సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి.
తీవ్రమైన ఎండలతో జలాశయాల్లో పెరుగుతున్న ఆవిరి
రోజూ వెయ్యి క్యూసెక్కులకుపైనే మాయం
ఈనాడు, హైదరాబాద్: భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. జలాశయాల పరిధిలో కిలోమీటర్ల కొద్దీ నీరు విస్తరించి ఉండటం వల్ల ఎండలకు వేగంగా ఆవిరవుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు.
అడుగంటిన ప్రధాన ప్రాజెక్టులు
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు మరింతగా అడుగంటాయి. జూరాల, పులిచింతల గత ఏడాదితో పోల్చితే కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
- నాగార్జునసాగర్ జలాశయంలో ఆవిరి శాతం అధికంగా ఉంది. మార్చి నెలాఖరున రోజుకు 312 క్యూసెక్కుల చొప్పున ఆవిరవగా సోమవారం 677 క్యూసెక్కులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 123.67 టీఎంసీలు ఉన్నాయి.
- శ్రీశైలం జలాశయంలో సోమవారం 234 క్యూసెక్కుల ఆవిరి ఉండగా ఈ ఏడాది ఆరంభంలో 172 క్యూసెక్కులు మాత్రమే ఉంది. 215.81 టీఎంసీలకు గాను 33.34 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 291 క్యూసెక్కుల నీరు రోజూ ఆవిరి అవుతోంది. 90.31 టీఎంసీలకుగాను 10.61 టీఎంసీలు ఉన్నాయి.
- జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 142 క్యూసెక్కుల ఆవిరి నమోదైంది. ఇక్కడ ఫిబ్రవరిలో 95 క్యూసెక్కుల నష్టం మాత్రమే ఉంది. 9.66 టీఎంసీలకు గాను 2.81 టీఎంసీలే ఉన్నాయి.
- పులిచింతలలో 100 క్యూసెక్కుల ఆవిరి నష్టం నమోదైంది. 45.77 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం కాగా 1.36 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త రూపంలో రేషన్ కార్డులు?
ప్రస్తుతం ఉన్న రేషన్ (ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. -
జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ రుసుములు
జూన్ 2 నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు పెరగనున్నాయి. -
అణువణువూ జల్లెడ పట్టాల్సిందే!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది. -
పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడాలి
పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీపడేలా విధానాలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్దేశించారు. -
జూన్ 2న ‘జయ జయహే తెలంగాణ’ ఆవిష్కరణ
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఆవిష్కరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
అమెరికా ‘వీసా’వహులకు తీపి కబురు
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా(ఎఫ్-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. -
భారత్-అమెరికా భాగస్వామ్యం.. ప్రపంచానికి భాగ్యదాయకం
భారత్-అమెరికా దేశాల ఉమ్మడి భాగస్వామ్యం యావత్ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
ఇదీ సంగతి!
-
రైస్మిల్లు వద్ద 5 రోజులుగా పడిగాపులు
రోజుల తరబడి రైస్మిల్లుల్లో ధాన్యం దించకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నామని, తగిన న్యాయం చేయాలంటూ రైతులు, కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్ 23 నుంచి
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. -
నైనీ బ్లాకులో తవ్వకాలకు తొలగిన అడ్డంకులు
ఒడిశాలోని నైనీ బ్లాకులో బొగ్గు తవ్వకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ మరో నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉంది. -
కాచిగూడ-రాయచూరు రైళ్లు 10 రోజులు రద్దు
కాచిగూడ-రాయచూరు, రాయచూరు-కాచిగూడ డెమూ రైళ్ల (నం.07477/07478)ను ఈ నెల 21 నుంచి 30 వరకు ద.మ.రైల్వేరద్దు చేసింది. -
13 నెలల్లో 30,049 ఫోన్ల రికవరీ
బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు మెరుగైన పనితీరును కనబరుస్తూనే ఉన్నారు. -
వైభవం.. నృసింహ జయంత్యుత్సవం
యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. -
ఆ ఫైనాన్స్ సంస్థతో టెస్కాబ్కు సంబంధం లేదు
శ్రీప్రియాంక ఫైనాన్స్ సంస్థతో కానీ, దాని ఖాతాదారులతో కానీ తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టెస్కాబ్)కు ఎలాంటి సంబంధం లేదని బ్యాంక్ ఎండీ మురళీధర్ తెలిపారు. -
మూడు నెలల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయండి
మత్స్యకార సంఘాల్లో సభ్యత్వానికి కొన్ని తెగలను పరిగణనలోకి తీసుకోకపోవడం, మరికొన్నింటిని తాజాగా చేర్చడం తదితర వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. -
ఎంజీఎంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం సుమారు అయిదు గంటలపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. -
కిర్గిజ్స్థాన్ నుంచి విద్యార్థులను రప్పించాలని కిషన్రెడ్డి లేఖ
కిర్గిజ్స్థాన్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్కు కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి లేఖరాశారు. -
పెద్దలకు బీసీజీ టీకా
క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుడుతోంది. -
సంక్షిప్త వార్తలు (4)
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిరక్షణ చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. -
ఈ వానాకాలం ఆశాజనకమే!
రాష్ట్రంలో వానాకాలం సీజన్ ఆశాజనకంగా ఉంటుందని, నిరుటి కంటే అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది.