మరింత దిద్దుబాటలో మాల్దీవులు
ప్రధాని మోదీ, లక్షద్వీప్పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం పూనుకుంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానివి కావని మరోసారి స్పష్టం చేసింది.
మంత్రుల వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టీకరణ
భారత హైకమిషనర్ భేటీలో వివరణ
మాలె, దిల్లీ: ప్రధాని మోదీ, లక్షద్వీప్పై తమ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై మరిన్ని దిద్దుబాటు చర్యలకు మాల్దీవుల ప్రభుత్వం పూనుకుంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానివి కావని మరోసారి స్పష్టం చేసింది. మాల్దీవుల విదేశాంగశాఖ ప్రతినిధి అలీ నాజర్ మహమ్మద్తో సోమవారం భారత హైకమిషనర్ మును మహావర్ భేటీ అయ్యారు. మంత్రులు, ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలు కావని అలీ నాజర్ వివరించినట్లు అధికారి ఒకరు తెలిపారు. పొరుగు దేశంతో సత్సంబంధాలనే కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేసినట్లు వివరించారు. అంతకుముందు దిల్లీలోని మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహీబ్ను విదేశాంగశాఖ పిలిపించింది. మోదీపై మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మోదీపై, లక్షద్వీప్పై విద్వేష వ్యాఖ్యలు చేసిన మంత్రులు ముగ్గురిని ఆదివారం మాల్దీవుల ప్రభుత్వం సస్పెండు చేసిన సంగతి తెలిసిందే.
మాల్దీవులకు విమానాల బుకింగ్ను నిలిపేసిన ఈజ్ మైట్రిప్
భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రైవేటు పర్యాటక సంస్థ ఈజ్ మైట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమానాల బుకింగ్ను నిలిపేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిత్తీ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది.
బాయ్కాట్ ట్రెండింగ్ వేళ చైనాలో అధ్యక్షుడు
ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించడంపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన వేళ ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు చైనా పర్యటనకు వెళ్లారు. తన సతీమణితో కలిసి ఆదివారం రాత్రి ఆయన పయనమయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఐదు రోజుల అధికారిక పర్యటన సాగుతోంది. మయిజ్జుకు చైనాకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా అక్కడికే వెళ్లారు.
లక్షద్వీప్కు అమితాబ్ ప్రచారం
లక్షద్వీప్లో పర్యాటకానికి తన ప్రోత్సాహం అందిస్తానని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తెలిపారు. లక్షద్వీప్, అండమాన్లాంటి మన ప్రాంతాలే అత్యుత్తమం అని కొనియాడారు. ‘మనం ఇండియన్లం. మనం స్వయం సమృద్ధి సాధించాం. మా ఈ స్వీయ అభివృద్ధిని పరీక్షించొద్దు. జైహింద్ (హమ్ భారత్ హై.. హమారీ ఆత్మ నిర్భరతా పర్ ఆంచ్ మత్ దాలియే జై హింద్)’ అని అమితాబ్ ఎక్స్లో పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఐఆర్ఎన్ఏ పేర్కొంది. అక్కడి సహాయక బృందాలను పంపినట్లు వెల్లడించింది. -
రోదసిలోకి తెలుగుతేజం
తెలుగు తేజం గోపీచంద్ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. -
అడవిలో కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆకాశంలో రాకాసి ఉల్క
స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. -
గాజాపై గగనతల దాడిలో 27 మంది మృతి
ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో గాజాలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నుసీరత్లో పాలస్తీనా శరణార్థి శిబిరంపై చోటుచేసుకున్న ఈ ఘటన మృతుల్లో 10 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. -
బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్తుల కంటే రిషి సునాక్ దంపతుల సంపదే ఎక్కువ
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు ఇటీవల గణనీయంగా పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. -
కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం
దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. -
విషమంగానే స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆరోగ్యం
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59) ఆరోగ్యం ఆదివారమూ విషమంగానే ఉంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికోపై ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. -
అఫ్గాన్లో కొనసాగుతున్న కుండపోత వర్షాలు
అధిక వర్షాలు అఫ్గానిస్థాన్ను అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. కుండపోత వానలకు వరదలు తోడు కావడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. -
ఆ ఘటనతోనే భారత్తో వాణిజ్య బంధానికి తెర : పాక్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై భారత్ అధిక సుంకాలు విధించడం ప్రారంభించిందని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ అన్నారు. -
రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు
రష్యా, ఉక్రెయిన్లు పరస్పరం డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. దీనివల్ల పలుచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తమ దేశంలోకి వచ్చిన 57 డ్రోన్లు, పలు క్షిపణులను కూల్చేశామని రష్యా ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం