Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
భూకంపాలు రావడానికి కారణం భూ ఫలకాల కదలికలే. కొన్ని చోట్ల వీటి కదలికలు భారీ భూకంపాలు రావడానికి కారణమవుతుంటాయి.
భూకంపాలు రావడానికి కారణం భూ ఫలకాల కదలికలే. కొన్ని చోట్ల వీటి కదలికలు భారీ భూకంపాలు రావడానికి కారణమవుతుంటాయి. అలాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో సంవత్సరానికి కొన్ని వందల భూకంపాలు వస్తున్నప్పటికీ.. వాటి తీవ్రత తక్కువ కావడంతో పెద్దగా నష్టం వాటిల్లదు. అలా భూప్రకంపనలు చోటుచేసుకునే తొలి ఐదు దేశాలు ఇవే..
జపాన్.. భూకంపాలు, సునామీ అనగానే గుర్తొచ్చే దేశం జపాన్. భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశమున్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఈ దేశ భూభాగం ఎక్కువగా ఉండటమే ఇక్కడి విపత్తులకు ప్రధాన కారణం. గుర్రపు నాడ ఆకారంలో ఉండే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాదేశిక స్థలంలో 40 వేల కి.మీ. మేర చలనశీల టెక్టానిక్ ప్లేట్లు ఉండటం విశేషం. అయితే భూకంపం, సునామీలు ముంచుకొచ్చినపుడు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఈ దేశం అనేక చర్యలు తీసుకుంటోంది. ఏటా సెప్టెంబరు 1న విపత్తు నివారణ దినం పేరుతో పలు విన్యాసాలు చేపడుతోంది.
ఫిలిప్పీన్స్.. రింగ్ ఆఫ్ ఫైర్కు సరిహద్దుల్లోనే ఉన్నప్పటికీ ఫిలిప్పీన్స్లోనూ భూకంపాల ప్రమాదం ఎక్కువే. అంతేకాకుండా భూకంపాల వల్ల ఇక్కడి అగ్నిపర్వతాలు పేలిన ఘటనలూ ఈ దేశ చరిత్రలో ఉన్నాయి. విపత్తును ఎదుర్కోవడానికి ఫిలిప్పీన్స్ పలు విధానాలను అమలుచేస్తోంది.
ఇండోనేసియా.. ప్రపంచంలో వచ్చే భూకంపాల్లో 90 శాతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లోనే నమోదవుతాయని అంచనా. అలాంటి ప్రాంతంలో అత్యంత సున్నితమైన ప్రదేశంలో ఇండోనేసియా ఉంటుంది. చిన్న, మధ్య స్థాయి భూకంపాలు ఇక్కడ సర్వసాధారణం.
ఈక్వెడార్.. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న అగ్ని పర్వతాల వల్ల ఈక్వెడార్లో భూకంపాలు, భూప్రకంపనల ప్రమాదం చాలా ఎక్కువ. దక్షిణ అమెరికా, నాజ్కా భూఫలకాల మధ్య ఘర్షణ మరో ప్రధాన కారణం.
తుర్కియే.. ప్రస్తుతం వరస భూప్రకంపనలతో అల్లాడుతున్న తుర్కియే.. యురేషియా, ఆఫ్రికా, అరేబియా అనే మూడు భూఫలకాలపై ఉంది. అనేక భూ పటల (ఎర్త్ క్రస్ట్) చీలికలపై ఈ దేశ భూభాగం ఉండటంతో భూకంపాలు రావడానికి ఎక్కువ ఆస్కారముంది. ఒక్క 2021లోనే ఈ దేశంలో 23,735 భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రఖ్యాత పర్యాటక స్థలం ఇస్తాంబుల్ నగరాన్ని భూకంపాల నుంచి కాపాడటానికి అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తుర్కియే గతంలో ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
చైనా యుద్ధ విమానాలు మరోసారి ఆస్ట్రేలియాను బెదిరించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. -
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
క్రెమ్లిన్లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. -
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. -
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM