China: తియానన్మెన్ స్క్వేర్ ఘటన గుర్తొచ్చేలా ఐస్క్రీమ్ చూపించారని..!
తియానన్మెన్ స్క్వేర్ ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేసే కార్యక్రమాన్ని చైనా ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా
ఇంటర్నెట్డెస్క్: తియానన్మెన్ స్క్వేర్ ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేసే కార్యక్రమాన్ని చైనా ఇప్పటికీ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏడాది జూన్ 4వ తేదీన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ..ఈ సారి ఇది అంతబాగా పనిచేసినట్లు కనిపించలేదు. చాలా మంది నెటిజన్లు తియానన్మెన్ స్క్వేర్ ఘటనను పేర్కొన్నారు. శుక్రవారం చైనాలోని టాప్ ఈ కామర్స్ ఇన్వెస్టర్ లీజియాకీ తన షోలో సహ హోస్ట్తో కలిసి వియన్నెట్టా ఐస్క్రీమ్ను ప్రదర్శించారు. దీనిని బ్రిటిష్ బ్రాండ్ అయిన వాల్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఈ ఐస్క్రీమ్ చుట్టూ ఓరియో బిస్కెట్లు అతికించారు. పైన చాక్లెట్ స్ట్రా వంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇది చూడటానికి యుద్ధ ట్యాంకులా ఉంది. దీనిని జూన్4వ తేదీ రావడానికి కొద్ది సేపటి ముందు అర్ధరాత్రి ప్రదర్శించారు. తియానన్మెన్ స్క్వేర్ ఘటనకు చిహ్నంగా తరచూ యుద్ధట్యాంకునే ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే.
లీజియాకీ ఐస్క్రీమ్ను ప్రదర్శిస్తోన్న సమయంలోనే చాలా మందికి అదేమిటో అర్థం కాలేదు. అదే సమయంలో ఒక్కసారిగా లైవ్ స్ట్రీమ్ కట్ అయ్యింది. తమ టీమ్ సాంకేతిక సమస్యలను సరిచేస్తోందని లీ వెల్లడించారు. కానీ, రెండు గంటల తర్వాత లైవ్లోకి వచ్చి పాత లైవ్ పునరుద్ధరించడం కుదరదని చెప్పారు. లైవ్లో ప్రసారం చేయని వస్తువులను కూడా మీకు అందుబాటులోకి తెస్తాం అని పేర్కొన్నారు.
ఆ తర్వాత లీ పేరును టౌబౌ అనే ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లో సెర్చి చేస్తే సరైన రిజల్ట్స్ చూపించడంలేదు. టౌబౌ ప్లాట్ఫామ్పైనే అతడు లైవ్స్ట్రీమింగ్ షోను నిర్వహించారు. అతడికి 6 కోట్ల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. తియానన్మెన్ స్క్వేర్ ఘటన విషయాలు బయటకు రాకుండా చైనా ఏ స్థాయిలో అణచివేస్తోందో ఈ ఘటనను చూస్తే అర్థమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.