Railway Budget: కొత్త రైళ్లూ.. లైన్లూ లేవు
బుల్లెట్ రైలు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వంటి భారీ ప్రాజెక్టులేవీ రాలేదు. నూతనంగా రైల్వే లైన్లు మంజూరు చేయలేదు. కొత్త రైళ్లూ ఇవ్వలేదు. అత్యాధునిక, కొత్తతరం రైళ్లు అంటూ
కోచ్ ఫ్యాక్టరీ లేదు, వందేభారత్ ఊసూ లేదు
కాజీపేట పీఓహెచ్కు రూ.45 కోట్లే, చర్లపల్లికి రూ.69.99 కోట్లు
రాష్ట్రానికి తీవ్ర నిరాశ
ఈనాడు, హైదరాబాద్: బుల్లెట్ రైలు, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వంటి భారీ ప్రాజెక్టులేవీ రాలేదు. నూతనంగా రైల్వే లైన్లు మంజూరు చేయలేదు. కొత్త రైళ్లూ ఇవ్వలేదు. అత్యాధునిక, కొత్తతరం రైళ్లు అంటూ వందేభారత్ పేరుతో ఊరించినా ఈ ఏడాది కేటాయింపుల్లో వాటి ఊసే లేదు.. మొత్తంగా కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిల్చింది. రైల్వేకు గతేడాది కంటే రూ.30 వేల కోట్లు అధికమని ఆ శాఖ ఘనంగా చెప్పినా రాష్ట్రానికి ఆ మేరకు కేటాయింపులు కనిపించడం లేదు. రైల్వే పింక్బుక్ వివరాల ప్రకారం గత బడ్జెట్లలో మంజూరై, నిర్మాణంలో ఉన్న నూతన ప్రాజెక్టుల్లో కొన్నింటికే.. డబ్లింగ్ లైన్లకు, చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్కు కొంతమేర నిధులు ఇచ్చారు. ద.మ.రైల్వే జోన్ విభజన జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజన్లే మిగులుతాయి. మరొకటి మహారాష్ట్రలోని నాందేడ్లో ఉంటుంది. కాజీపేట కేంద్రంగా కొత్తరైల్వే డివిజన్ ఏర్పాటుచేయాలన్న డిమాండ్పైనా స్పందన లేదు. విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన సౌత్కోస్ట్ కొత్త రైల్వేజోన్కి ఈసారి రూ.40 లక్షలే బడ్జెట్లో కేటాయించారు. అంటే ఈ సంవత్సరం ద.మ.రైల్వే జోన్ విభజన ప్రక్రియ పూర్తవుతుందా? అన్న సందేహాలున్నాయి.
ఎంఎంటీఎస్కు రూ.20 లక్షలే..
* హైదరాబాద్లో రెండో దశ ఎంఎంటీఎస్ పనులకు రూ.10 లక్షలే ఇచ్చారు. ఘట్కేసర్ నుంచి యాదాద్రి (రాయగిరి) రెండోదశ విస్తరణ ప్రాజెక్టుకు సైతం రూ.10 లక్షలే. రెండోదశలో తమ వంతు వాటా మించి ఖర్చు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు రావాలని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. యాదాద్రి ఎంఎంటీఎస్ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి ముందుకు రావాలంటోంది.
* కాజీపేట పీరియాడికల్ ఓవర్హాలింగ్ ప్రాజెక్టుకు కేంద్రం రూ.45 కోట్లే ఇచ్చింది. 2016-17లో రూ.269.78 కోట్ల అంచనా వ్యయంతో ఇది మంజూరైంది. అయిదేేళ్ల క్రితం రూ.రెండొందల కోట్ల పైచిలుకు నిధుల్ని బడ్జెట్లో కేటాయించినా, భూసమస్య ఉందని ఆ నిధుల్ని రైల్వే వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సమస్య పరిష్కారమైంది. కానీ రూ.45 కోట్లే ఇచ్చారు. మరోపక్క అంచనా వ్యయమూ పెరిగింది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కనీసం నాలుగైదేళ్లు పట్టే అవకాశం ఉంది.
* హైదరాబాద్లో ప్రధాన టెర్మినళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లిలో నిర్మిస్తున్న శాటిలైట్ టెర్మినల్కు రూ.69.99 కోట్లు ఇవ్వగా, నాగులపల్లి ప్రస్తావన లేదు.
* రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడంతో పాటు నిధుల్లో కూడా మూడోవంతు వాటా భరిస్తున్న మనోహరాబాద్-కొత్తపల్లి లైనుకు గతేడాది రూ.325 కోట్లు ఇచ్చిన రైల్వేశాఖ, ఈసారి రూ.60 కోట్లకే పరిమితం చేసింది. ప్రస్తుతం మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు నిర్మాణం పూర్తయింది. సిద్దిపేట వైపు పనులు పురోగతిలో ఉన్నాయి. సిరిసిల్ల మీదుగా కొత్తపల్లి వరకు పూర్తయితే సికింద్రాబాద్-కరీంనగర్ వరకు రైల్వేలైను అందుబాటులోకి వస్తుంది. ఇంత కీలక ప్రాజెక్టుకూ నిధుల కేటాయింపులో రైల్వేశాఖ నిర్లక్ష్యం చూపింది.
రూ.2,480 కోట్లకు ఇచ్చింది రూ.వెయ్యి
తెలుగురాష్ట్రాల మధ్య ఎంతో డిమాండ్ ఉన్న రైల్వే లైను బీబీనగర్-గుంటూరు. ఈ మార్గంలో రెండోలైన్ నిర్మాణ అంచనా వ్యయం రూ.2,480 కోట్లయితే రూ.వెయ్యి ఇచ్చారు. దశాబ్దాల క్రితం మంజూరైన నల్గొండ-మాచర్లకూ కేటాయించింది రూ.వెయ్యే. కొండపల్లి-కొత్తగూడెం, మణుగూరు-రామగుండం లైన్లకు సైతం రూ.వెయ్యేసి చొప్పున బడ్జెట్లో మంజూరుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?