Yadadri Power Plant: యాదాద్రి వెలిగేదెప్పుడో!
రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. మొదటి దశ కింద
నత్తనడకన విద్యుత్కేంద్రం పనులు
గతేడాది అక్టోబరుకే పూర్తి కావాలన్నది లక్ష్యం
ఇప్పటికి 54 శాతమే నిర్మాణం
ఆలస్యం కారణంగా రూ.18 వేల కోట్ల అదనపు భారం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణం నత్తనడకన సాగుతోంది. మొదటి దశ కింద రెండు ప్లాంట్లలో 2020 అక్టోబరుకల్లా ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉండగా.. ఆ గడువు ముగిసి ఏడాదిన్నర దాటినా ఒక్క ప్లాంటూ అందుబాటులోకి రాలేదు. వచ్చే జూన్ నాటికి తొలి దశ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. మొత్తం విద్యుత్కేంద్రం అందుబాటులోకి రావడానికి మరో రెండేళ్లకుపైనే పడుతుందని భావిస్తున్నారు. ఈ జాప్యం ఖరీదు వివిధ రూపాల్లో రూ.18 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఈ వేసవిలో రోజుకు గరిష్ఠంగా 283 మిలియన్ యూనిట్ల(మి.యూ.)కు చేరింది. దీంతో రోజువారీగా 40- 50 ఎంయూలను డిస్కంలు అధిక ధరలకు కొంటున్నాయి. ఇందుకోసం మార్చి, ఏప్రిల్ నెలల్లోనే రూ.2,500 కోట్లు చెల్లించాయి. గడువు ప్రకారం యాదాద్రి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమై ఉంటే.. డిస్కంలకు గత రెండు నెలల్లోనే రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదా అయ్యేవని తెలిసింది. నిర్మాణంలో మూడేళ్లకు పైగా జాప్యంతో.. ఈ కాలంలో కొనుగోలు చేసే కరెంటుపై మొత్తం రూ.13 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. అప్పులపై అదనపు వడ్డీ, నిర్మాణ వ్యయం మరో రూ.5 వేల కోట్లు ఉంటుందని, ఇవన్నీ కలిపితే జాప్యం వల్ల నష్టం రూ.18 వేల కోట్లకు చేరుతుందని అంచనా.
కూలీలు లేక పనులు ఆలస్యం: భెల్
విద్యుత్కేంద్రం నిర్మాణం త్వరగా పూర్తికావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవకుండానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భెల్కు కాంట్రాక్టు అప్పగించింది. అయితే కరోనా విపత్తు కారణంగా ఇతర రాష్ట్రాల కూలీలు వెనక్కి వెళ్లడంతో పనులు ఆలస్యమైనట్లు భెల్ వివరణ ఇచ్చింది. నిర్మాణం వేగంగా జరగాలంటే రోజుకు 13 వేల నుంచి 15 వేల మంది కూలీలు పనిచేయాలి. ప్రస్తుతం బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో కలిపి 6,500 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా మరో 6-7 వేల మందిని రప్పించి పనులు వేగిరం చేస్తామని భెల్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. సబ్ కాంట్రాక్టు పనుల టెండర్లలో జాప్యం, ఉప గుత్తేదారులు పనులు వేగంగా చేయకపోవడం వంటి కారణాలతోనూ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
అదనపు వడ్డీ భారమే రూ.4 వేల కోట్లు
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30 వేల కోట్లు కాగా.. నిర్మాణానికి రూ.22 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారు. అప్పులపై ‘నిర్మాణ సమయంలో పడే వడ్డీ’(ఐడీసీ).. పనుల్లో మూడేళ్ల జాప్యం కారణంగా దాదాపు రూ.4 వేల కోట్లు అదనంగా ఉండవచ్చని అంచనా. అలానే మొత్తం వ్యయం ఒక మెగావాట్కు రూ.9 కోట్లు దాటవచ్చని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే జరిగితే ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంటు యూనిట్ ధర రూ.6 నుంచి 7కు చేరుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్కేంద్రాల నుంచి కొంటున్న కరెంటు యూనిట్ సగటు వ్యయం రూ.5.30 మాత్రమే కావడం గమనార్హం.
భెల్ భరించాల్సిందే: జెన్కో సీఎండీ
పనుల్లో తీవ్ర జాప్యంతో భారీగా ఆర్థికభారం పడుతోందని రాష్ట్ర జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ‘ఈనాడు’కు చెప్పారు. నిర్మాణ పనులిలాగే ఆలస్యమైతే భెల్ సీఎండీని సీఎం కేసీఆర్ పిలిపించే అవకాశాలున్నాయని ఆ సంస్థ ఉన్నతాధికారులను ఆయన హెచ్చరించారు. రూ.వేల కోట్ల అప్పులు తెచ్చి సకాలంలో చెల్లిస్తున్నా పనులు నత్తనడకన సాగడానికి సంస్థ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. అదనంగా పెరుగుతున్న నిర్మాణ వ్యయాన్ని భెల్ భరించాల్సిందేనని స్పష్టం చేశారు.
విద్యుత్కేంద్రం ముఖచిత్రం
ఎక్కడ నిర్మిస్తున్నారు: నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో
విద్యుదుత్పత్తి సామర్థ్యం: 4 వేల మెగావాట్లు
నిర్మించాల్సిన ప్లాంట్లు: 5
ఒక్కో ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం: 800 మెగావాట్లు
ఇప్పటివరకూ తెచ్చిన అప్పులు: రూ.22 వేల కోట్లు
నిర్మాణ ప్రారంభం: 17 అక్టోబరు 2017
మొదటి 2 ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభ గడువు: 17 అక్టోబరు 2020
అన్ని ప్లాంట్లలో ఉత్పత్తికి గడువు: 17 అక్టోబరు 2021
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం