Spelling Bee 2022: అమెరికా ‘స్పెల్లింగ్ బీ’ పోటీల్లో మనోళ్లదే హవా.. హరిణికి టైటిల్
2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల బాలిక హరిణి లోగాన్ విజేతగా నిలిచింది........
వాషింగ్టన్: అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో ఈ ఏడాది కూడా భారత సంతతికి చెందిన విద్యార్థుల ఆధిపత్యం కొనసాగింది. 2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల బాలిక హరిణి లోగాన్ విజేతగా నిలిచింది. ‘charadriiform’, ‘sereh’, ‘moorhen’ సహా 21 పదాల స్పెల్లింగ్లను తప్పుల్లేకుండా చెప్పిన హరిణి స్క్రిప్స్ కప్ను చేజిక్కించుకుంది. దీంతో ఆమెకు 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది. ఈ పోటీల్లో మొదటిసారి టై బ్రేకర్ను ప్రవేశపెట్టగా.. ఇందులో హరిణి విజయం సాధించింది. హరిణి కుటుంబం టెక్సాస్లో సాన్ ఆంటోనియో ప్రాంతంలో స్థిరపడడా.. ప్రస్తుతం ఆమె 8వ గ్రేడ్ చదువుతోంది.
ఈ పోటీల్లో విక్రమ్ రాజుకు రెండో స్థానం దక్కింది. 90 సెకన్లలో హరిణి 26 పదాలకుగాను 21 పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పగా.. 12 ఏళ్ల విక్రమ్ రాజు 19 పదాల్లో 15 పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పాడు. ఈ పోటీల్లో విహాన్ సిబల్ 3వ స్థానంలో నిలువగా, ఉప్పల సహర్ష్కు నాలుగో స్థానం దక్కింది. 1925 నుంచి జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలు నిర్వహిస్తున్నారు. అమెరికా జనాభాలో భారత సంతతి అమెరికన్లు ఒక్క శాతమే అయినప్పటికీ గత 20 ఏళ్లుగా స్పెల్లింగ్ బీ పోటీల్లో వీరి ఆధిపత్యం కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
వేర్పాటువాదానికి, హింసను సమర్థించేవారికి మద్దతు ఇవ్వడమనేది భావప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని కేంద్ర మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. -
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
వివాహ బంధంలో కొత్త ట్రెండ్ను ఫాలో అవుతోన్న జపాన్ యువత.. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ధోరణి వైపు అడుగులు వేస్తోంది. -
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ఎన్నికల విషయంలో తమ ప్రమేయం ఉండదని అమెరికా (USA) స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలను ఖండించింది. -
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
ఫోరిడాలో పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నల్లజాతీయుడు మృతి చెందడంతో అక్కడ నిరసన వ్యక్తమైంది. -
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!