వర్సిటీల కాంట్రాక్ట్‌ అధ్యాపకుల క్రమబద్ధీకరణపై నివేదికకు ఆదేశం

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్‌కు సమర్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 02 Jun 2023 04:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల క్రమబద్ధీకరణ సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్‌కు సమర్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వర్సిటీ అధ్యాపక నేతలు గురువారం సచివాలయంలో మంత్రిని కలిసి చర్చించారు. నాయకులు పరుశురాం, కరుణాకర్‌రావు, వేల్పుల కుమార్‌, ఉపేందర్‌, సురేష్‌నాయక్‌, రాజేష్‌ఖన్నా తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని