అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు.
నయీంనగర్ (హనుమకొండ), వరంగల్ నగరం - న్యూస్టుడే: అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. హనుమకొండ నయీంనగర్కు చెందిన చింతకింది రూపేశ్చంద్ర (26) ఈ నెల 2వ తేదీ నుంచి అదృశ్యం కావడంతో అతని తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చింతకింది సదానందం, ఉమా దంపతుల రెండో కుమారుడైన రూపేశ్చంద్ర హనుమకొండలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. 2019లో లండన్ వెళ్లి ఎంఎస్ పూర్తిచేశాడు. తిరిగి 2022లో హనుమకొండ వచ్చాడు. గత ఏడాది డిసెంబరులో డబుల్ ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన రూపేశ్చంద్ర విస్కాన్సిన్లోని కాంకార్డియా యూనివర్సిటీలో చదువుతున్నాడు.
షికాగోలోని షెరిడాన్ రోడ్డులో ఉంటున్నాడు. తల్లిదండ్రులతో నిత్యం ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ నెల రెండో తేదీన చివరిసారిగా కుమారుడితో మాట్లాడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆ తర్వాత ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదని కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడితోపాటు ఉండే యువకుడితో మాట్లాడగా రెండు రోజులు బయట పని ఉందని చెప్పి వెళ్లినట్లు చెప్పాడని తెలిపారు. తమ కుమారుడి ఆచూకీ కోసం అమెరికాలో తానా సహాయంతో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రూపేశ్చంద్ర అదృశ్యంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకున్నట్లు చెప్పారు. తప్పిపోయిన తమ కుమారుడి ఆచూకీని త్వరితగతిన తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు, అధికారులను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వారం రోజులుగా ఆ కుటుంబ సభ్యులు నిద్రాహారాలు మానేసి అతని ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. విద్యార్థి తండ్రి సదానందం ద్విచక్ర వాహనాల మెకానిక్ కాగా తల్లి గృహిణి. వారి పెద్ద కుమారుడు అరుణ్కుమార్ తండ్రికి సహాయకుడిగా మెకానిక్ పని చేస్తున్నాడు. కాగా షెరిడాన్ రోడ్డు ప్రాంతంలోనే రూపేశ్చంద్ర అదృశ్యమైనట్లు షికాగో పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అతని ఆచూకీ ఎవరికి తెలిసినా సమాచారం అందించాలని ప్రజలను కోరారు. విద్యార్థి ఆచూకీ కనుగొనేందుకు స్థానిక పోలీసులతోనూ, భారత సంతతి వ్యక్తులతోనూ నిరంతరం సంప్రదిస్తున్నట్లు షికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
-
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
మంత్రి మండలి సమావేశం నేడు
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..