TSRTC: ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
43,373 మందికి ఇకపై సర్కారీ జీతాలు
రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు
వరద ప్రాంతాలకు రూ. 500 కోట్ల సాయం
40 మంది మృతుల కుటుంబాలకు పరిహారం
మరో ఎనిమిది కొత్త వైద్యకళాశాలలు
గవర్నర్ తిరస్కరించిన బిల్లులు మళ్లీ శాసనసభకు
హకీంపేట ఎయిర్పోర్టు పౌరసేవలకు వినియోగించే యోచన
అనాథల సంరక్షణకు ప్రత్యేక విధానం
మంత్రిమండలి నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వస్తే.. ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు సర్కారీ ఉద్యోగులుగా మారతారు. వారికి ప్రభుత్వమే జీతభత్యాలు చెల్లించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని నియమించింది. విలీన బిల్లును వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతామని మంత్రివర్గం వెల్లడించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం సుమారు ఆరుగంటల పాటు జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. ఇతర మంత్రులతో కలిసి ఈ నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలకు రూ. 500 కోట్ల తక్షణ సాయం విడుదల చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. వరదల్లో మరణించిన 40 మంది కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు అనుమతించింది. పంటనష్టాలపై సమగ్ర నివేదికలు అందించాలని, రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. రాష్ట్ర గవర్నర్ తమిళి సై తిరస్కరించిన మూడు బిల్లులను మరోసారి శాసనసభలో ఆమోదించి, గవర్నర్కు పంపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మరో ఎనిమిది కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వీటితో మొత్తం 33 జిల్లాల్లోనూ వైద్యకళాశాలలు సమకూరతాయని పేర్కొంది. హకీంపేట విమానాశ్రయాన్ని పౌరవిమానయాన సేవలకు వినియోగించుకునేందుకు కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది.
ఆర్టీసీ బలోపేతానికి..
ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు, సేవలను ఇంకా విస్తృతపరిచేందుకు సంస్థలో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులు గతంలో సమ్మె చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ సానుకూల నిర్ణయం వెలువరించింది. దీనిపై విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్అండ్ బీ, రవాణాశాఖ, జీఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. దీనిపై శాసనసభ వర్షాకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ ప్రారంభించాలని రవాణాశాఖ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
వరద నష్టాలపై విస్తృత చర్చ..
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నష్టాలపై మంత్రిమండలి విస్తృతంగా చర్చించింది. ఈ నెల 18 నుంచి 28 వరకు పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు, వరదలతో వరంగల్, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, జనగామ, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెంతో పాటు పది జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలకు, వివిధ వర్గాలకు నష్టం జరిగిందని, పంటలు, రోడ్లు, చెరువులు, కాలువలు ధ్వంసమయ్యాయని అధికారులు నివేదించారు. దీనిపై సీఎం స్పందించి తక్షణ సహాయం కింద రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. అవసరమైనచోట యుద్ధప్రాతికదికన తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించామని తెలిపారు. మరణించిన 40 మంది వివరాలను సేకరించి.. వారి కుటుంబాలకు పరిహారమివ్వాలని నిర్దేశించారు. ‘వర్షాల వల్ల చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి. పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. కొన్నిచోట్ల ఇతర సమస్యలు వచ్చాయి. కలెక్టర్లు వాటిని పరిశీలించి వెంటనే సమగ్ర నివేదికలు ఇవ్వాలి. వరదలతో తెగిన రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయాలి. ఖమ్మం పట్టణం నుంచి మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడవునా ఉన్న నది వెంట ఆర్సీసీ గోడతో కూడిన కరకట్టను నిర్మించాలి. దీనికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నాం. దీనికి సంబంధించి నివేదిక తయారు చేయాలి’ అని సీఎం ఆదేశించారు.
విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయుడికి ఆగస్టు 15న సన్మానం
వరదల సమయంలో ఆపద్బాంధవులుగా నిలిచిన ఉద్యోగులను సీఎం ప్రత్యేకంగా మంత్రిమండలిలో ప్రస్తావించారు. ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు వరదలను లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి విద్యుక్తధర్మాన్ని నెరవేర్చారని సీఎం అభినందించారు. ఆగస్టు 15న ఇద్దరిని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరిస్తామని సీఎం ప్రకటించారు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న మీనయ్య అనే ఉపాధ్యాయుడు 40 మంది పిల్లలను కాపాడారని.. ఆయనను కూడా సన్మానిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?