ఘన వ్యర్థాల శుద్ధికి మోక్షమెప్పుడో?
రాష్ట్రంలోని 130 పురపాలక సంఘాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటు దస్త్రాలను దాటడం లేదు. పురపాలక సంఘాల్లో పెద్దమొత్తంలో చెత్త ఉత్పత్తవుతోంది.
130 పురపాలికల్లో కొలిక్కిరాని ప్రక్రియ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని 130 పురపాలక సంఘాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటు దస్త్రాలను దాటడం లేదు. పురపాలక సంఘాల్లో పెద్దమొత్తంలో చెత్త ఉత్పత్తవుతోంది. దాన్ని శాస్త్రీయంగా శుద్ధి చేసేందుకు పెద్దమొత్తంలో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుడు నవంబరులో టెండర్లు పిలిచింది. గడువు ముగిసి ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు ఆ ప్రక్రియ కొలిక్కి రాలేదు.
క్లస్టర్లుగా పురపాలికల విభజన
రాష్ట్రంలో చెత్తను పూర్తిస్థాయిలో శుద్ధి చేయటం లేదంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) అధికారులకు అక్షింతలు వేయటంతో.. కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం కట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 12,125 టన్నుల చెత్త వస్తుండగా.. 9,879 టన్నులను మాత్రమే శుద్ధి చేయగలుగుతున్నారు. మిగిలిందీ శుద్ధి చేయాలంటే భారీగా నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒకే దఫా పెద్దసంఖ్యలో చెత్త శుద్ధి కేంద్రాల ఏర్పాటు కష్టతరం కావటంతో క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్ పరిధిలో కనిష్ఠంగా పది, గరిష్ఠంగా ఇరవై పురపాలికలు ఉండేలా ప్రతిపాదించారు. మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, జనగామ క్లస్టర్లో 16 పురపాలికలు, రంగారెడ్డి జిల్లా క్లస్టర్ పరిధిలో 14, నల్గొండ, సూర్యాపేట క్లస్టర్లో 11, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్ పరిధిలో 15, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నారాయణపేట పరిధిలో 19, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల పరిధిలో 11, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ పరిధిలో 10, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కుమురంభీం, జయశంకర్ భూపాలపల్లి పరిధిలో 14, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ క్లస్టర్ పరిధిలో 20పురపాలికలను ఏర్పాటు చేశారు.
ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసినా..
చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటు టెండర్లలో రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలతోపాటు ఇతర రాష్ట్రాల్లోవీ పాల్గొన్నట్లు సమాచారం. టెండర్ల పరిశీలనకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని సైతం ఏర్పాటు చేసింది. టెండర్ల గడువు ముగిసి ఆరు నెలలు గడిచినా కొలిక్కిరాలేదు. ఈ ప్రాజెక్టును డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంది. గుత్తేదారులను ఖరారు చేసినా కేంద్రాలు అందుబాటులోకి వచ్చేందుకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు పడుతుందన్నది అంచనా. టెండర్లు ఆహ్వానించినా ఎందుకు ఖరారు చేయలేదన్నది చర్చనీయాంశంగా ఉంది.
ప్రత్యామ్నాయాలపై అధికారుల దృష్టి
చెత్త సద్వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గాలపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వ్యర్థాలతో పాదచారుల నడక ప్రాంతాల్లో వేసే టైల్స్ తదితరాలను తయారు చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉష్ణోగ్రతను మూడు నుంచి నాలుగు శాతం తగ్గించేందుకు చలువ పైకప్పు విధానాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. అందుకు ఉపకరించే టైల్స్ను వ్యర్థాలను ఉపయోగించి తయారీ చేయడంపై అధికారులు దృష్టి సారించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM