ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ ఏడాది మొదటిసారి 46 డిగ్రీలకు గరిష్ఠ ఉష్ణోగ్రత
జగిత్యాల, నల్గొండ, కరీంనగర్ జిల్లాలు ఉక్కిరిబిక్కిరి
ఎండదెబ్బకు ఎనిమిది మంది మృత్యువాత
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా రాయిల్ మండలం అల్లీపూర్లో 46.1, బీర్పూర్ మండలం కొల్వాయిలో 46, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు, వీణవంక మండల కేంద్రంలో 46 డిగ్రీల ఎండ కాసింది. రాష్ట్రంలో ఈ ఏడాదికి ఇవే అత్యధికం. ఏప్రిల్ 30వ తేదీ ఉష్ణోగ్రతల్లోనూ పదేళ్ల కాలంలో ఇవే గరిష్ఠం. రాష్ట్రంలోని మరో 14 మండలాల్లో 45.5 డిగ్రీల నుంచి 45.9 డిగ్రీల మధ్య ఉన్నాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, దామరచెర్ల, త్రిపురారం మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
దప్పికతో అల్లాడి.. బావి వద్దే కుప్పకూలి..
యాదాద్రి జిల్లా పంతంగి వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉన్న ఓ వెంచర్ వద్దకు మంగళవారం ఓ గుర్తుతెలియని మహిళ(50) తీవ్ర దప్పికతో వచ్చారు. తాగేందుకు నీరివ్వాలని అక్కడున్న వారిని కోరగా.. మా వద్ద లేవని, పక్కనే ఉన్న వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లాలని చెప్పారు. దీంతో ఎండిన గొంతుతో ఆ పొలానికి ఉన్న కంచె మధ్యలో నుంచి అతికష్టమ్మీద లోనికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె దేహానికి గాయాలు కూడా అయ్యాయి. కాసేపటికి కౌలు రైతు నర్సింహ బావి వద్దకు వెళ్లి చూడగా.. ఆమె అక్కడే స్పృహతప్పి పడిపోయి కనిపించారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపు స్థానికులు పరిశీలించి చూడగా ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిసింది. మృతురాలి వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
జనజాతర సభలో సొమ్మసిల్లి
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో కుర్చీలో కూర్చుని ఉన్న అంబాల అయిలమ్మ(65) సొమ్మసిల్లి పడిపోయారు. పక్కనున్న వారు హుటాహుటిన పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమెది వీణవంక మండలం రెడ్డిపల్లిగా గుర్తించారు.
ప్రాణాలు తోడేసిన ఎండ
కామారెడ్డి జిల్లా మహ్మద్నగర్ మండలంలోని గిర్నితండాలో కడావత్ హీరాబాయ్(65) మూడు రోజులుగా ఎండలో ధాన్యం ఆరబోస్తున్నారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనేపల్లిలో సంకు గురప్ప(65) భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేవారు. మంగళవారం ఓ హోటల్ వద్ద అల్పాహారం తింటుండగా.. కళ్లు తిరిగి పడిపోయారు. స్థానికులు పరిశీలించి చూడగా అప్పటికే మృతిచెందారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చామగడ్డ మండలం జంగాలతోటకు చెందిన జె.నగేశ్(28) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతంలో జామాయిల్ కర్ర నరికే పనులకు వచ్చారు. మంగళవారం పని ప్రదేశంలోనే ఉన్నట్లుండి కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో దాసరి రాజయ్య (68) సోమవారం ఇంట్లో కిందపడడంతో కాలికి గాయమైంది. మంగళవారం వీణవంక మండలానికి తీసుకెళ్లి వైద్యం చేయించి మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చారు. కాసేపటికే అస్వస్థతకు గురై వృద్ధుడు మృతిచెందారు.
న్యూస్టుడే, చొప్పదండి, చౌటుప్పల్గ్రామీణం, జమ్మికుంట, మహ్మద్నగర్, రెంజల్, భీమారం, పాల్వంచ, శంకరపట్నం
వడ్ల వద్దే ప్రాణాలు వదిలి
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన ఐతరవేని రాజేశం(47) వ్యవసాయంతోపాటు ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగానూ పనిచేసేవారు. తాను పండించిన ధాన్యాన్ని రాగంపేట కొనుగోలు కేంద్రంలో పది రోజులుగా ఆరబోస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఎండలో ఆరబోసిన వడ్లను కలియదిప్పుతూ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
తీవ్ర అస్వస్థతతో యువజన కాంగ్రెస్ నాయకుడు..
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం గ్రామానికి చెందిన 55వ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంగాల నవీన్కుమార్(29) రెండ్రోజులుగా ఎండలో తిరగడంతో సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీజీ 09 9999.. రూ.25.50 లక్షలు
రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్లైన్ వేలం నిర్వహించారు. -
మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్ ఆవిష్కరించారు. -
8న చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు జూన్ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో బత్తిని అమర్నాథ్గౌడ్ మాట్లాడుతూ.. 24 గంటల పాటు పంపిణీ ఉంటుందని తెలిపారు. -
తడిసిన ప్రతి గింజనూ కొంటాం
వర్షానికి తడిసిన, మొలకెత్తిన ప్రతి వడ్ల గింజనూ కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. -
మళ్లీ ఊపందుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్రావు, రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టు కాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, శ్రవణ్రావు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. -
బోనస్తో రూ.2 వేల కోట్ల భారం
వచ్చే పంట సీజన్ నుంచి సన్న వడ్లను రూ.500 బోనస్ ఇచ్చి కొంటే.. ఒక్కో సీజన్కు రూ.2 వేల కోట్ల వరకూ ప్రభుత్వంపై భారం పడనుందని రాష్ట్ర మంత్రిమండలి అంచనా వేసింది. -
తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది. -
ఈసెట్లో 95.86% ఉత్తీర్ణత
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈసెట్లో 95.86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11 బ్రాంచీల్లో ప్రవేశాలకు 23,330 మంది ఈసెట్ రాశారు. -
జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నాయి. -
భారీగా పెరిగిన విత్తన పసుపు ధర
రాష్ట్రంలో నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా పసుపు సాగవుతుంది. అధిక ఖర్చుతో కూడుకున్న ఈ పంటకు కొన్నేళ్లుగా ఆశించిన ధర రాలేదు. -
విత్తనాలకు రైతుల కుస్తీ
విత్తనాల కోసం రైతులు కుస్తీ పట్టాల్సిన దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ ఉన్న పత్తి విత్తన రకాల కోసం రైతులు ప్రైవేటు దుకాణాల ఎదుట బారులు తీరి నిల్చున్నారు. -
ఇతర రాష్ట్రాల బార్ సభ్యులనూ అనుమతించాలన్న పిటిషన్లో నోటీసులు
తెలంగాణ పరిధిలో సివిల్ జడ్జి పోస్టులకు ఇతర రాష్ట్రాల బార్ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దిల్లీ బార్ కౌన్సిల్ సభ్యుడైన వి.రాకేష్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ హృషికేశ్రాయ్, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రల ధర్మాసనం ఇటీవల విచారించింది. -
ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదే
కోర్టు తీర్పులతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. హక్కుల ఉల్లంఘన జరిగినందున పరిహారం ప్రకటించే విచక్షణాధికారం కోర్టుకు ఉందని పేర్కొంది. -
వర్సిటీలు.. అవినీతికి చిరునామాలు
సమాజానికి దిక్సూచిగా మారాల్సిన విశ్వవిద్యాలయాలు అక్రమాలు, అవినీతికి నిలయాలుగా మారాయి. ఆదర్శంగా ఉండాల్సిన ఉపకులపతు(వీసీ)లు కొందరు అక్రమార్జనే ధ్యేయంగా పాలన కొనసాగించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. -
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టై, ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా జూన్ 3 వరకు పొడిగించారు. -
రెవెన్యూ శాఖలో డీటీల పదోన్నతులకు కమిటీ
రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీని (డీపీసీ) ఏర్పాటు చేస్తూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. -
క్రష్ కేంద్రాలపై శిశు సంక్షేమ అధికారుల అధ్యయనం
రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారులకు.. సంరక్షణతో పాటు పూర్వప్రాథమిక విద్యను అందించడం, పౌష్టికాహారం, మానసిక వికాసం కోసం అంగన్వాడీ కేంద్రాలను క్రష్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. -
జూన్ మొదటి వారానికి గురుకుల ఐదోతరగతి ప్రవేశాలు పూర్తి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు తొలిమెట్టు అయిన ఐదో తరగతి ప్రవేశాల ప్రక్రియ జూన్ తొలివారానికి పూర్తిచేయాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
యాదాద్రిలో నృసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, సాయంత్రం అంకురార్పణ పర్వాలతో ఉత్సవాలకు పూజారులు, యాజ్ఞికులు శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
తనయుడి తెరంగేట్రంపై స్పందించిన అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే?
-
హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు