Telangana News: దిల్లీకి చేరిన తెలంగాణ మంత్రులు
పంజాబ్ తరహాలో తెలంగాణ వడ్లన్నీ కొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల
నేడో రేపో కేంద్ర మంత్రులు, ప్రధానితో భేటీ!
ఎంసీహెచ్ఈర్డీలో అధికారులతో సమావేశమైన మంత్రులు
పంజాబ్ విధానం రాష్ట్రంలో అమలుకు ప్రతిపాదనలు చేయాలని నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: పంజాబ్ తరహాలో తెలంగాణ వడ్లన్నీ కొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డిల బృందం మంగళవారం దిల్లీకి చేరుకుంది. తొలుత కేంద్ర మంత్రులను, ఆ తర్వాత ప్రధాన మంత్రిని, సంబంధిత అధికారులను కలుస్తామని మంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకొని వస్తామని స్పష్టంచేశారు. అంతకుముందు మంగళవారం ఉదయం మంత్రులు హరీశ్రావు, గంగుల, నిరంజన్రెడ్డి, అజయ్లు హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. పంజాబ్ విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. పంజాబ్ తరహా విధానానికి కేంద్రం అంగీకరిస్తే.. ఐకేపీ, ఇతర సంస్థల ద్వారా తామే ధాన్యం కొనుగోలు చేసి ఎఫ్సీఐకి అందజేయడానికి సిద్ధమేనన్న ప్రతిపాదనను ముందుంచాలనే అంశంపై చర్చించారు.
సీఎం కేసీఆర్తో భేటీ
సమావేశం అనంతరం మంత్రులు ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను కలిశారు. కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాలని, స్పందన లేకపోతే కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుదామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పీయూష్ గోయల్ వైఖరిని ఎండగట్టాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు దిల్లీ బయల్దేరి వెళ్లారు.
కేంద్ర మంత్రులను నిలదీస్తాం: నిరంజన్రెడ్డి, గంగుల
కేంద్రం తీరుతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. దీనిపై కేంద్ర మంత్రులను నిలదీస్తామని మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీకి బయల్దేరేముందు వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘పంజాబ్లో ధాన్యం కొన్నప్పుడు.. తెలంగాణ రైతులు పండిస్తే ఎందుకు కొనరు? కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. గతంలో కొన్న ధాన్యాన్ని మరపట్టించి రాష్ట్ర గోదాముల్లో ఎందుకు పెట్టుకుంటాం? బియ్యాన్ని కేంద్రమే తీసుకెళ్లాలి. అందుకు రైళ్లను సమకూర్చకుండా మాపై నిందలు వేయడం విడ్డూరంగా ఉంది. కేంద్ర మంత్రుల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ముఖ్యమంత్రి ప్రకటించిన కార్యాచరణకు అనుగుణంగా ముందుకెళ్తాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అర్థరహితంగా మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోలుపై ఆ శాఖ కేంద్ర మంత్రి లేదా సంబంధిత అధికారులు మాట్లాడాలి. బండి సంజయ్కు ఏం సంబంధం? ఒకవేళ కేంద్రం తరఫున చెబితే స్పష్టమైన హామీతో మాట్లాడాలి తప్ప ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎలా? రాష్ట్రం కోసం బండి సంజయ్ ఏం చేశారు? ఆయన వల్ల రాష్ట్రానికి ఏం ఒరిగింది? ఏ రాష్ట్రంలో లేని ఇబ్బందులు తెలంగాణ రైతులకు ఎందుకు పెడుతున్నారు. వన్ నేషన్-వన్ ప్రొక్యూర్మెంట్ విధానం ఉండాలి. రైతులు వేసిన పంటలన్నింటినీ కేంద్రం కొనాలి. గోధుమలు పండిస్తే పిండి చేసి ఇవ్వడం లేదు. పత్తి పండిస్తే జిన్నింగ్ చేసి ఇవ్వడం లేదు. మరి వడ్లు కొంటే బియ్యం ఎందుకు ఇవ్వాలి’’ అని మంత్రులు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!