Swimming: ఫలించిన ఆమె పోరాటం.. ఇక అక్కడ మహిళలూ టాప్లెస్గా ఈతకొట్టొచ్చు..!
జర్మనీ రాజధాని బెర్లిన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ నగరంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా టాప్లెస్గా ఈతకొట్టేందు (Topless Swimming)కు అనుమతి కల్పించింది. ఈ నిర్ణయం వెనుక ఓ మహిళా పోరాటం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: స్విమ్మింగ్ పూల్స్ వద్ద దుస్తుల విషయంలో వివక్ష చూపుతున్నారంటూ ఓ మహిళ చేసిన పోరాటానికి అధికారులు దిగొచ్చారు. పబ్లిక్ పూల్స్ (Public Swimming Pools)లో పురుషులతో సమానంగా ఇక మహిళలు కూడా టాప్లెస్ (Topless Swimmimg)గా ఈతకొట్టేందుకు అనుమతి కల్పించారు. జర్మనీ రాజధాని బెర్లిన్ (Berlin) నగర అధికారులు ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
బెర్లిన్కు చెందిన ఓ మహిళ ఇటీవల ఓ స్థానిక ఓపెన్-ఎయిర్ పూల్లో టాప్లెస్ (Topless)గా సన్బాత్ చేసింది. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన అక్కడి సిబ్బంది ఆమెను పూల్ నుంచి బయటకు పంపించేశారు. దీంతో ఆమె న్యాయచర్యలకు దిగింది. స్విమ్మింగ్ పూల్లో దుస్తుల విషయంలో మహిళలకు సమానత్వం కల్పించాలని, పురుషుల్లాగే టాప్లెస్గా ఉండేందుకు అనుమతినివ్వాలని కోరుతూ సెనేట్ అంబుడ్స్పర్సన్ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. ఆమె వినతిని పరిశీలించిన అధికారులు.. బహిరంగ ఈత కొలనుల వద్ద కొంతమంది వివక్షకు గురవుతున్నారని అంగీకరించారు. ఇకపై బెర్లిన్లోని పూల్స్కు వెళ్లే అందరు విజిటర్స్.. టాప్లెస్గా ఈతకొట్టేందుకు (Topless Swimming) అనుమతినిచ్చారు.
అంబుడ్స్పర్సన్ కార్యాలయం జోక్యంతో.. బెర్లిన్లో పబ్లిక్ పూల్స్ (Public Pools)ను నిర్వహించే బెర్లినర్ బేడర్బెట్రీబ్ తమ దుస్తుల నిబంధనలను అధికారుల ఉత్తర్వులకు అనుగుణంగా మార్చేసింది. ఇకపై స్విమ్మింగ్పూల్స్ అందరూ టాప్లెస్గా ఈత కొట్టొచ్చంటూ కొత్త నిబంధనలు రూపొందించింది. అయితే ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయనే దానిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ.. ఈ నిర్ణయంపై హక్కుల సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే ఆ దేశంలోని కొన్ని నగరాల్లో పబ్లిక్ పూల్స్ వద్ద టాప్లెస్ స్విమ్మింగ్కు అనుమతి ఉంది. తాజాగా బెర్లిన్ కూడా ఆ జాబితాలో చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి