‘మద్యం మత్తులో ఎస్సై’.. ఉన్నతాధికారుల ఆగ్రహం

మద్యం మత్తులో ఓ ఎస్సై తన ఇంటికి బదులు ఇతరుల ఇంటికి వెళ్లిన ఘటన కలకలం రేపడంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.

Updated : 02 Dec 2022 05:51 IST

 రాజాపూర్‌ ఎస్సైపై సస్పెన్షన్‌ వేటు

జడ్చర్ల గ్రామీణం, రాజాపూర్‌: మద్యం మత్తులో ఓ ఎస్సై తన ఇంటికి బదులు ఇతరుల ఇంటికి వెళ్లిన ఘటన కలకలం రేపడంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ ఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు గురువారం ప్రకటించారు. మంగళవారం రాత్రి ఓ గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొన్న ఎస్సై శ్రీనివాస్‌ మిత్రులతో కలిసి మద్యం తాగారు. జడ్చర్లలో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి బుధవారం తెల్లవారుజామున మద్యం మత్తులోనే బయలుదేరారు. ఈ క్రమంలో తన ఇంటికి బదులుగా మరో ఇంటికి వెళ్లి తలుపు తట్టడంతో స్థానికులు ఆయన్ను చితకబాది చెట్టుకు కట్టేశారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో శ్రీనివాస్‌ను జిల్లా ఎస్పీ తన కార్యాలయానికి పిలిపించి వివరాలు ఆరాతీశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని