ఆలమట్టి నుంచి ప్రకాశం వరకు మహా ప్రవాహం
కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న వర్షాలకు భారీ ప్రవాహం దిగువకు వస్తోంది. కృష్ణా నదిలో ఆలమట్టి నుంచి ఏపీలోని ప్రకాశం బ్యారేజీ వరకు
కృష్ణాలో అన్నిచోట్లా రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద
ప్రాణహిత ఉద్ధృతితో గోదావరికి వరద
ఈనాడు, హైదరాబాద్, నాగార్జునసాగర్, భద్రాచలం, న్యూస్టుడే:కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న వర్షాలకు భారీ ప్రవాహం దిగువకు వస్తోంది. కృష్ణా నదిలో ఆలమట్టి నుంచి ఏపీలోని ప్రకాశం బ్యారేజీ వరకు ఎక్కడ చూసినా రెండు లక్షల క్యూసెక్కులకు తగ్గకుండా వరద ప్రవహిస్తోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి రెండు లక్షలకుపైగా క్యూసెక్కులు దిగువకు వస్తున్నాయి. జూరాల నుంచి కూడా అదే స్థాయి నీటి విడుదల ఉంది. శ్రీశైలం జలాశయం వద్దకు వస్తే తుంగభద్ర నుంచి లక్ష క్యూసెక్కులు వచ్చి కలుస్తుండటంతో వరద స్థాయి పెరుగుతోంది. ఇన్ఫ్లో 4.55 లక్షలకుపైగా ఉండగా దిగువకు అంతేస్థాయిలో వదులుతున్నారు. నాగార్జునసాగర్కు భారీ వరద కొనసాగుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా 26 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. 24 గేట్లను పది అడుగుల మేర, రెండు గేట్లు 5 అడుగుల మేరకు ఎత్తి విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సాగర్ జలాశయం 587.10(గరిష్ఠం 590.00)అడుగులకు చేరగా నీటినిల్వ సామర్థ్యం 305.8030 (గరిష్ఠం.312.0540)వద్ద ఉంది. ఈ వరద పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నుంచి సముద్రంలోకి వెళ్తోంది. మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు వార్ధా, పెన్గంగ నదులకు భారీ వరద వస్తోంది. దీంతో ప్రాణహిత ఉప్పొంగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. శుక్రవారం సాయంత్రానికి ఇక్కడి నుంచి 11.18 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వదులుతున్నారు. ఎస్సారెస్పీ నుంచి అన్నారం బ్యారేజీల వరకు పెద్దగా ప్రవాహాలు లేవు.
భద్రాచలం వద్ద గోదావరి వరద తాకిడి కొంత తగ్గినప్పటికీ ఇంకా అంతరాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలు పునరుద్ధరణ కాలేదు. శుక్రవారం ఉదయం 5 గంటలకు 52.5 అడుగులకు చేరిన నీటిమట్టం కొద్ది గంటలు నిలకడగా మారింది. సాయంత్రం 5 గంటలకు మూడు పాయింట్లు తగ్గి 52.2 అడుగులకు చేరింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నుంచి భద్రాచలానికి వచ్చే దగ్గరి దారి మునగడంతో మరో మార్గం గుండా రావాల్సి వస్తోంది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం రాయనపేట వద్ద రోడ్డుపై వరద నీటిలో కారుకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఛత్తీస్గఢ్, ఒడిశా వైపు వెళ్లేందుకు వీలులేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భద్రాచలం-దుమ్ముగూడెం మండలాల మధ్యలో బస్సులు తిరిగే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం గోదావరి స్నానఘాట్లోకి ఎవర్నీ వెళ్లనీయకుండా పోలీసులు బందోబస్తు పాటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక