Viral news: ఆ బిచ్చగాడు.. కోటీశ్వరుడు.. ఆదాయమంతా డ్రగ్స్కే..
రూ.5 కోట్లకు అధిపతి అయిన వ్యక్తి రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ..ఫుట్పాత్లపై పడుకుంటాడని ఎప్పుడైనా ఊహించారా? మీరు విన్నది నిజమే.. అతడు కోటీశ్వరుడు. నెలకు అద్దెరూపంలోనే దాదాపు రూ.1.27 లక్షల వరకు వస్తాయి. అయినా బిచ్చమెత్తుకుంటాడు. ఎందుకో తెలుసా?
ఇంటర్నెట్డెస్క్: రూ.5 కోట్లకు అధిపతి అయిన వ్యక్తి రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ..ఫుట్పాత్లపై పడుకుంటాడని ఎప్పుడైనా ఊహించారా? మీరు విన్నది నిజమే.. అతడు కోటీశ్వరుడు. నెలకు అద్దెరూపంలోనే దాదాపు రూ.1.27 లక్షల వరకు వస్తాయి. కానీ, అతడు రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవిస్తాడు. అందమైన భవంతి ఉన్నా.. ఫుట్పాత్పై పడుకుంటాడు. అతడే లండన్కు చెందిన డోమ్. ఆయన గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం.
లండన్కు చెందిన డోమ్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు. కానీ, అథ్లెటిక్స్లో చురుగ్గా ఉండేవాడు. దీంతో అతడికి స్కాలర్ షిప్ వచ్చేది. ఆ డబ్బులతో జల్సా చేస్తూ, జులాయిగా తిరుగుతూ.. మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. 13 ఏళ్లు వచ్చేసరికి డ్రగ్స్, పొగ, ఆల్కహాల్ అన్నింటికీ బానిసయ్యాడు.. 17 ఏళ్ల వయస్సులోనే హెరాయిన్కు అలవాటయ్యాడు. అలా మరో ఏడేళ్లు గడిచేసరి ఆయనకు అలవాటులేని వ్యసనం ఇంకేం లేదన్నంతలా తయారయ్యాడు. పెళ్లయిన తర్వాతైనా మారుతాడేమోనని తల్లిదండ్రులు వివాహం చేశారు. అక్కడి నుంచి కొన్నాళ్లపాటు వాటికి దూరంగా ఉండేందుకు యత్నించాడు. కానీ, అతడివల్ల కాలేదు.
అతడి పరిస్థితిని గుర్తించిన తల్లిదండ్రులు భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఒక ఇల్లు కొని ఇచ్చారు. అస్తులన్నీ పోయినా.. ఉండటానికి ఓ నివాసం ఉంటుందనేది వారి ఆలోచన. అయితే, దాని ద్వారా వస్తున్న ఆదాయన్ని కూడా డ్రగ్స్కే వినియోగిస్తున్నాడట డోమ్. ఇంటి ద్వారా వచ్చే అద్దె సరిపోక.. రోడ్లపై బిక్షాటనకు వెళ్లి.. రోజుకు 200 నుంచి 300 పౌండ్లు సంపాదిస్తాడట. వాటితో మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి.. రోజంతా మత్తులోనే తూగుతూ ఉంటాడట. అలా, ఏదో రోడ్డుపక్కన పడుకోవడం..మళ్లీ తెలివి వచ్చాక బిక్షాటనకు బయలుదేరడం ఇదే అతడి దినచర్య. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరూ అతడిని పట్టించుకోరు. కానీ, దాదాపు రూ. ఐదుకోట్ల విలువ చేసే ఇంటిని కలిగి ఉన్న డోమ్.. ప్రస్తుతం డ్రగ్స్కు దూరంగా ఉండి సాధారణ జీవితాన్నిగడుపుదామని అనుకుంటున్నాడట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం