Spy Balloon: గుబులుపుట్టిస్తున్న చైనా నిఘా నీడ.. లాటిన్ అమెరికాలో కన్పించిన రెండో బెలూన్
అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. లాటిన్ అమెరికాలో రెండో నిఘా బెలూన్ (Spy Balloon) కన్పించడం కలవరపెడుతోంది. అది కూడా చైనా (China) గూఢచర్య బెలూనే అని పెంటగాన్ తెలిపింది.
వాషింగ్టన్: చైనా (China)కు చెందిన నిఘా బెలూన్లు అగ్రరాజ్యం అమెరికా (America)ను గుబులుపుట్టిస్తున్నాయి. గురువారం మోంటానా రాష్ట్ర గగనతలంలో ఓ భారీ బెలూన్ (Spy Balloon) కన్పించగా.. తాజాగా లాటిన్ అమెరికాలో మరో దాన్ని గుర్తించినట్లు పెంటగాన్ శుక్రవారం రాత్రి వెల్లడించింది. ‘‘లాటిన్ అమెరికా (Latin America) గగనతలం మీదుగా ఓ బెలూన్ ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందింది. అది చైనాకు చెందిన మరో గూఢచర్య బెలూన్ అని మేం అంచనా వేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంతకంటే సమాచారం లేదు’’ అని పెంటగాన్ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ వెల్లడించారు.
మరికొద్ది రోజులు అమెరికా గగనతలంలోనే..
గురువారం కన్పించిన బెలూన్ (Spy Balloon) మూడు బస్సుల పరిమాణంలో ఉన్నట్లు పెంటగాన్ తెలిపింది. ఇది మరికొన్ని రోజులు అమెరికా (US) గగనతలంలోనే ప్రయాణించే అవకాశాలున్నట్లు వెల్లడించింది. ‘‘బెలూన్ ప్రయాణాన్ని ట్రాక్ చేస్తున్నాం. ఇందులో నిఘా సామర్థ్యమున్న పేలోడ్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం ఇది తూర్పు వైపుగా పయనిస్తోంది’’ అని రైడర్ వెల్లడించారు. ఈ బెలూన్ను కూల్చేయాలా లేదా అన్నదానిపై చర్చలు జరుగుతున్నట్లు పెంటగాన్ (Pentagon) వెల్లడించింది.
నిబంధనల ఉల్లంఘనే: శ్వేతసౌధం
ఈ బెలూన్ ఉత్తర అమెరికా రాష్ట్రాల్లోని భద్రతాపరంగా సున్నితమైన స్థావరాల మీదుగా ప్రయాణిస్తుండటం కలవరపెడుతోంది. బెలూన్ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ (Joe Boden)కు పెంటగాన్ సమాచారమిచ్చింది. పరిస్థితులను ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు శ్వేతసౌధం (White House) వెల్లడించింది. అయితే ఈ వివాదంపై స్పందించిన చైనా.. అది ఒక పౌర గగననౌక అని తెలిపింది. వాతావరణ పరిశోధనల కోసం దానిని తామే ప్రయోగించామని, గాలుల ప్రభావంతో దశ తప్పి అమెరికా గగనతలంలోకి వచ్చిందని వివరించింది. దీనిపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కెరీన్ జీన్ పెర్రీ స్పందిస్తూ.. ‘‘చైనా (China) పొరబాటును అంగీకరించొచ్చు. కానీ మా గగనతలంలోకి ఈ బెలూన్ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. దీన్ని మేం ఎన్నటికీ అంగీకరించబోం’’ అని వెల్లడించారు.
అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. ఈ నిఘా బెలూన్ ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానాలో ఈ బెలూన్ కన్పించడంతో అమెరికా దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన చైనా (China) పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకోవడం గమనార్హం. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రంగా మారే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్