Azadi Ka Amrit Mahotsav: నరరూప చర్చిల్!
ఆధునిక చరిత్రలో నరరూప రాక్షసత్వం అనగానే... గుర్తుకొచ్చే పేరు హిట్లర్. కానీ హిట్లర్కు ఏమాత్రం తీసిపోని... అమానవీయతకు నిలువెత్తు నిదర్శనంలాంటి మరో పేరు... విన్స్టన్ చర్చిల్! శ్వేతజాతి దురహంకారంతో భారత స్వాతంత్య్రాన్ని తుదకంటా వ్యతిరేకించాడు.
ఆధునిక చరిత్రలో నరరూప రాక్షసత్వం అనగానే... గుర్తుకొచ్చే పేరు హిట్లర్. కానీ హిట్లర్కు ఏమాత్రం తీసిపోని... అమానవీయతకు నిలువెత్తు నిదర్శనంలాంటి మరో పేరు... విన్స్టన్ చర్చిల్! శ్వేతజాతి దురహంకారంతో భారత స్వాతంత్య్రాన్ని తుదకంటా వ్యతిరేకించాడు. అన్నింటికి మించి... బెంగాల్ క్షామంలో తన పాశవిక నిర్ణయాలతో 30 లక్షల మంది భారతీయుల మరణానికి కారణమయ్యాడు.
జర్మన్ నియంత హిట్లర్ జాత్యహంకారంతో యూదులను ఊచకోత కోస్తే... అదే జాత్యహంకారం, వివక్షలతో లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయేలా చేశాడు చర్చిల్. బ్రిటన్ ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు.. హిట్లర్కు ఏమాత్రం తీసిపోనివే. 1943 బెంగాల్ క్షామంలో... 30 లక్షల మంది పిట్టల్లా రాలిపోయారు. గుట్టలుగుట్టల్లా వీధుల్లో ప్రాణాలు విడిచారు.
బ్రిటిష్ హయాంలో మన దేశంలో అనేకసార్లు కరవు కాటకాలు సంభవించాయి. వాటిలో చాలామటుకు ప్రకృతి సంబంధమైనవైతే... 1943లో వచ్చిన బెంగాల్ క్షామం... చర్చిల్ నిర్ణయాలతో తలెత్తినదేనని ఆర్థికవేత్తలు తేల్చిచెప్పారు. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో ఐరోపా భవిష్యత్తును, వారి సైనికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని... భారతీయులకు తిండి దొరక్కుండా చేశాడు చర్చిల్. తన యుద్ధ కేబినెట్ భారత్లో క్షామం గురించి హెచ్చరించినా చర్చిల్ వినలేదు. ఒకవైపు ఇక్కడ తిండి గింజల కోసం ప్రజలు అలమటిస్తుంటే.. 1943 జనవరి నుంచి జులై మధ్య భారత్ నుంచి 70వేల టన్నుల బియ్యాన్ని లండన్లోని గోదాములకు తరలించారు. యుద్ధానంతరం పరిస్థితి ఎలా ఉంటుందోనని ముందస్తుగా గోదాముల్లో దాచి పెట్టారు. అదే మొత్తం భారత్లో అందుబాటులో ఉంటే 4లక్షల మందికి ఏడాదంతా సరిపోయేది. అంతేకాకుండా... జపాన్ దాడి చేస్తుందనే భయంతో బెంగాల్ తీరప్రాంతంలో ఆంక్షలు విధించాడు.
ఆ సమయంలో భారతీయుల దుస్థితిని చూసి బ్రిటిష్ వైస్రాయే కదిలిపోయారు. తక్షణమే ఆహార ధాన్యాలు కావాలంటూ స్వయంగా లండన్కు లేఖలు రాశారు. కానీ... చర్చిల్ ప్రభుత్వం వాటన్నింటినీ తిరస్కరించింది. భారత్కు ధాన్యం పంపిస్తే... భవిష్యత్ అవసరాల కోసం బ్రిటన్ గోదాముల్లో దాచిన నిల్వలు తగ్గిపోతాయని సాకు చెప్పింది. అంతేగాకుండా... ‘‘భారత్కు ఎంత ధాన్యం పంపినా సరిపోదు. ఎందుకంటే... భారతీయులు ఎలుకలు కన్నట్టు పిల్లల్ని కంటున్నారు. నిజంగా అంత సమస్యే ఉంటే గాంధీ ఇంకా ఎందుకు చావలేదు’’ అని చర్చిల్ వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని అప్పటి బ్రిటన్లో భారత వ్యవహారాల మంత్రి లార్డ్ లియో ఆమ్రే స్వయంగా వెల్లడించారు. ఆ సమయంలో భారత్లో వైస్రాయ్గా ఉన్న లార్డ్ వేవెల్ సైతం... ‘‘బ్రిటిష్ హయాంలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన క్షామమిది. మా సామ్రాజ్య ప్రతిష్ఠకు ఇది మాయని మచ్చ’’ అని వాపోయాడు.
భారత స్వాతంత్య్రాభిలాషను వ్యతిరేకించిన చర్చిల్ భారతీయులపై పదేపదే నోరుపారేసుకునేవాడు. ‘‘ఆటవిక దేశం... ఆటవిక మతం... ఆటవిక నాయకుడు’’ అని భారత్ గురించి చర్చిల్ దారుణంగా వ్యాఖ్యానించినట్లు లియో ఆమ్రే వెల్లడించారు. గాంధీని చర్చిల్ అర్ధనగ్న ఫకీర్ అని ఈసడించుకునేవాడు.
భారత స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించిన చర్చిల్ రహస్యంగా జిన్నాను రెచ్చగొట్టాడు. స్వాతంత్య్రం అనివార్యమైనప్పుడు... పాకిస్థాన్తో పాటుగా తమ చెప్పుచేతుల్లో ఉండే సంస్థానాధీశులతో ప్రిన్సిస్థాన్ను కూడా ఏర్పాటు చేసేందుకు కుట్రలు పన్నాడు.
బెంగాల్లో క్షామం ఎంతగా విలయతాండవం చేసిందంటే... తల్లిదండ్రులు తిండి పెట్టలేని అశక్తులై తమ పిల్లల్ని చెరువులు, బావుల్లో విసిరేశారు. మరికొంతమంది పిల్లల్ని అమ్మేశారు. ఆకలికి తాళలేక అనేక మంది రైళ్లకింద పడి చనిపోయారు. చెట్ల ఆకులు, గడ్డి తిని బతికేందుకు ప్రయత్నించారు. ఇక కొంతమంది మహిళలు... తమ కుటుంబాలను పోషించుకోవటానికి కోల్కతాకు తరలి పడుపువృత్తిలోకి మారారు. చనిపోయిన తమవారికి అంత్యక్రియలు చేసే శక్తి కూడా ఒంట్లో లేక అలాగే విడిచిపెట్టేశారు. బెంగాల్ గ్రామాల్లో... గుట్టలు గుట్టలుగా పడ్డ శవాల కుప్పలపై రాబందులు... విందు చేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!