KTR: చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీ
చేనేత, నేత కార్మికులపై భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతోందని, స్వతంత్ర భారతదేశంలో చేనేతపై పన్నువేసిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు. కరోనా సంక్షోభంలోనూ జౌళి
నేతన్నలపై విషం చిమ్ముతున్న కేంద్రం
మీకు కేంద్రాన్ని నిలదీసే దమ్ముందా?
భాజపా అధ్యక్షుడు సంజయ్కు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
ఈనాడు, హైదరాబాద్: చేనేత, నేత కార్మికులపై భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతోందని, స్వతంత్ర భారతదేశంలో చేనేతపై పన్నువేసిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ధ్వజమెత్తారు. కరోనా సంక్షోభంలోనూ జౌళి రంగంపై మోదీ పన్నుల భారం వేశారని, దీంతో చేనేత రంగం కునారిల్లుతోందని తెలిపారు. చేనేత, జౌళిరంగంపై కేటీఆర్ ఆదివారం సంజయ్కు బహిరంగ లేఖ రాశారు. నేత కార్మికులపై బీమా సాయం ఎత్తివేయడంతో పాటు జాతీయ చేనేత అభివృద్ధి మండలిని మూసివేసిన పాపాన్ని మోదీ మూట కట్టుకున్నారని లేఖలో విమర్శించారు. చేనేత, జౌళి రంగాలపై కనీస అవగాహన లేకుండా భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు, ఆయన అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీగా నేత రంగానికి కేటాయింపులు చేస్తున్నది తెలంగాణ సర్కారేనని స్పష్టం చేశారు. నేతన్నల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఏ కార్మికుడిని అడిగినా వాస్తవాన్ని తెలియజేస్తారని చెప్పారు. నేతన్నలపై సంజయ్కి నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రంలో జాతీయ జౌళి పరిశోధన సంస్థ, జాతీయ చేనేత సాంకేతిక సంస్థ, మెగా మరమగ్గాల సమూహం ఏర్పాటుపై దిల్లీలో కొట్లాడాలని మంత్రి డిమాండ్ చేశారు.
ఇదేం రీతి
‘‘నేతన్నల సంక్షేమం, అభివృద్ధికి అండగా నిలవాల్సిన కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోంది. ఇప్పటికే అనేకసార్లు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి కాకతీయ మెగా జౌళి పార్కుకు సాయం అందించాలని కోరినా వారు పట్టించుకోలేదు. మరోవైపు తన అబద్ధాలతో సంజయ్ ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. ఆయన తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం పార్లమెంట్లో ఒక్కమాటా మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్ల జౌళిరంగంలో బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి చిన్న దేశాల కన్నా భారత్ వెనుకబడి ఉంది. జౌళి ఉత్పత్తులపైన భారీగా జీఎస్టీ వసూలు చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన దుర్గార్మపు ప్రభుత్వం భాజపాది. చేనేతపైన జీఎస్టీని సంపూర్ణంగా ఎత్తివేయాలని పలుమార్లు లేఖలు రాసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా.. కేంద్రం కనికరించలేదు.
తెలంగాణను చూసి నేర్చుకోండి
తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను కంటికి రెప్పలా చూసుకుంటోంది. వారికోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని స్థాయిలో విప్లవాత్మక కార్యక్రమాలను మా సర్కారు చేపట్టింది. నేతన్న రుణాలను మాఫీ చేసింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా చేనేత కార్మికులకు 40 శాతం సబ్సిడీని చేనేతమిత్రలో ఇస్తున్నాం. నేతన్నకు చేయూత పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం నేతన్నలకు కరోనా సంక్షోభ సమయంలో ఆపన్నహస్తం అందించింది. మగ్గాల అధునికీకరణ నుంచి వర్కర్ టూ ఓనర్ పథకం వరకు మా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఈరోజు రాష్ట్రంలోని నేతన్నల ఆదాయం రెట్టింపైంది. మా సర్కారు చేపట్టిన అనేక కార్యక్రమాలతో జౌళి రంగంలోనూ వలసలు వాపసవుతున్నాయి. నేతన్నలకు అన్ని బీమా పథకాలను మీరు రద్దుచేస్తే మా ప్రభుత్వం బీమా కల్పిస్తూ మేలు చేస్తోంది. ప్రధానితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక జౌళి పార్కును సాధించి తీసుకువచ్చే దమ్ము సంజయ్కుందా? కేంద్రాన్ని నిలదీస్తారా? అసత్యాలతో మోసం చేయాలని చూస్తే రాష్ట్రంలోని నేతన్నలు భాజపా నాయకులకు బుద్ధి చెప్పడం ఖాయం.’’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్