పుతిన్పై ఐసీసీ వారెంటు అమలు అసాధ్యమే
రష్యా అధ్యక్షుడు పుతిన్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంటు ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నిపుణుల విశ్లేషణ
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంటు ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాము ఐసీసీని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాకు వర్తించబోవని క్రెమ్లిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. పుతిన్ను అదుపులోకి తీసుకోవడం అసాధ్యమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా ల్వోవా బెలోవాపై కూడా ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.ఉక్రెయిన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ పుతిన్పై వారెంట్ జారీ చేసినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై సైనిక చర్య ప్రారంభమైన సమయంలో ఈ నేరాలకు పాల్పడినట్లు పేర్కొంది. ఈ అంశంపై నిపుణుల విశ్లేషణ ఇదీ.
* అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలిగించే.. మారణహోమం, మానవత్వంపై దాడులు, యుద్ధ నేరాల వంటి అత్యంత తీవ్రమైన నేరాలను ఐసీసీ విచారిస్తుంది. కానీ అనుమానితులను అరెస్టు చేసే అధికారాలు ఆ న్యాయస్థానానికి లేవు.
* ఐసీసీ ఒప్పందంపై రష్యా సంతకం చేయలేదు. దీంతో అనుమానితులను అప్పగించడం అసాధ్యం.
* అధ్యక్షుడిగా పుతిన్కు స్వదేశంలో సర్వాధికారాలు ఉన్నాయి. రష్యాలో ఉన్నంత వరకు ఆయనకు అరెస్టు భయం లేదు. ఒకవేళ స్వదేశాన్ని వీడితే ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ప్రయాణాల విషయంలో పుతిన్ అప్రమత్తమయ్యే అవకాశం ఉంది.
* ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. పుతిన్పై దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. అందువల్ల ఐసీసీ ఆదేశాలు అమలు చేయాలనుకునే దేశాల్లో పుతిన్ పర్యటించడం కుదరకపోవచ్చన్న భావన ఉంది. అయితే ఆయన పర్యటించినా.. సంబంధిత దేశం ఆయనను అరెస్టు చేసే సాహసం చేస్తుందా అన్నది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఐసీసీ వారెంటును ఎదుర్కొంటున్న సుడాన్ మాజీ అధ్యక్షుడు ఒమర్ బషీర్.. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఐసీసీ సభ్య దేశాల్లో పర్యటించడం ఇక్కడ ప్రస్తావనార్హం.
* రష్యాతోపాటు అమెరికా, చైనా, ఉక్రెయిన్ కూడా ఐసీసీ ఒప్పందంలో భాగస్వాములు కాకపోవడం గమనార్హం. ఇందులో చేరితే తమ బలగాలు, అధికారులకు విచారణ ముప్పు ఉంటుందని అమెరికా దీన్ని నిరాకరిస్తోంది. అయితే అమెరికా, ఉక్రెయిన్లు ఐసీసీకి సంబంధించిన కొన్ని కేసుల దర్యాప్తునకు సహకరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి