Covid Third Wave: కొవిడ్ మూడోదశ మొదలైంది
రాష్ట్రంలో కొవిడ్ మూడో దశ ఉద్ధృతి ప్రారంభమైందని ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజుల్లోనే నాలుగు రెట్లకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు 1 శాతం నుంచి 3.5 శాతానికి
వచ్చే 4 వారాల్లో గరిష్ఠ స్థాయికి కేసులు
ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి
ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ మూడో దశ ఉద్ధృతి ప్రారంభమైందని ప్రజారోగ్య సంచాలకుడు(డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజుల్లోనే నాలుగు రెట్లకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు 1 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగిందని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి జరుగుతోందన్నారు. వచ్చే 4 వారాల్లో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయన్నారు.ఫిబ్రవరి రెండో వారం ముగిసే సరికి క్రమేణా తగ్గిపోవచ్చని ఆయన విశ్లేషించారు. కాబట్టి వచ్చే నాలుగు వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని హెచ్చరించారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడో దశలో మరణాల శాతం దాదాపుగా సున్నానేననీ.. ప్రాణాలు పోయే ముప్పు లేదని ప్రజలు గ్రహించాలని తెలిపారు. అయితే, ఇప్పటికీ డెల్టా వేరియంట్ కేసులు 40 శాతం వరకూ నమోదవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో పండగలు, వేడుకలను కుటుంబసభ్యుల మధ్య మాత్రమే జరుపుకోవాలని సూచించారు. వచ్చే నాలుగు వారాలు అన్ని రకాల కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాసంఘాలను డీహెచ్ కోరారు.
‘‘ప్రస్తుతం నమోదవుతున్న వాటిలో 60-70 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులే. బాధితుల్లో 95 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. లక్షణాలున్నవారిలోనూ కొద్దిపాటి జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, తలనొప్పి, నిస్సత్తువ వంటివి కనిపిస్తున్నాయి. అయిదు రోజుల్లోనే కోలుకుంటున్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకపోవడం సానుకూల అంశం. అయినా సరే మూడు రోజుల తర్వాత కూడా లక్షణాల తీవ్రత పెరుగుతుంటే మాత్రం ఆసుపత్రిలో చేరిపోవాలి. రక్తంలో ఆక్సిజన్ శాతం 93 కంటే తక్కువగా ఉన్నా ఆసుపత్రిలో చేరాలి. ఎటువంటి వ్యాధి లక్షణాలు లేనివారు, సాధారణ లక్షణాలున్నవారూ భయంతో ఆసుపత్రిలో చేరుతున్నారు. దీంతో నిజంగా అవసరమైన వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రైవేటు ఆసుపత్రులు రోగులను అనవసరంగా చేర్చుకోవద్దు. అవసరం లేకపోయినా ఖరీదైన మందులను వాడొద్దు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం.
ఒక్క శాతం మంది ఆసుపత్రిలో చేరినా భారమే
రాబోయే రోజుల్లో మొత్తం కేసుల్లో ఒక్క శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడినా.. వాటిపై భారం పడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందు నుంచే అప్రమత్తతతో మెలగాలి. రాబోయే రోజుల్లో లాక్డౌన్ ఉండదు.. కానీ, కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వ్యాక్సిన్ తీసుకోని వారు దయచేసి వెంటనే తీసుకోవాలి. వైరస్ సోకినా.. టీకా తీసుకున్నవారికి తీవ్రస్థాయి దుష్ప్రభావం ఎదురవకుండా ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో వైద్యబృందాలను నియమించి పరీక్షలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎన్ని వేల కేసులొచ్చినా తట్టుకునే సామర్థ్యముంది. రాష్ట్రంలో ఎక్కడా ఆసుపత్రులలో చేరికలు పెరగలేదు. ఒమిక్రాన్తో ఎవరూ చనిపోలేదు. ప్రజలు ఆందోళనకు గురికావొద్దు. వచ్చే 4 వారాల పాటు వైద్యసిబ్బంది సెలవులు తీసుకోవద్దు’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తప్పనిసరిగా పాటించాల్సినవి..
* ఇంటా బయటా మాస్కు ధరించాలి, గుంపుల్లోకి వెళ్లొద్దు
* గదుల్లో గాలి, వెలుతురు బాగా ఆడేట్టు చూసుకోవాలి
* వ్యక్తిగత దూరాన్ని పాటించాలి, టీకాలు తీసుకోవాలి
* వ్యాధి లక్షణాలున్న వారు సమీప వైద్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి
* పాజిటివ్గా తేలితే అర్హుడైన వైద్యుడి సూచనల మేరకు చికిత్స పొందాలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.