అగ్నిమాపక శాఖలో అతివలకు చోటేది?
పోలీసు ఉద్యోగాలు సహా అనేక క్లిష్టమైన విధుల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. అయినా పోలీస్శాఖలో అంతర్భాగమైన అగ్నిమాపకశాఖలో మహిళలకు రాష్ట్రంలో ప్రాతినిధ్యమే లేదు.
నోటిఫికేషన్లలో దక్కని అవకాశం
పొరుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా మహిళల సేవలు
26/11 దాడుల అనుభవంతో ప్రత్యేకంగా నియమిస్తున్న మహారాష్ట్ర
ఈనాడు - హైదరాబాద్
పోలీసు ఉద్యోగాలు సహా అనేక క్లిష్టమైన విధుల్లో మహిళలు సత్తా చాటుతున్నారు. అయినా పోలీస్శాఖలో అంతర్భాగమైన అగ్నిమాపకశాఖలో మహిళలకు రాష్ట్రంలో ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఫైర్ ఉమన్, ఎస్సై, అధికారిగా లేరు. ఆయా ఉద్యోగ నోటిఫికేషన్లలో మహిళల అంశాన్నే ప్రస్తావించడంలేదు. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఫైర్ ఫైటర్లుగా మహిళలు, యువతులు దూసుకెళ్తున్నారు. దేశ రాజధాని దిల్లీలో ఫైర్ ఉమెన్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ కాబోతోంది. అయినా రాష్ట్రంలో ఆ ఊసే లేకపోవడం గమనార్హం. పోలీస్శాఖలో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు 33 శాతం రిజర్వేషన్లతో పోస్టులు భర్తీ చేస్తున్నా.. అగ్నిమాపకశాఖలో వివక్ష ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నాలుగుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా..
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఈ శాఖలో ఫైర్మెన్, ఎస్సైలు, సిబ్బంది నియామకాలకు 2015, 2018, 2020 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా పోలీస్శాఖలో కానిస్టేబుళ్లు, ఎస్సైల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులోనే అగ్నిమాపకశాఖ పోస్టులనూ భర్తీ చేస్తున్నారు. ఏ నోటిఫికేషన్లోనూ ఫైర్ డిపార్ట్మెంట్లో మహిళలకు అవకాశం కల్పించలేదు. ఈ ఏడాది నోటిఫికేషన్లో ఫైర్మెన్, డ్రైవర్ పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని షరతు విధించారు.
* అగ్నిమాపకశాఖలో 19 ఏళ్ల క్రితమే మహిళా అధికారులను నియమించి ఈ విషయంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా తమిళనాడు గుర్తింపు పొందింది. ఫైర్ డీఎస్పీ హోదాలో ఓ మహిళా అధికారి సైతం అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
* రాజస్థాన్లో పదహారేళ్ల నుంచి అగ్నిమాపక శాఖలో ఫైర్ ఉమెన్, ఎస్సైలుగా మహిళలను నియమిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కొత్తగా 155 మంది ఫైర్ఉమెన్ను నియమించారు.
* గుజరాత్లో పదమూడేళ్ల నుంచి అగ్నిమాపకశాఖలో మహిళా ఉద్యోగ నియామకాలు కొనసాగుతున్నాయి. రాజధాని గాంధీనగర్తోపాటు జిల్లా కేంద్రాల్లోని అగ్నిమాపక కేంద్రాల్లో మహిళలు విధులు నిర్వహిస్తున్నారు.
* ముంబయి ఫైర్ బ్రిగేడ్లో నాలుగు నెలల క్రితం ఇద్దరు మహిళలను అగ్నిమాపక కేంద్ర అధికారులు (ఫైర్ ఇన్స్పెక్టర్లు)గా నియమించారు. 26/11 ఉగ్ర దాడుల అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపకశాఖలో యువతులు, మహిళలను ఎక్కువగా నియమించాలని నిర్ణయించింది. ఉగ్రదాడులతో పాటు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల్లో మహిళలు, చిన్నారులుంటే వారిని మహిళా అధికారులు సులభంగా రక్షించడానికి వీలవుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.