Nepal: నేపాల్లో మళ్లీ రాజకీయ సంక్షోభం?
నేపాల్ ప్రభుత్వంలో మరోసారి సంక్షోభం తలెత్తింది. ఈ సారి ఓలి వర్గం మద్దతు ఉపసంహరించుకొంది.
ఇంటర్నెట్డెస్క్: నేపాల్(Nepal)లో పుష్ప కమల్ దహల్ (ప్రచండ) నేతృత్వంలోని ప్రభుత్వానికి సోమవారం సీపీఎన్ - యూఎంఎల్ మద్దతు ఉపసంహరించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకుడు ఒకరు ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ సమీకరణల్లో మార్పుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించారు. తొలుత మార్చి9న అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు వేచిచూద్దామని యూఎంఎల్ భావించింది. కానీ, రాజకీయ విభేదాలు తీవ్రం కావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
అసలే బలహీనంగా ఉన్న నేపాల్ ప్రభుత్వానికి ఇది పెద్ద కుదుపు. సీపీఎన్-యూఎంఎల్కు చెందిన బిమల రాయ్ పౌడ్యాల్ జెనీవా పర్యటనను ప్రధాన మంత్రి రద్దు చేశారు. అదే సమయంలో సచివాలయంలో మీటింగ్కు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు. మద్దతు ఉపసంహరణ వేగంగా తీసుకోవడం వెనుక ఈ ఘటన కూడా కారణం కావచ్చని ప్రచారం జరుగుతోంది.
తమ నిర్ణయం వెనుక కారణాన్ని యూఎంఎల్ వైస్ ఛైర్మన్ బిష్ణు పౌడెల్ వివరించారు. ‘‘నేపాల్ ప్రధాని విభిన్న పద్దతుల్లో పాలించడం మొదలుపెట్టాకే మేం మద్దతు ఉపసంహరణపై నిర్ణయం తీసుకొన్నాం. అంతేకాదు, అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించిన రాజకీయ సమీకరణల్లో మార్పులు కూడా కారణమే’’ అని ఆయన వెల్లడించారు. ప్రచండ-ఓలీ మధ్య విభేదాలకు అధ్యక్ష ఎన్నికలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నేపాల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ చంద్ర పౌడెల్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రచండా వర్గం భావిస్తోంది. పౌడెల్ నేపాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ఓలి వర్గం వ్యతిరేకిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో యూఎంఎల్ పార్టీతరుపున సుభాశ్ నెంబాగ్ను బరిలోకి దించాలని సీపీఎన్-యూఎంఎల్ నిర్ణయించింది.
అధికార పంపిణీ ఒప్పందంలో తలెత్తిన విభేదాల కారణంగా 2022 డిసెంబర్లోనే ప్రచండ కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. 275 సీట్లు ఉన్న ప్రతినిధుల సభలో 138కి పైగా సీట్లు పొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే, ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి పలు పార్టీలకు సూచించారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా తన మద్దతుదారులతో కలిసి వెళ్లి ప్రచండ రాష్ట్రపతిని కోరారు.
ఆయనకు అప్పట్లో సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కేపీ శర్మ ఓలి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు రవి లమిచ్చనే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర లింగడేన్ తదితరులు మద్దతు తెలిపారు. పార్లమెంట్లోని 275 మంది సభ్యుల్లో 165 మంది ప్రచండకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ప్రచండ నేపాల్ ప్రధానిగా మూడో సారి నియమితులయ్యారు. కనీసం మూడు నెలలు కూడా కాకుండానే అధికార కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. ఈ సారి నేపాల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదుకొనే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ఎన్నికల విషయంలో తమ ప్రమేయం ఉండదని అమెరికా (USA) స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలను ఖండించింది. -
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
ఫోరిడాలో పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నల్లజాతీయుడు మృతి చెందడంతో అక్కడ నిరసన వ్యక్తమైంది. -
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?