Mexico: ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది వలసదారులు మృతి

మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకొని 18 మంది వలసదారులు మృతి చెందారు. మరో 27 మంది గాయపడ్డారు. 

Updated : 07 Oct 2023 15:02 IST

మెక్సికో: మెక్సికో (Mexico)లో ఘోర బస్సు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తోన్న బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 18 మంది మృతి చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దక్షిణ మెక్సికోలోని వుహకా-పేబ్లా ప్రాంతాలను కలిపే రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతుల్లో వెనుజువెలా, హైతికి చెందిన ముగ్గురు మైనర్లున్నారు. వివిధ దేశాలకు చెందిన వేలాది మంది తరచూ మెక్సికో గుండా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే వలసదారులతో మెక్సికో-అమెరికా సరిహద్దు ప్రాంతానికి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. గత ఆగస్టు, సెప్టెంబర్‌లోనూ ఇలాంటి వాహనాలు ప్రమాదానికి గురై పదుల సంఖ్యలో వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని