ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
చేయి తడిపితే చాలు.. చెరువుల్లోనూ నిర్మాణాలకు అనుమతులు
ఏమీలేని చోట నిరభ్యంతర పత్రాల జారీకీ రూ.లక్షల్లో వసూళ్లు
నీటిపారుదల శాఖకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
ఈనాడు- హైదరాబాద్: భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగర యూనిట్కు చెందిన డీఈఈ పవన్ కుమార్ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం అక్రమాల తీరును చాటుతోంది.
ఆ నిబంధనే వారికి వరం
భవన నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొందాలంటే ఆ ప్రాంతం చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో లేదంటూ నీటిపారుదల శాఖ ధ్రువీకరించిన ఎన్వోసీని దరఖాస్తుతోపాటు సమర్పించాలనే నిబంధన ఉంది. చెరువులు, కుంటలు వంటి నీటి వనరులకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకే ఈ నిబంధనను రూపొందించారు. ఇదే కొందరు అధికారులకు ఆదాయ వనరుగా మారింది. కొన్నిచోట్ల చెరువులు, కాలువలు, నీటి వనరులేవీ లేకున్నప్పటికీ నీటిపారుదల శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవడం కష్టంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువుల్లో నిర్మాణాలు ఉన్నప్పటికీ లంచాలు తీసుకుని ఎన్వోసీలు జారీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారంపై నీటిపారుదల శాఖతోపాటు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో ప్రజావాణి కార్యక్రమంలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఆక్రమణలను అడ్డుకునేది ఎవరు?
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధి కీసర మండలంలో ఉన్న అన్నారాయణ్ చెరువు కబ్జాలకు గురవుతోందని, పరిశ్రమల నుంచి కలుషిత నీరు వదులుతున్నారని స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 2019 నుంచి 8 కాలనీలకు చెందిన వారు నిత్యం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. మూడు వైపుల నుంచి ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. అధికారులు మాత్రం అటువైపు వెళ్లడం లేదు.
- కీసర మండలంలో నాత్కాన్చెరువు, పెద్ద చెరువుల బఫర్ జోన్లలో నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ వ్యర్థాలను పడేస్తూ పెద్ద చెరువును డంపింగ్యార్డులా మారుస్తున్నారు. ఈ రెండు చెరువుల మధ్య ఉండే కాలువ కూడా ఆక్రమణలకు గురవుతోంది.
- అమీన్పూర్ పెద్ద చెరువు అలుగుతో పాటు కాలువల ప్రాంతంలో బఫర్జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లకు అనుమతులు ఇస్తుండటంతో కొనుగోలు చేస్తున్న వారు నష్టపోతున్నారు. చెరువు పూర్తి స్థాయిలో నిండిన సమయంలో ప్లాట్లు మునిగిపోతున్నాయి. ఈ చెరువు తూము, అలుగును పూర్తిగా మూసివేయడంతో వెనుక జలాలు సమీప ప్రాంతాల కాలనీలను ముంచెత్తుతున్నాయి.
- నాగోలు ప్రాంతంలో ఉన్న చెరువుల బఫర్ జోన్ల సరిహద్దులను తిరిగి సర్వే చేసి.. హద్దులు నిర్ధారించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.
- గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో మూసకుంట (ముస్కి చెరువు) బఫర్జోన్, ఎఫ్టీఎల్ పరిధులను పక్కాగా నిర్ధారించకపోవడంతో పలువురు మట్టి పోస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం అనుమతించిన లేఅవుట్కు భిన్నంగా కొందరు కుంటను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
ప్రాంతానికో రేటు కట్టి మరీ..
నీటిపారుదల శాఖలో హైదరాబాద్ సర్కిల్ పరిధిలో పలువురు ఇంజినీర్లు ఎన్వోసీలకు సంబంధించిన దస్త్రాలను పరిష్కరించడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఇద్దరు కీలక ఇంజినీర్ల మధ్య దస్త్రాల పరిశీలనకు సంబంధించి వివాదం ఏర్పడినట్లు చర్చ జరిగింది. దిగువ స్థాయి అధికారులు పరిశీలన పూర్తిచేయకపోయినా.. పైస్థాయిలోనే పరిశీలన పూర్తిచేసి ఎన్వోసీలు జారీ చేయడం ఈ వివాదానికి కారణమైనట్లు సమాచారం. పలువురు ఇంజినీర్లు ఎన్వోసీల జారీలో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలను బట్టి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు పలువురు నిర్మాణదారులు గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల కాలంలో జారీ అయిన ఎన్వోసీలపై విచారణ చేయాలని వారు కోరుతుండగా..జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటల బఫర్ జోన్, ఎఫ్టీఎల్లను నిర్ధారించడంతోపాటు సరిహద్దులు గుర్తించి.. కంచె వేస్తే తప్ప కబ్జాలను నిలువరించడం కష్టమని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీజీ 09 9999.. రూ.25.50 లక్షలు
రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్లైన్ వేలం నిర్వహించారు. -
మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్ ఆవిష్కరించారు. -
8న చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు జూన్ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో బత్తిని అమర్నాథ్గౌడ్ మాట్లాడుతూ.. 24 గంటల పాటు పంపిణీ ఉంటుందని తెలిపారు. -
తడిసిన ప్రతి గింజనూ కొంటాం
వర్షానికి తడిసిన, మొలకెత్తిన ప్రతి వడ్ల గింజనూ కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. -
మళ్లీ ఊపందుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్రావు, రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టు కాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, శ్రవణ్రావు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. -
బోనస్తో రూ.2 వేల కోట్ల భారం
వచ్చే పంట సీజన్ నుంచి సన్న వడ్లను రూ.500 బోనస్ ఇచ్చి కొంటే.. ఒక్కో సీజన్కు రూ.2 వేల కోట్ల వరకూ ప్రభుత్వంపై భారం పడనుందని రాష్ట్ర మంత్రిమండలి అంచనా వేసింది. -
తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది. -
ఈసెట్లో 95.86% ఉత్తీర్ణత
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈసెట్లో 95.86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11 బ్రాంచీల్లో ప్రవేశాలకు 23,330 మంది ఈసెట్ రాశారు. -
జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నాయి. -
భారీగా పెరిగిన విత్తన పసుపు ధర
రాష్ట్రంలో నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా పసుపు సాగవుతుంది. అధిక ఖర్చుతో కూడుకున్న ఈ పంటకు కొన్నేళ్లుగా ఆశించిన ధర రాలేదు. -
విత్తనాలకు రైతుల కుస్తీ
విత్తనాల కోసం రైతులు కుస్తీ పట్టాల్సిన దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ ఉన్న పత్తి విత్తన రకాల కోసం రైతులు ప్రైవేటు దుకాణాల ఎదుట బారులు తీరి నిల్చున్నారు. -
ఇతర రాష్ట్రాల బార్ సభ్యులనూ అనుమతించాలన్న పిటిషన్లో నోటీసులు
తెలంగాణ పరిధిలో సివిల్ జడ్జి పోస్టులకు ఇతర రాష్ట్రాల బార్ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దిల్లీ బార్ కౌన్సిల్ సభ్యుడైన వి.రాకేష్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ హృషికేశ్రాయ్, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రల ధర్మాసనం ఇటీవల విచారించింది. -
ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదే
కోర్టు తీర్పులతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. హక్కుల ఉల్లంఘన జరిగినందున పరిహారం ప్రకటించే విచక్షణాధికారం కోర్టుకు ఉందని పేర్కొంది. -
వర్సిటీలు.. అవినీతికి చిరునామాలు
సమాజానికి దిక్సూచిగా మారాల్సిన విశ్వవిద్యాలయాలు అక్రమాలు, అవినీతికి నిలయాలుగా మారాయి. ఆదర్శంగా ఉండాల్సిన ఉపకులపతు(వీసీ)లు కొందరు అక్రమార్జనే ధ్యేయంగా పాలన కొనసాగించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. -
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టై, ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా జూన్ 3 వరకు పొడిగించారు. -
రెవెన్యూ శాఖలో డీటీల పదోన్నతులకు కమిటీ
రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీని (డీపీసీ) ఏర్పాటు చేస్తూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. -
క్రష్ కేంద్రాలపై శిశు సంక్షేమ అధికారుల అధ్యయనం
రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారులకు.. సంరక్షణతో పాటు పూర్వప్రాథమిక విద్యను అందించడం, పౌష్టికాహారం, మానసిక వికాసం కోసం అంగన్వాడీ కేంద్రాలను క్రష్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. -
జూన్ మొదటి వారానికి గురుకుల ఐదోతరగతి ప్రవేశాలు పూర్తి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు తొలిమెట్టు అయిన ఐదో తరగతి ప్రవేశాల ప్రక్రియ జూన్ తొలివారానికి పూర్తిచేయాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
యాదాద్రిలో నృసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, సాయంత్రం అంకురార్పణ పర్వాలతో ఉత్సవాలకు పూజారులు, యాజ్ఞికులు శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
-
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్
-
స్వాతీ మాలీవాల్ కేసులో బిభవ్ ముంబయికి తరలింపు
-
డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో షేర్ చేసిన కేంద్రం
-
నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు : జొమాటో సీఈఓ
-
అతడి ప్రవర్తనకు భయపడ్డా: కాజల్ అగర్వాల్