కృష్ణపట్నం మూడో యూనిట్‌ కొత్త రికార్డు

కృష్ణపట్నం థర్మల్‌ యూనిట్‌లో కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటు రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించింది. ప్లాంటును వాణిజ్య ఉత్పత్తిలోకి.

Published : 28 Mar 2023 04:57 IST

సీవోడీ సమయంలో 816 మెగావాట్ల ఉత్పత్తి

ఈనాడు, అమరావతి: కృష్ణపట్నం థర్మల్‌ యూనిట్‌లో కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటు రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించింది. ప్లాంటును వాణిజ్య ఉత్పత్తిలోకి (సీవోడీ) తీసుకురావడం కోసం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని అధికారులు పరిశీలించారు. ఇందులో సగటున 816 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటు నుంచి వచ్చింది. ఇది థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి దేశంలోనే కొత్త రికార్డుగా జెన్‌కో అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 808 మెగావాట్ల అత్యధిక ఉత్పత్తి సాధించిన రికార్డు నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) పేరిట ఉంది. దీన్ని జెన్‌కో అధిగమించిందని అధికారులు తెలిపారు. కృష్ణపట్నం యూనిట్‌కు అవసరమైన బొగ్గును మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి కోల్‌ ఇండియా కేటాయించిందని, త్వరలో మూడో యూనిట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దేశీయంగా దొరికే బొగ్గుతోనే ఉత్పత్తి చేసే సాంకేతికతను మూడో యూనిట్‌లో వినియోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని