ట్రంప్ మానసికస్థితి సరిగా లేదు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఎదురు దాడికి దిగారు.
నిక్కీ హేలీ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఎదురు దాడికి దిగారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, వయో భారంతో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించలేరని విమర్శించారు. శనివారం ఎన్నికల ప్రచారంలో తనపై పరుష వ్యాఖ్యలు చేసిన ట్రంప్పై ఆమె ఈ మేరకు స్పందించారు. ‘‘గత రాత్రి ఎన్నికల ర్యాలీలో ట్రంప్ నా పేరును పదేపదే ప్రస్తావించారు. 2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో నేను సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నాడు నేను ఆ భవన భద్రతకు బాధ్యురాలిగా ఉన్నానని ఆయన భావిస్తున్నారు. నన్ను నాన్సీగా పొరబడ్డారు. వాస్తవానికి 2021 జనవరి 6న నేను వాషింగ్టన్ డీసీలో లేను. దేశం, ప్రపంచంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు 80 ఏళ్ల నిండిన వ్యక్తులు (బైడెన్, ట్రంప్ను ఉద్దేశించి) అధ్యక్షులుగా మనకు అవసరమా?’’ అని నిక్కీ ప్రశ్నించారు. తనకు తల్లిదండ్రులు మొదటపెట్టిన ‘నమ్రత’ను నింబ్రతగా ట్రంప్ ఉచ్ఛరించడాన్ని, తద్వారా తన భారతీయ మూలాలను తెరపైకి తీసుకురావడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ‘‘ట్రంప్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన అభద్రతాభావానికి గురైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు’’ అని నిక్కీ విమర్శించారు.
ఆయనకు ప్రపంచంలోని (చైనా, రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షుల పేర్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ) నియంతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న అంతర్గత ఎన్నికల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానంలో నిక్కీ కొనసాగుతున్నారు. తాజా సర్వేల ప్రకారం వీరిద్దరి మధ్య వ్యత్యాసం 10 శాతం మాత్రమేనని తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారసభలో.. నిక్కీ సొంత రాష్ట్రం దక్షిణ కరోలినాకు చెందిన నేతలు తన చుట్టూ ఉండేలా ట్రంప్ చూసుకున్నారు. తద్వారా న్యూహామ్షైర్లో జరిగే అంతర్గత ఎన్నికలకు ముందు తన బలాన్ని చాటేందుకు ప్రయత్నించారు. ఈ సభకు రాష్ట్ర గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, అటార్నీ జనరల్, ట్రెజరర్ తదితరులు హాజరయ్యారు. దక్షిణ కరోలినాకు చెందిన రాజకీయ నేతలంతా తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. మళ్లీ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడితే అందులో ఎలాంటి పదవిని స్వీకరిస్తారన్న ప్రశ్నకు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి సమాధానమివ్వలేదు. అయితే దేశంలో మార్పులు తీసుకురావడానికి అనేక మార్గాలు ఉన్నాయన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశించిన వివేక్.. రేసు నుంచి తప్పుకొని, ట్రంప్నకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
అంతరిక్షంలో ఆయుధాల నిరోధక అంశానికి సంబంధించి అమెరికా, రష్యా దేశాలు ఐరాసలో తీర్మానాలు ప్రవేశపెట్టాయి. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
ఇజ్రాయెల్ ప్రధాని సహా హమాస్ నేతలు యహ్యా సిన్వర్, మహమ్మద్ డెయిఫ్, ఇస్మాయిల్ హనియాపైనా అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ ఐసీసీలో పిటిషన్ దాఖలైంది. దీని వెనక ఒక స్టార్ హీరో సతీమణి ఉన్నారు. -
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు సిగ్నల్ వ్యవస్థే లేదా..?
ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన హెలికాప్టర్లో సిగ్నల్ వ్యవస్థ కూడా లేకపోయి ఉండొచ్చని తుర్కియే అనుమానం వ్యక్తం చేసింది. -
విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి
ఓ విమానం భారీగా కుదుపులకు లోనైన ఘటనలో ఒకరు మృతి చెందాడు. -
చైనా ఆక్రమిస్తే.. కిల్ స్విచ్ ఆన్ అవుతుంది: సెమీకండెక్టర్ తయారీ సంస్థల ప్లాన్..!
చైనాకు షాకిచ్చే ఓ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. బీజింగ్ ఏమాత్రం తైవాన్ మీదకు కాలు దువ్వినా.. చిప్ తయారీ యంత్రాలు వాటంతట అవే నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. -
యూరప్ ట్రిప్ మరింత భారం.. షెంజెన్ వీసా ఫీజు పెంపు
Schengen Visa: షెంజెన్ వీసా ఫీజును 12శాతం పెంచేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి రానుంది. -
మళ్లీ మరచిపోయిన బైడెన్.. ఈసారి ‘వైస్ ప్రెసిడెంట్’
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి గందరగోళానికి గురయ్యారు. కరోనా కాలంలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ ఆ టైంలో తాను ఉపాధ్యక్షుడిగా పనిచేశానంటూ మాట తుళ్లారు. -
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
BORG Drinking: బోర్గ్ డ్రింకింగ్ అనే ట్రెండ్ అమెరికా కాలేజ్ క్యాంపస్లలో కనిపిస్తోంది. ఇంతకీ ఏంటిది? ఎలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయో చూద్దాం..! -
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై విభిన్న ప్రచారాలు జరుగుతున్నాయి. అంతరిక్ష లేజర్లు.. వారసత్వ పోరు కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయారని వీటిల్లో పేర్కొంటున్నారు. -
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
Sri Lanka: బాధ్యతాయుత పొరుగుదేశంగా భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను అనుమతించబోమని శ్రీలంక స్పష్టం చేసింది. గత ఏడాది చైనా గూఢచార నౌక ఒకటి శ్రీలంక తీరంలో ఆగడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. అయితే, ఈ సందర్భంగా ఆయనపై ఉన్న ఆరోపణలను గుర్తుచేసింది. -
అదే డేంజర్ బెల్!
ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్. -
మతబోధకుడి స్థాయి నుంచి అధ్యక్ష పీఠం వరకు
ఇబ్రహీం రైసీ.. ప్రస్తుత ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకే కాదు.. అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీకీ సన్నిహితుడే. ఈ ఇద్దరి అధినేతల అండతోనే మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రైసీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. రైసీ సంస్కరణ వాది కాదు.. కరడుగట్టిన సంప్రదాయ వాది. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ ఇవ్వండి
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు. -
శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం
శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. -
అసాంజేకు భారీ ఊరట
గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు సోమవారం లండన్ న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. -
‘కలుషిత రక్తం’ కుంభకోణంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్లో 1970ల్లో చోటుచేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిషి సునాక్ సోమవారం క్షమాపణలు తెలిపారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. -
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక కార్యకలాపాలు కొనసాగించిన ఓ సెక్స్ వర్కర్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలుడి ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరి మృతి
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
-
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్