Omicron: వారంలో 71% పెరిగినకొత్త కేసులు: డబ్ల్యూహెచ్వో
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కల్లోలం రేపుతోంది. ప్రధానంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉంది.
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కల్లోలం రేపుతోంది. ప్రధానంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. వారం రోజుల వ్యవధిలో ఏకంగా 71% కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబరు 27 - జనవరి 2 మధ్య అంతకు ముందు వారంతో పోలిస్తే ఈ పెరుగుదల నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గురువారం తెలిపింది. అయితే కొంత ఊరటనిచ్చేలా.. కొత్తగా నమోదైన మరణాల సంఖ్య 10% తగ్గినట్లు వెల్లడించింది. ఈమేరకు గత వారంలో 95 లక్షల కేసులు నమోదు కాగా, 41 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా అమెరికాలో కేసులు 100% పెరగ్గా, ఆగ్నేయాసియాలో 78%, ఐరోపాలో 65%, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 40%, పశ్చిమ పసిఫిక్లో 38%, ఆఫ్రికన్ ప్రాంతంలో 7% కేసులు పెరిగినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
- ప్రపంచవ్యాప్తంగా బుధవారం 25.7 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 7,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే 7 లక్షలకు పైగా రోజువారీ కేసులు బయటపడ్డాయి. ఫ్రాన్స్ (3.3 లక్షలు), బ్రిటన్ (1.9 లక్షలు), ఇటలీ (1.89 లక్షలు), స్పెయిన్ (1.37 లక్షలు)లోనూ భారీగా కేసులు నమోదయ్యాయి.
- అమెరికాలోని కాలిఫోర్నియాలో అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది కొవిడ్ బారిన పడటంతో ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రమవుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసి పోతుండగా.. వారికి చికిత్సలు అందించలేని పరిస్థితి ఎదురవుతోంది. దాదాపు 40% ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత నెలకొన్నట్లు తెలుస్తోంది.
- సింగపూర్లో డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్తో మరింత పెద్ద కొవిడ్ వేవ్ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. డెల్టా వేరియంట్ కేసులు రెట్టింపు కావడానికి 6-8 రోజులు పట్టగా.. ఒమిక్రాన్ విషయంలో కేవలం రెండు మూడు రోజుల్లోనే ఆ స్థాయికి పెరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
- చైనాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జియాన్ నగరానికి అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేశారు. డిసెంబరు ప్రారంభం నుంచి ఇక్కడ లాక్డౌన్ అమలవుతుండగా.. ఇప్పటికే దేశీయ విమానాలపై నిషేధం విధించారు.
- థాయిలాండ్లో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం 4వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఇక్కడ 5,775 కొత్త కేసులు బయటపడ్డాయి. 4వ హెచ్చరిక ప్రకారం.. అధిక ముప్పు ఉన్న ప్రాంతాలను మూసివేస్తారు. అంతర్గత ప్రయాణాలపై ఆంక్షలు పెంచుతారు. బహిరంగ ప్రాంతాల్లో
గుమిగూడటంపై పరిమితి విధిస్తారు.
- ఫిలిప్పీన్స్లో కొవిడ్ పాజిటివిటీ రేటు ఏకంగా 36.9%కి పెరిగింది. అంటే పరీక్షలు జరిపిన ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. ఇక్కడ గురువారం 17,220 కేసులు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!