
సి.నరసింహారావు మృతి తీరని లోటు
‘రేపటి మనిషి’ పుస్తకావిష్కరణలో వక్తలు
ఈనాడు, హైదరాబాద్: ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు మృతి సమాజానికి తీరని లోటు అని లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ విచారం వ్యక్తం చేశారు. ‘చక్కటి పరిజ్ఞానం ఉండి, దాన్ని విస్తరింపజేసి, వాక్చాతుర్యంతో, వాదనా పటిమతో ఒప్పించగల వ్యక్తి నరసింహారావు. మరో పదిహేనేళ్లపాటు తన ఆలోచనలను పంచే శక్తి ఉన్న ఆయన హఠాత్తుగా అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకరం’ అని ఆయన ఆవేదన చెందారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో ఏర్పాటు చేసిన నరసింహారావు సంస్మరణ సభకు హాజరైన వక్తలు ఆయన సేవలను ప్రస్తుతించారు. ఆయన జ్ఞాపకాలతో సన్నిహిత ప్రముఖులు రచించిన ‘రేపటి మనిషి’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సభలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, ‘నరసింహారావు నాకు ప్రాణ స్నేహితుడు. ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే ఆయన ఎప్పటికీ అందరి మనసుల్లో చిరంజీవే’ అన్నారు. నరసింహారావు తనకు మానసిక గురువని, అలాంటి జర్నలిస్టును తన జీవితంలో వేరొకరిని చూడలేదని ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తుచేసుకున్నారు. మరో ఎంపీ సుజనాచౌదరి మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా నరసింహారావు విశ్లేషణ ఉండేదని, సైకో ఫ్యాన్సీ ఆయన లక్షణం కానే కాదని అన్నారు. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆయన బాధితుల పక్షాన నిలబడి వారి ఇక్కట్లను ప్రపంచానికి తెలిపారని, వారి మనోవిశ్లేషణలు రాశారని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మరో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా నరసింహారావు ప్రత్యేకతలను కొనియాడారు. ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ, ‘నరసింహారావులోని విలక్షణతలు మరికొందరిలో ఉండవచ్చేమో కానీ, ఆయనలోని నిర్భీతి అనే గుణం మాత్రం ఎవరు అనుసరించాలన్నా కష్టసాధ్యం. తాను నిజమని నమ్మింది, తనకు తెలిసింది కుండబద్దలు కొట్టి చెప్పడానికి సంకోచించని వ్యక్తి. మనల్ని నాశనం చేసేది మన ఆలోచనలే తప్ప, మన శత్రువులు కాదని తరచూ చెప్పేవారు’ అని అన్నారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా గజల్ శ్రీనివాస్ వ్యవహరించారు. ఏపీ పోలీసు ఉన్నతాధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి చెంగల్రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ, సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ఏపీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్, డా.కృష్ణయ్య, గుమ్మడి గోపాలకృష్ణ, రఘు ఏలూరి, సి.ఉమామహేశ్వరరావు, సుంకర కోటేశ్వరరావు, తుమ్మల గోపాలరావు, పాత్రికేయులు మూర్తి, రమేశ్ కందుల తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన గురించి తెలుసా?
-
India News
PM Modi: ఆ కిచెన్లో లక్ష మందికి వంట చేయొచ్చు.. ప్రారంభించిన మోదీ
-
World News
Ukraine: ఉక్రెయిన్పై రష్యా వార్.. 346 మంది చిన్నారులు బలి!
-
Politics News
KTR: పెరిగే గ్యాస్ ధరతో.. ప్రజలకు గుండె దడ: కేటీఆర్
-
Movies News
Sammathame: ఓటీటీలోకి ‘సమ్మతమే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Technology News
WhatsApp: వాట్సాప్లో ఐదు కొత్త ఫీచర్లు.. ఏమేం రానున్నాయంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- Rahul Dravid : బజ్బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!