Ukraine Crisis: చర్చల వద్ద ఏమీ తినొద్దు.. తాగొద్దు..!
టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగుతున్న చర్చల వేదిక వద్ద ఏమి తినడం, తాగడం వంటివి చేయవద్దని శాంతి చర్చల దూతలను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా హెచ్చరించారు.
ఇంటర్నెట్డెస్క్: టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో జరుగుతున్న చర్చల వేదిక వద్ద ఏమి తినడం, తాగడం వంటివి చేయవద్దని తమ దూతలను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబ హెచ్చరించారు. ‘‘రష్యన్ ఫెడరేషన్తో చర్చలకు వెళుతున్న వారిని ఒక్క విషయంలో హెచ్చరిస్తున్నా. అక్కడ తినడం, తాగడం వంటివి చేయవద్దు.. వీలైనంత వరకు ఎటువంటి వస్తువులను తాకవద్దు’’ అంటూ దిమిత్రి కులేబ పేర్కొన్నారు. ఆయన జాతీయ టీవీలో వచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల మొదట్లో జరిగిన చర్చల సమయంలో రష్యా ధనికుడు రోమన్ అబ్రహమోవిచ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన కంటి చూపు కొద్దిసేపు పాక్షికంగా దెబ్బతింది. ఆ తర్వాత ఆయన వేగంగా కోలుకొన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ విజ్ఞప్తికి అంగీకరించి.. సాయం చేసేందుకు వచ్చారు. వాస్తవానికి ఆయన చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడగల సమర్థుడు. ఈ చర్చల్లో అదే చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో అబ్రహమోవిచ్ పై విషప్రయోగం జరగడం ఉక్రెయిన్ను ఆందోళనకు గురి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.