా నాశనమై రూ.3 లక్షల అప్పులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు పోచయ్య. తనకున్న రెండెకరాలలో ఈ సీజన్లో మిరప సాగుచేశారు. తొలుత తెగుళ్ల నుంచి పంటను కాపాడుకునేందుకు ఎకరానికి రూ.లక్షన్నర దాకా పెట్టుబడి పెట్టారు. తీరా పూత కాతగా మారిన తరవాత అకాలవర్షాలు, వడగండ్లతో పంట పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట దెబ్బతినడంతో రూ.3 లక్షల అప్పు మిగిలింది.
కొంత దెబ్బతింది...మరికొంత వాడిపోయింది
ఎన్నో ఆశలతో మిరప పంట సాగుచేస్తే చివరికి కౌలు సొమ్ము కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. 3 ఎకరాలను కౌలుకు తీసుకుని రూ.2.50 లక్షల పెట్టుబడి పెట్టాను. మా ప్రాంతంలో ఎకరానికి రూ.30 వేల దాకా కౌలు వసూలు చేస్తున్నారు. తెగుళ్లతో కొంత పాడవగా ఎలాగోలా కాపాడుకున్నాను. కానీ ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు తోటంతా దెబ్బతింది. పంట చేతికొచ్చే అవకాశం లేదు. అప్పులే మిగిలాయి. చివరికి కౌలు సొమ్ము కూడా తిరిగి రాకపోతే ఎలా బతకాలో తెలియడం లేదు.
-వాసం నీలాద్రి, జంగాలపల్లి, వాజేడు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?