India-Canada: దౌత్యవేత్తల తగ్గింపు వివాదం.. కెనడాకు వత్తాసు పలికిన అమెరికా, యూకే
India-Canada Diplomatic Row: దౌత్యవేత్తల తగ్గింపుపై భారత్, కెనడా మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. ఈ పరిణామాలపై అమెరికా, బ్రిటన్ స్పందించారు. భారత్ నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదంటూ కెనడాకు మద్దతుగా ఈ దేశాలు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
వాషింగ్టన్: భారత్ (India) హెచ్చరికల కారణంగానే తమ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చినట్లు కెనడా (Canada) చేసిన ప్రకటనతో ఇరు దేశాల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా (USA) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. వియన్నా ఒప్పంద (Vienna Convention) సూత్రాల ప్రకారం దౌత్య సంబంధాలపై న్యూదిల్లీ తన బాధ్యతలను నిర్వర్తించాలని తాము ఆశిస్తున్నట్లు అగ్రరాజ్యం పేర్కొనడం గమనార్హం. అటు ఈ వ్యవహారంపై యూకే (UK) కూడా స్పందిస్తూ.. కెనడాకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. (India-Canada Diplomatic Row)
పరిణామాలు ఆందోళనకరం: అమెరికా
‘‘భారత్లో కెనడా తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని దిల్లీ డిమాండ్ చేయడం.. దానికి ప్రతిస్పందనగా కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విభేదాల పరిష్కారానికి దౌత్యవేత్తలు విధుల్లో ఉండటం అవసరం. కెనడా తమ దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని భారత్ వారిపై ఒత్తిడి చేయొద్దని మేం ఇప్పటికే దిల్లీని కోరాం. అంతేగాక, కెనడా దర్యాప్తునకు (నిజ్జర్ హత్య అంశంలో) భారత్ సహకరించాలని అభ్యర్థించాం. 1961 నాటి వియన్నా ఒప్పంద సూత్రాల కింద దౌత్య సంబంధాలపై తన బాధ్యతలను భారత్ సమర్థించాలి. కెనడా దౌత్య మిషన్లో గుర్తింపు పొందిన సభ్యులకు లభించే అధికారాలు, దౌత్యపరమైన రక్షణ వారికి కల్పించాలి’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
భారత్ నుంచి 41 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి రప్పించాం
భారత్ నిర్ణయాన్ని అంగీకరించం: యూకే
అటు బ్రిటన్ విదేశాంగ శాఖ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ‘‘భారత్ నుంచి కెనడా తమ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకునేలా దిల్లీ తీసుకున్న నిర్ణయాన్ని మేం అంగీకరించలేం. దౌత్యవేత్తలకు భద్రత కల్పించే దౌత్య రక్షణకు ఏకపక్షంగా ఎత్తివేయడం.. వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణంగా లేదు’’ అని యూకే విదేశాంగ శాఖ కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తొలుత అమెరికా తటస్థంగా వ్యవహరించగా.. ఆ తర్వాత కెనడాకు మద్దతుగా పలుమార్లు వ్యాఖ్యలు చేసింది. కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని పేర్కొంది. తాజాగా దౌత్యవేత్తల తగ్గింపు వివాదంపైనా అమెరికా.. కెనడాకు మద్దతుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
భారత్లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యుల(42)తో సహా వెనక్కి రప్పించుకున్నట్టు కెనడా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్ చేసిన హెచ్చరిక అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని కెనడా తమ అక్కసు వెళ్లగక్కింది. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. తాము నిబంధనలకు అనుగుణంగానే దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..