Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
వేడిగాలుల తీవ్రతతో చిలీ(Chile) దేశంలో కార్చిచ్చు వ్యాపించింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రం కానుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
శాంటియాగో: లాటిన్ అమెరికా దేశం చిలీ(Chile) కార్చిచ్చు(wildfire)లో చిక్కుకుపోయింది. అక్కడి అటవీ ప్రాంతాల్లో అగ్ని కీలలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. రహదారుల మీదకు దూసుకొస్తున్నాయి. వేడిగాలుల ఎఫెక్ట్తో వేల ఎకరాలు దగ్ధమవుతున్నాయి. వీటిని అదుపులోకి తెచ్చే క్రమంలో.. అలాగే వీటి నుంచి బయటపడే ప్రయత్నంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
చిలీ రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబయో(Biobio), నుబుల్(Nuble) ప్రాంతంలో కార్చిచ్చు దావానలంలా వ్యాపించిందని స్థానిక అధికారులు వెల్లడించారు. 14 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైందని తెలిపారు. ఈ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో అగ్ని మాపక సిబ్బంది ఒకరు బలయ్యారు, మరికొందరికి తీవ్ర గాయలయ్యాయి. ఈ మంటలు రహదారి మీదకు దూసుకురావడంతో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో ఘటనలో అత్యవసర సేవల బృందానికి చెందిన హెలికాఫ్టర్ కూలిపోవడంతో మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మొత్తంగా ఇప్పటివరకు 13 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కార్చిచ్చుతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని, దగ్గర్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ఇప్పటివరకు వందల ఇళ్లు కాలిపోయాయని హోంమంత్రి కరోలినా తోహా వెల్లడించారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో చిలీ ప్రభుత్వం అత్యయిక స్థితిని విధించింది. ఇంకా వేడిగాలులు తీవ్రత పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ హెచ్చరించింది. గతంలో కంటే రెండు రెట్లు అధికంగా అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన మూడు యుద్ధనౌకలు సింగపూర్ చేరుకున్నాయి. -
ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. -
సునీత అంతరిక్ష యాత్ర వాయిదా
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర చివర్లో వాయిదా పడింది. -
నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
జెలెన్స్కీ హత్యకు రష్యా కుట్రను ఛేదించాం
తమ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ మంగళవారం ప్రకటించింది. -
శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే..
భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. -
మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు
మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల.. వయసు మీద పడే ప్రక్రియతో ముడిపడిన జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
రఫా క్రాసింగ్ను ఆక్రమించిన ఇజ్రాయెల్
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం రఫాపై దాడిని కొనసాగించాలనే నిర్ణయించింది.