Southwest Monsoon: నైరుతి దాగుడుమూతలు!
వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. అవి సముద్రంపైనే నిలకడగా ఉంటూ..దాగుడుమూతలు ఆడుతున్నాయి.
అండమాన్ సమీపంలోనే ఆగిన రుతుపవనాలు
మరో మూడు రోజుల తరవాతే కేరళ తీరానికి
15 నాటికి తెలంగాణకు..
ఎల్నినో ప్రభావంతోనే అంటున్న వాతావరణ శాఖ
తొలకరి జాడలేక ఆరంభంకాని వ్యవసాయ పనులు
ఈనాడు, హైదరాబాద్: వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. అవి సముద్రంపైనే నిలకడగా ఉంటూ..దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ కారణంగా మరో మూడు రోజుల తర్వాతే అవి కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 15 దాకా వర్షాలు పడకపోవచ్చని వాతావరణశాఖ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం అండమాన్ దీవులను దాటి బంగాళాఖాతంలో కొంత ముందుకు వచ్చిన రుతుపవనాలు అక్కడే ఆగాయి. ఇటు అరేబియా సముద్రంలో లక్షదీవులను తాకినవీ ముందుకు కదలలేదు. గతేడాది జూన్ ఒకటిన కేరళను తాకగా ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాటి ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలంలో వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని అంచనా. రుతుపవనాల మందగమనానికి ఎల్నినో ప్రభావం కొంత కారణం కావొచ్చని వాతావరణ శాస్త్రవేత్తల అంచనా. ‘పసిఫిక్ మహా సముద్రంలోని పెరు, ఈక్వెడార్ల వద్ద సముద్ర జలాలు సాధారణంకన్నా ఏడు డిగ్రీలు అదనంగా వేడెక్కి గాలుల్లో ఒత్తిడి అధికమైంది. ఆ ప్రభావం భారతదేశం చుట్టుపక్కల సముద్ర జలాలపైనా పడుతోంది. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటే కరవు ఏర్పడుతుంది. ఉదాహరణకు దీని ప్రభావంతో ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, భారత్ వంటి దేశాల్లో 1997-98, 2003, 2015 సంవత్సరాల్లో వర్షాలులేక కరవు పరిస్థితులు ఏర్పడి రైతులు నష్టపోయారు. అదే సమయంలో కుంభవృష్టి కురిసి పెరూ, అమెరికా వంటి దేశాల్లో వరదలు వచ్చాయి. ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకోసారి ఎల్నినో ప్రభావం పడటం ఆనవాయితీగా మారింది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎండలే..ఎండలు
గత మూడేళ్లుగా భారత దేశంలోకి రుతుపవనాలు నిర్ణీత తేదీల్లో జూన్ మొదటి వారంలోనే దేశంలోకి ప్రవేశించాయి. ఈ దఫా ఆలస్యమయ్యాయి. సాధారణంగా జూన్ మొదటివారంలో రుతుపవనాల విస్తరణతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవాలి. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలా జూన్ మొదటి వారం చివరిలో వడగాలులు వీయడం తెలంగాణలో అత్యంత అరుదు. ఎండ వేడికి అన్నదాతలు దుక్కి దున్నే సాహసం చేయలేకున్నారు. ఏరువాక పౌర్ణమి ఈ నెల 4నే దాటినా విత్తనాలు వేయలేనంతగా ఎండలున్నాయంటే వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. ‘ప్రస్తుతం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురుస్తున్నాయి. అవి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్నవి కాదు. అవి కొనసాగవు. విత్తనాలు వేస్తే మొలకెత్తక ఎండిపోయే ప్రమాదముంది’ అని ఆయన హెచ్చరించారు. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ఆరంభమయ్యే వరకు రైతులు విత్తనాలు వేయవద్దని సూచించారు.
నాలుగు ఉమ్మడి జిల్లాలకు వడగాలుల ముప్పు
రాష్ట్రంలో ఈ నెల 9వతేదీ వరకు వడగాలులు వీస్తాయని పేర్కొంటూ వాతావరణశాఖ సోమవారం ప్రజలకు పసుపు రంగు హెచ్చరిక జారీచేసింది. మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పగటిపూట 42 నుంచి 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ దక్షిణ ప్రాంతంపై 1,500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉందని, ఛత్తీస్గఢ్ ఉత్తర ప్రాంతం నుంచి తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి 900 మీటర్ల ఎత్తున ఏర్పడిందని, వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయని ఆమె పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
CM Revanth: సీఎం రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభ కోసం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబయి బయల్దేరిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. -
శ్రీవారి భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్ల జారీ!
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే. -
రామగుండంలో సింగరేణి విద్యుత్కేంద్రం!
విద్యుదుత్పత్తి పెంపుపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏటా డిమాండ్ పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. -
నేటి నుంచి ఓ మోస్తరు వర్షాలు!
రాష్ట్రంలో సోమవారం నుంచి 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. -
కవితను కలిసిన కుటుంబసభ్యులు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను ఆదివారం సాయంత్రం కుటుంబసభ్యులు కలిశారు. -
మంచి చేసే వారికి సమాజంలో గుర్తింపు
సమాజాభివృద్ధికి కృషిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ఆదివారం ముగిసింది. -
చీరకట్టులో నారీ పరుగు..
హైదరాబాద్ నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ప్లాజా ఆదివారం ఉదయం చీరకట్టులో ఉన్న మహిళలతో సందడిగా కనిపించింది. -
వ్యాట్ సొమ్ము ఎగవేత?
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నా ఆస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి విలువ ఆధారిత పన్ను(వ్యాట్) మాత్రం రావడం లేదు. -
కాంతివేగంతో ఎలక్ట్రాన్ల శక్తి మార్పిడి
హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్) శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్లను లేజర్ ఆధారిత సూక్ష్మ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్ ఓల్ట్గా మార్చే విధానాన్ని కనుగొన్నారు. -
మైనార్టీ గురుకుల సొసైటీ పునర్నియామకం
రాష్ట్ర మైనార్టీ గురుకుల విద్యాలయ సంస్థ పరిపాలన మండలిని ప్రభుత్వం పునర్నియమించింది. -
ఆర్టీసీ కార్గో ఆదాయ లక్ష్యం రూ.300 కోట్లు!
టికెటేతర ఆదాయాన్ని పెంచుకోవడంపై టీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. సంస్థకు పెద్దసంఖ్యలో బస్డిపోలు, బస్టాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నెట్వర్క్ ఉంది. -
పాలేరు.. అడుగంటుతున్న నీరు!
నాలుగు జిల్లాల ప్రజలకు కీలక తాగునీటి వనరైన పాలేరు జలాశయం వేసవి ప్రారంభంలోనే అడుగంటుతోంది. -
యాసంగి సాగు.. 5 జిల్లాల్లో లోటు
రాష్ట్రంలో యాసంగి సీజన్లో 5 జిల్లాలు పంటల సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని చేరలేకపోయాయి. అలాగే పలు పంటలకు సంబంధించి సాగు విస్తీర్ణం కూడా తగ్గినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. -
పంట రుణాలపై మళ్లీ బ్యాంకుల నిర్లక్ష్యం
రాష్ట్రంలో పంట రుణాల మంజూరులో బ్యాంకుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. వార్షిక ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్నదాతలకు సాయం అందించడానికి బ్యాంకులు మొరాయిస్తున్నాయి. -
సైబర్ బాధితులకు ఇక సత్వర న్యాయం
సైబర్ నేరాల బారిన పడిన వారికి ఇక సత్వర న్యాయం జరగనుంది. జప్తు చేసిన డబ్బును లోక్ అదాలత్ల ద్వారా సాధ్యమైనంత త్వరగా బాధితులకు అందించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. -
రైల్వే కార్మిక సంఘాల సమ్మె వాయిదా
దేశ వ్యాప్తంగా మే 1న తలపెట్టిన రైల్వే కార్మిక సంఘాల సమ్మెను లోక్సభ ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఎన్ఎఫ్ఐఆర్, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య ప్రకటించారు. -
ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. -
రామప్ప ఆలయ శిల్పకళ అద్భుతం
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే దంపతులు సందర్శించారు. -
ట్రైబ్యునల్ తీర్పు వచ్చేంతవరకు.. ‘పాలమూరు’ డీపీఆర్ మదింపు సాధ్యం కాదు
తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి పంపిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ మదింపు కృష్ణా ట్రైబ్యునల్ తుది తీర్పు వెలువడేంత వరకూ సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. -
‘భాషాపండితుల సమస్యలను పరిష్కరించాలి’
తెలంగాణలో భాషాపండితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర ప్రభుత్వ త్రిసభ్య కమిటీని కోరింది. -
యాదాద్రిలో వైభవంగా ఎదుర్కోలు వేడుక
ప్రసిద్ధ క్షేత్రమైన యాదాద్రిలో బ్రహ్మోత్సవ విశేష పర్వాలకు ఆదివారం రాత్రి నిర్వహించిన ఎదుర్కోలు వేడుకతో శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
-
TS News: హైదరాబాద్ ప్రజాభవన్లో ‘ప్రజావాణి’కి తాత్కాలిక బ్రేక్
-
KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్.. కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్
-
Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు
-
Hunger Crisis: క్షామం అంచున గాజా.. 2 లక్షల మంది విపత్కర పరిస్థితుల్లో!