భారత్, అమెరికాలది అసమాన స్నేహం
ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులనుబట్టి చూస్తే భారత్, అమెరికాల స్నేహం ప్రపంచంలోనే అసమానమని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ పేర్కొన్నారు.
అమెరికా రాయబారి గార్సెట్టీ
దిల్లీ: ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులనుబట్టి చూస్తే భారత్, అమెరికాల స్నేహం ప్రపంచంలోనే అసమానమని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ పేర్కొన్నారు. జూన్లో అమెరికాలో ప్రధాని మోదీ పర్యటించనున్న సందర్భంగా రెండు దేశాల వ్యూహాత్మక బంధం మరింత విస్తృతం కానుందని తెలిపారు. మంగళవారం దిల్లీలో గార్సెట్టీ ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘రక్షణ రంగంలో మరింత సహకారం కోసం కుదుర్చుకునే ఒప్పందాలపై రెండు దేశాలు పని చేస్తున్నాయి. అవి మోదీ జూన్లో అమెరికాకు, బైడెన్ సెప్టెంబరులో భారత్కు వచ్చినప్పుడు కార్యరూపం దాల్చనున్నాయి. చైనాతో సరిహద్దు వివాదం విషయంలో భారత్కు అమెరికా నమ్మకమైన భాగస్వామే. సరిహద్దులను గౌరవించడంతో సార్వభౌమాధికారం, చట్టాల విషయంలో అమెరికా ఎప్పుడూ రక్షణగానే నిలుస్తుంది. భారత్, అమెరికాలకు చైనాతో శాంతియుత సంబంధాలే కొనసాగాలని కోరుకుంటాం. అయితే ఎవరు రెచ్చగొట్టేలా వ్యవహరించినా అంగీకరించం. తీవ్రవాదం, డ్రగ్స్, అంతర్జాతీయ నేర నెట్వర్క్లపై కలిసే పని చేస్తాం. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాం. భారత్, అమెరికాల భౌగోళిక, రాజకీయ బంధం రెండు దేశాలకే కాదు. ప్రపంచానికే ప్రయోజనకరం. భారత్కు ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన టెక్నాలజీని బదిలీ చేసి స్థానికంగా తయారు చేసుకునే అవకాశమిస్తున్నాం. ఇలాంటి అవకాశం మా సన్నిహిత దేశాలకూ ఇవ్వడం లేదు. దీనిని బట్టి భారత్, అమెరికా బంధం ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే నెలలో మోదీ పర్యటన సందర్భంగా రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, ప్రజల మధ్య సంబంధాలపై మరింతగా చర్చలు జరగనున్నాయి. మోదీ పర్యటన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’ అని గార్సెట్టీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి